బ్రేకింగ్

breaking
06 May 2024 | 19:12 IST

ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

అనకాపల్లి: రాష్ట్రంలో ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరని, అవినీతి వైకాపా ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. అనకాపల్లిలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ 2047లో వికసిత్‌ భారత్‌.. మోదీ లక్ష్యమైతే.. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌.. పవన్‌, నా లక్ష్యం. కూటమి మ్యానిఫెస్టో ముందు వైకాపా మ్యానిఫెస్టో వెలవెలబోయింది. 25 లోక్‌సభ, 160 శాసనసభ సీట్లలో కూటమిదే విజయం. అవినీతి పాలనను అంతం చేసేందుకే కూటమిగా ఏర్పడ్డాం’’ అని చంద్రబాబు అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు