సామాజిక మాధ్యమాలపై పోలీసు కన్ను
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న కథనాలపై పోలీసులు దృష్టి సారించారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే హైదరాబాద్ బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరిపై కేసులు
అందులో ప్రసారమయ్యే సమాచారాన్ని విశ్లేషించడానికి ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కేసులు
ప్రభుత్వాన్ని విమర్శించేవారిపైనా చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న కథనాలపై పోలీసులు దృష్టి సారించారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే హైదరాబాద్ బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరిపై కేసులు నమోదు కాగా రాష్ట్రవ్యాప్తంగా మరో 43 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఏదో ఒకరోజు వీరందరిపైనా కేసులు నమోదవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగడంతో రకరకాల సామాజిక మాధ్యమాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. వాట్సప్, ఫేస్బుక్, ట్విటర్ తదితరాలతో పాటు ఎవరికివారు సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్ల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వీటిలో ప్రసారమవుతున్న సమాచారాన్ని ఏమేరకు విశ్వసించవచ్చన్నది పక్కనపెడితే రకరకాల అంశాలపై ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతోంది. వీటిని అడ్డం పెట్టుకొని చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారని, ముఖ్యంగా మతాలు, కులాల వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టులు పెడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న విమర్శలూ లేకపోలేదు. మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు వాడటం సామాజిక మాధ్యమాల్లో సాధారణమైంది. ఉదాహరణకు కరోనాకు సంబంధించి చికిత్స, ముందు జాగ్రత్తలు అంటూ ఎవరెవరో ప్రముఖుల పేర్లు చెప్పి కుప్పలు తెప్పలుగా సమాచారం ప్రసారమవుతోంది. ఇదే సమయంలో అనేక మంది సామాన్యులు కూడా తమ కళ్లెదుట జరుగుతున్న అక్రమాలను సామాజిక మాధ్యమాలు వేదికలుగా ప్రశ్నిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించేవారిని, అక్రమాలకు పాల్పడుతున్నవారిని నిలదీస్తున్నారు. అయితే కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్లోని బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సామాజిక మాధ్యమం ద్వారా విమర్శలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదయింది. వీరిద్దర్నీ అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత వదిలేశారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే నిర్మల్, హుజూరాబాద్, కరీంనగర్లకు చెందిన మరో ముగ్గురు సామాజిక మాధ్యమాల ప్రతినిధులపైనా కేసులు పెట్టి నోటీసులు పంపారు.
సుప్రీంకోర్టే చెప్పినా
వాస్తవానికి డిజిటల్ మాధ్యమం మాటున జరిగే నేరాలను అదుపు చేసే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఐటీచట్టం తీసుకొచ్చింది. ఇందులో ప్రధానమైంది ‘సెక్షన్ 66ఎ’. ఏదైనా డిజిటల్ మాధ్యమం ద్వారా వ్యక్తి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, బెదిరించేలా సమాచారం ప్రసారం చేస్తే ఈ చట్టం కింద కేసు నమోదు చేయవచ్చు. దీనిపై పౌరహక్కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు 2015లో ఈ చట్టాన్ని తప్పుపట్టింది. అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ ఈ చట్టం కింద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో పౌరహక్కుల సంఘం గతేడాది సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ‘సెక్షన్ 66ఎ’ రద్దు చేసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా 1307 కేసులు నమోదు చేశారని, వాటిలో 2021 మార్చివరకూ 745 కేసులు పెండింగ్లోనే ఉన్నాయని అందులో పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా తెలంగాణ పోలీసులు.. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ కింద కాకుండా ఇతరత్రా చట్టాలు ప్రయోగిస్తున్నారు. ఉదాహరణకు బాలానగర్ కేసులో ఐటీచట్టం ప్రస్తావన లేదు. ఐపీసీలోని 505(1)(బి), 504 వంటి సెక్షన్లు ఉపయోగించారు. అంటే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రశాంతతకు భంగం కలిగించేలా నేరానికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అసభ్య పదజాలంతో ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నమాట.
ఎక్కడికక్కడ విశ్లేషణ
సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న సమాచారంతో శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశమున్న నేపథ్యంలో వీటిని ఎప్పటికప్పుడూ గమనిస్తుండాలన్న ఉద్దేశంతో పోలీసుశాఖ ‘సోషల్ మీడియా మానిటరింగ్ సెల్’ పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. డిజిటల్ మాధ్యమాల్లో జరుగుతున్న ప్రసారాలను ఈ కేంద్రాలు పరిశీలిస్తుంటాయి. ఏదైనా విద్వేషపూరిత సమాచారం కనిపిస్తే దాన్ని నిరోధించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడం వీటి ఉద్దేశం. కానీ ఈ కేంద్రాలు.. విమర్శలు చేసే వారిని, తప్పులను ఎత్తిచూపే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెక్షన్66ఎ ఐటీ చట్టం ఏం చెబుతోంది..
తప్పని తెలిసి కూడా ఎదుటి వ్యక్తిని బెదిరించేలా, అసౌకర్యానికి గురయ్యేలా, ప్రమాదానికి కారణమయ్యేలా, అవరోధాలు కల్పించేలా, కించపరిచేలా, శత్రుత్వం-ద్వేషం పెంచేలా, దురుద్దేశంతో కూడిన సమాచారాన్ని ఆన్లైన్లో చేరవేయడం నేరం అని..
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM