తారక్‌ ట్రాఫిక్‌ జరిమానా చెల్లించిన అభిమాని

సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కు ఎంతోమంది డైహార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాంటి అభిమానుల్లో ఒకరు తారక్‌ కారుకు సంబంధించిన ట్రాఫిక్‌ జరిమానా చెల్లించాడు. అంతేకాకుండా దానికి ప్రతిఫలంగా........

Published : 23 Jan 2021 01:41 IST

రిటర్న్‌ గిఫ్ట్‌ ఏం అడిగాడో తెలుసా

హైదరాబాద్‌: సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కు ఎంతోమంది డైహార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాంటి అభిమానుల్లో ఒకరు తారక్‌ కారుకు సంబంధించిన ట్రాఫిక్‌ జరిమానా చెల్లించాడు. అంతేకాకుండా దానికి ప్రతిఫలంగా హీరో ముందు ఓ చిన్న వినతిని ఉంచాడు.

నెహ్రూ ఔటర్‌ రింగురోడ్డుపై ఓవర్‌స్పీడ్‌లో కారు నడిపినందుకు గాను ట్రాఫిక్‌ పోలీసులు ఎన్టీఆర్‌కు రూ.1035 జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ అభిమాని ఆన్‌లైన్‌లో జరిమానా మొత్తాన్ని చెల్లించాడు. దీనిని తెలియజేస్తూ.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఫొటోని ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘‘తారక్‌ అన్నా.. నాతోపాటు నా స్నేహితులు కొంతమందికి మల్లికార్జున లేదా భ్రమరాంబ థియేటర్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా టికెట్లు ఇప్పించండి’’ అంటూ ఆ అభిమాని ఎన్టీఆర్‌ ముందు ఓ చిన్న విన్నపాన్ని ఉంచాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌-ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ సీతగా చెర్రీ సరసన సందడి చేయనున్నారు. అలాగే హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ ఎన్టీఆర్‌కు జోడీగా కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇవీ చదవండి

బిగ్గెస్ట్‌ యాక్షన్‌ డ్రామాలో చెర్రీ-యశ్‌..?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని