#RC15: బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌లోకి తమన్‌ ఎంట్రీ

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌లోకి....

Updated : 19 Jul 2021 13:38 IST

135 మంది మ్యూజిషియన్స్‌తో తమన్‌ మ్యాజిక్‌

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటున్న ఈ ప్రాజెక్ట్‌లోకి తమన్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి ఆయన స్వరాలు అందించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఓ ఫొటోని షేర్‌ చేసింది. తమన్‌ స్టూడియోకి వెళ్లిన శంకర్‌, చెర్రీ, నిర్మాత శిరీష్‌లు ఆయనతో ఫొటోలు దిగారు. ఫస్ట్‌ రికార్డింగ్‌ స్నీక్‌ పీక్‌లో భాగంగా 135 మంది మ్యూజిషియన్స్‌తో కలిసి తమన్‌ చేసిన మ్యూజిక్‌ మ్యాజిక్‌కి శంకర్‌, చెర్రీ మైమరిచిపోయారని చిత్రనిర్మాణ సంస్థ పేర్కొంది.

రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో సాయిమాధవ్‌ బుర్రా (రచయిత), జానీ మాస్టర్‌(కొరియోగ్రాఫర్‌) ఉన్నట్లు చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు ఇందులో చెర్రీ సరసన కియారా అడ్వాణీ, లేదా రష్మిక నటించే అవకాశాలున్నట్లు సమాచారం. సుమారు రెండేళ్లపాటు ఈ సినిమా షూటింగ్‌ జరగనుందని 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇందులో చెర్రీ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారంటూ ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని