Moonlighting: అసలేమిటీ మూన్లైటింగ్.. ఐటీ కంపెనీలకు కలవరమెందుకు..?
తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులు మూన్లైటింగ్ చేయకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కొన్నాళ్ల క్రితం విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ కూడా ఇటువంటి
ఇన్ఫోసిస్ హెచ్చరికల నేపథ్యంలో మరో సారి చర్చలోకి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులు ‘మూన్లైటింగ్’ చేయకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కొన్నాళ్ల క్రితం విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. మరోవైపు యూనికార్న్ స్టార్టప్ స్విగ్గీ మాత్రం తమ ఉద్యోగులకు మూన్లైటింగ్ చేసే అవకాశం ఇటీవలే కల్పించింది. ముఖ్యంగా వైట్కాలర్ ఉద్యోగాల్లో ఈ విధానం పెరుగుతోంది. దేశీయ కంపెనీలు మూన్లైటింగ్పై విభిన్నమైన వైఖరులతో ఉన్నాయన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది. సంప్రదాయ టెక్ కంపెనీలు.. నూతనతరం కంపెనీల మధ్య ఉన్న భిన్నవైఖరిని కూడా ఇది ప్రతిబింబిస్తోంది. ఇంతకీ ఏమిటీ మూన్లైటింగ్..? ఇది నైతికమేనా..? భారత్లో దీనికి చట్టబద్ధత ఎంత..?
అసలు ఏమిటిది..?
ఒక వ్యక్తి సాధారణ ఉద్యోగ సమయం తర్వాత మిగిలిన వేళలో రెండో ఉద్యోగం చేయడాన్ని మూన్లైటింగ్ అంటారు. ఉదాహరణకు.. ఓ ఉద్యోగి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తాడు. అదే అతడి ప్రాథమిక ఆదాయ వనరు. అదనపు నగదు కోసం అతడు రాత్రివేళల్లో లేదా వారాంతాల్లో మరో ఉద్యోగం చేయడాన్ని మూన్లైటింగ్ అంటారు. ఇది సాధారణంగా ఆయా కంపెనీల పాలసీలపై ఆధారపడి ఉంటుంది. జులైలో ఓ సంస్థ వర్క్ఫ్రమ్ హోం చేస్తున్న 400 మంది ఐటీ ఉద్యోగలపై సర్వే నిర్వహించగా.. వారిలో 65శాతం మందికి రెండో ఉద్యోగం గురించి తెలుసని చెప్పారు. చాలా మంది వర్క్ఫ్రమ్ హోం వదిలి తిరిగి ఆఫీస్లకు రాకపోవడం వెనుక మూన్లైటింగ్ కూడా ఓ కారణమనే అంచనాలు ఉన్నాయి.
భారత్లో తొలిసారి ఎప్పుడు బయటపడింది..?
గత రెండేళ్లుగా మూన్లైటింగ్ ఐటీ సంస్థలకు సమస్యగా మారింది. రెండో ఉద్యోగం చేసే ప్రతిభావంతుడైన వ్యక్తి నుంచి ఉత్పాదకత తగ్గడం వంటివి సమస్యలను ఇవి ఎదుర్కొంటున్నాయి.
* బెంగళూరులో ఓ వ్యక్తి ఏడు సంస్థలకు పనిచేస్తున్నట్లు కొన్నాళ్ల కిందట బయటపడింది. అతడికి ఉన్న పలు పీఎఫ్ ఖాతాల ఆధారంగా గుర్తించారు.
* ముంబయిలోని ఓ ప్రముఖ కంపెనీ ఐటీ హెడ్ ఆఫీస్లో విధులకు హాజరయ్యేందుకు నిరాకరించారు. చివరికి అతడి మెయిల్పై ఫోరెన్సిక్ దర్యాప్తు నిర్వహించగా.. పెద్ద ఎత్తున డేటాను మరో కంపెనీకి పంపిస్తున్నట్లు తేలింది. ఇక్కడ ఉద్యోగం మానేయకుండానే.. మరో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు.
నైతికంగా సరైనదేనా..?
మూన్లైటింగ్ నైతికతపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. మరోవైపు ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్దాస్ పాయ్ సమర్థించారు. ఉద్యోగమనేది యజమాని-ఉద్యోగి మధ్య ప్రతిరోజు కొన్ని గంటల కాంట్రాక్టుగా ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత ఉద్యోగి ఇష్టమని పేర్కొన్నారు. మానవవనరుల విభాగ న్యాయ నిపుణులు మాత్రం భిన్నంగా చెబుతున్నారు. ఫుల్టైం ఉద్యోగం ఇచ్చిన సంస్థ.. తన ఉద్యోగి రెండో ఉద్యోగం చేయకుండా కట్టడి చేయవచ్చని చెబుతున్నారు. ఒకేరకమైన రెండు ఉద్యోగాలు చేస్తే.. ఒక చోట రహస్యాలు మరో చోటకు చేరే అవకాశం ఉన్న సందర్భాల్లో ఇది మోసం కిందకు కూడా వస్తుంది. ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 60 ప్రకారం రెండు ఉద్యోగాలు చేయడాన్ని భారత్లో నిషేధించారు. కానీ, ఈ నిబంధన నుంచి ఐటీ సంస్థలకు మినహాయింపు ఇచ్చారు. ఓ వ్యక్తి బహుళ ఉద్యోగాలు చేసే సమయంలో సంస్థ కాంట్రాక్టు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం ప్రకారం కూడా బహుళ ఉద్యోగాలు చేయడంపై నిషేధం ఉంది. ఈ చట్టాల పరిధిలోని వారు బహుళ ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే కొలువు కోల్పోవాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు