త్రిపుర హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌

త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ తొడుపునూరి అమర్‌నాథ్‌ గౌడ్‌ నియమితులయ్యారు.

Published : 10 Nov 2022 03:23 IST

ఈనాడు, దిల్లీ: త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ తొడుపునూరి అమర్‌నాథ్‌ గౌడ్‌ నియమితులయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతి శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. దీంతో హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు. జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ సికింద్రాబాద్‌కు చెందినవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని