23 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది.
ఈ కేసులో తన పాత్రలేదంటూ.. 4 పేజీల లేఖ విడుదల చేసిన ఎమ్మెల్సీ
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. ఆమెకు ఇదివరకు ఇచ్చిన కస్టడీ గడువు మంగళవారంతో ముగియడంతో పోలీసులు ఆమెను న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతున్నందున ఆమె బయట ఉంటే సాక్షులపైనా, దర్యాప్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, అందువల్ల మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. అయితే ఆ విజ్ఞప్తి పట్ల కవిత తరఫు న్యాయవాది నితేష్రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ వద్ద ప్రస్తుతం కొత్తగా ఆధారాలేవీ లేవని చెప్పారు. ఈ సందర్భంగా కవిత తన అభిప్రాయాలను చెప్పుకోవడానికి అనుమతి ఇవ్వాలని నితేష్రాణా న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అయితే ఆమె నేరుగా కోర్టులో మాట్లాడేందుకు న్యాయమూర్తి అనుమతించలేదు. ఏదైనా ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు. పోలీసులు కవితను కోర్టుకు తీసుకొస్తున్నప్పుడు ఆమె ‘జై తెలంగాణ’ నినాదం చేశారు. బయటకు వెళ్తున్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇదో తప్పుడు కేసు, కోర్టులో చెప్పాల్సింది చెప్పాను’’ అని పేర్కొన్నారు. అంతకుముందు ఆమె న్యాయమూర్తి అనుమతితో తన భర్త అనిల్కుమార్, మామ రామ్కిషన్రావులతో మాట్లాడారు.
నాలుగు పేజీల లేఖ విడుదల
కోర్టు విచారణ అనంతరం కవిత తరఫు న్యాయవాదులు మీడియాకు నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. కోర్టులో న్యాయమూర్తికి చెప్పడానికి ఆమె రాసుకొచ్చినట్లు చెబుతున్న లేఖను బహిర్గతం చేశారు. ‘‘ఈ కేసులో నాకు ఎలాంటి పాత్రలేదు. ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందలేదు. నేనో బాధితురాలిని. రెండున్నరేళ్లుగా ఈడీ/సీబీఐ దర్యాప్తు అంతులేకుండా సాగుతోంది. అంతిమంగా అది మీడియా ట్రయల్గా మారింది. నన్ను లక్ష్యంగా చేసుకొని నా వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. నా ఫోన్ నంబర్ను టీవీల్లో ప్రదర్శిస్తూ నేరుగా వ్యక్తిగత గోప్యతలోకి చొరబడ్డారు. నేను దర్యాప్తునకు సహకరించాను. బ్యాంకు, వ్యాపారాల వివరాలు ఇచ్చాను. మొబైల్ ఫోన్లన్నింటినీ దర్యాప్తుసంస్థకు సమర్పించి విచారణకు సహకరించినా వాటిని ధ్వంసం చేసినట్లు నాపై బురదజల్లారు. గత రెండున్నరేళ్ల దర్యాప్తు సమయంలో సీబీఐ, ఈడీలు ఎన్నోసార్లు భౌతికంగా, మానసికంగా వేధించడంతోపాటు, దురుసుగా వ్యవహరించి బెదిరించాయి. ఈ మొత్తం కేసు వాంగ్మూలాలపైనే ఆధారపడి ఉంది. ఇందులో ఎక్కడా మనీ ట్రయల్ కనిపించలేదని జస్టిస్ సంజీవ్ఖన్నాయే చెప్పారు. ఈ కేసులో అవినీతికి ఆధారాలు లేవు. ఈడీ అంతిమంగా మార్చి 15న నన్ను అరెస్ట్ చేసింది. నేను సాక్షులపై ప్రభావం చూపుతున్నట్లు ఆరోపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? నాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు హామీపత్రం ఇచ్చిన తర్వాత కూడా నన్ను అరెస్ట్ చేశారు. ఈ రోజుల్లో 95% ఈడీ, సీబీఐ కేసులు ప్రతిపక్ష నాయకులపైనే నమోదు చేస్తున్నారు. నిందితులు భాజపాలో చేరిన వెంటనే వాటిని అర్ధాంతరంగా నిలిపేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకులు ఎంతో ఆశతో ఉపశమనం కోసం న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నారు. నేను ఇకముందు కూడా విచారణకు సహకరిస్తాను. నేను బాధ్యతగల తల్లిని. ఇది నా జీవితంలో ముఖ్యమైన కోణం. నేను ఉన్నత అర్హతలున్న వ్యక్తిని. అందువల్ల బోర్డు పరీక్షలకు కుమారుడిని సిద్ధం చేయడంలో నా పాత్రను అర్థం చేసుకోండి. తల్లిపాత్రను ఎవ్వరూ భర్తీ చేయలేరు. నేను దగ్గర లేకపోవడం అబ్బాయిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నాను. అందువల్ల నా బెయిల్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
కవితను ప్రశ్నించిన సీబీఐ
దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన కవితను సీబీఐ తిహాడ్ జైలులో ప్రశ్నించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శనివారం సీబీఐ అధికారులు జైలుకు వెళ్లి ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో మునిగి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’