Nayanthara: వ్యాపార రంగంలోకి నయనతార దంపతులు.. ఏ బిజినెస్‌ చేయనున్నారంటే..?

నటి నయనతార (Nayanthara) వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఈ మేరకు ఆమె భర్త విఘ్నేశ్‌ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు.

Published : 14 Sep 2023 14:36 IST

చెన్నై: నటి నయనతార (Nayanthara), ఆమె భర్త విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) తాజాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. స్కిన్‌ కేర్‌ ప్రొడెక్ట్స్‌ బిజినెస్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం విఘ్నేశ్‌ శివన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ఆరేళ్ల మా కృషి, ప్రేమను ఈరోజు మీతో పంచుకోవడానికి ఎంతో ఆనందిస్తున్నాం. మా అధికారిక ఖాతా 9SkinOfficialను గర్వంగా, సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే, సెల్ఫ్‌ లవ్‌ ఎంతో ముఖ్యమని మేము నమ్మాం. ఈ నెల 29 నుంచి మా ప్రయాణం మొదలు కానుంది. ఆ రోజు నుంచి స్కిన్‌ కేర్‌కు సంబంధించిన ప్రొడెక్ట్స్‌ను మీరు మా అధికారిక సైట్‌లో కొనుగోలు చేయవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. దీనిపై నయన్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

NTR: ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ బయల్దేరిన ఎన్టీఆర్‌.. ఎందుకంటే?

ఇక, సినిమాల విషయానికి వస్తే.. ‘జవాన్‌’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నయనతార. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద ఇది భారీ వసూళ్లు రాబడుతోంది. ‘కాతు వక్కుల రెందు కాదల్‌’ తర్వాత విఘ్నేశ్‌.. అజిత్‌తో ఓ సినిమా ప్రకటించారు. ఈ సినిమా పట్టాలెక్కక ముందే  ఆగిపోయింది. మరోవైపు, సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది తారలు ఇప్పటికే వ్యాపార రంగంలో తమ సత్తా చాటుకుంటున్నారు. నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఫిట్‌నెస్‌ సెంటర్లు ఉండగా.. ‘సాకీ’ అనే బ్రాండ్‌తో దుస్తుల వ్యాపారంలోకి సమంత అడుగుపెట్టారు. శిల్పాశెట్టికి స్కిన్‌ కేర్‌ ప్రొడెక్ట్స్‌, కత్రినాకైఫ్‌కు మేకప్‌ ప్రొడెక్ట్స్‌ బిజినెస్‌తో రాణిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని