దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు

‘దృశ్యం-2’ టీమ్‌కి అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ బై చెప్పారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘దృశ్యం-2’ చిత్రీకరణ గతకొన్నిరోజులుగా శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే....

Updated : 15 Apr 2021 15:11 IST

హైదరాబాద్‌: వెంకటేశ్‌, మీనా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దృశ్యం2’. గత కొన్నిరోజులుగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారంతో వెంకటేశ్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు, ఇతర నటీనటులతో కలిసి వెంకటేశ్‌ దిగిన ఓ ఫొటోని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది.

2014లో విడుదలైన ‘దృశ్యం’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘దృశ్యం-2’కి రీమేక్‌ ఇది. మాతృకను తెరకెక్కించిన దర్శకుడు జితు జోసఫ్‌ రీమేక్‌ను కూడా తీర్చిదిద్దుతున్నారు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో వెంకటేశ్‌ సతీమణిగా మీనా కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని