Social Look: రష్మిక సారీ.. జాన్వీ శారీ.. మహేశ్‌-చరణ్‌ వైరల్‌ పిక్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 21 Sep 2023 01:32 IST
  • వినాయక చవితి వేడుకలకు సంబంధించిన ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నారు నటి రష్మిక. ఆలస్యంగా పోస్ట్‌ చేస్తున్నందుకు ఆమె సారీ చెప్పారు.
  • తన పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు నటి కృతిశెట్టి. ఇందులో ఆమె ఎరుపు రంగు ట్రెండీ డ్రెస్‌లో మెరిశారు. తనలో స్ఫూర్తి నింపుతున్న, అండగా నిలుస్తోన్న కుటుంబసభ్యులు, అభిమానులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు.
  • అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే. అక్కడ రామ్‌చరణ్‌ - మహేశ్‌బాబు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన ఓ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ‘పిక్‌ ఆఫ్‌ ది డే’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని