IPO: ఐపీఓల సందడి.. టాటా టెక్ సహా 4 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం
IPO: రూ.5,150 కోట్ల సమీకరణ లక్ష్యంతో నాలుగు కంపెనీల ఐపీఓలు నవంబర్ 22న ప్రారంభమయ్యాయి. వీటిలో మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్ ఐపీఓ కూడా ఉంది.
దిల్లీ: మార్కెట్లో నేడు ఐపీఓల సందడి నెలకొంది. నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు (IPO) ఈ రోజే ప్రారంభమయ్యాయి. మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్ సహా ఫ్లెయిర్ రైటింగ్, ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ కంపెనీల షేర్ల సబ్స్క్రిప్షన్ ప్రక్రియ నేడు మొదలైంది. ఈ కంపెనీలన్నీ కలిపి దాదాపు రూ.5,150 కోట్లు సమీకరించనున్నాయి.
టాటా టెక్నాలజీస్ ఐపీఓ
మార్కెట్లో ఆసక్తి పెంచిన టాటా టెక్ ఐపీఓ (Tata Tech IPO) నవంబరు 22న ప్రారంభమై 24 వరకు కొనసాగనుంది. ఈ ఐపీఓ (Tata Tech IPO)లో 6.08 కోట్ల షేర్లను కంపెనీ అందుబాటులో ఉంచింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా టాటా మోటార్స్ తమ వాటాలో 11.4 శాతాన్ని ఉపసంహరించుకుంటోంది. అదనంగా ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్-I 1.2 శాతం వాటాలను విక్రయిస్తున్నాయి. ఐపీఓ (Tata Tech IPO) పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. తొలుత 9.57 కోట్ల షేర్లను విక్రయించాలనుకున్నారు. కానీ, దాన్ని తాజాగా 6.08 కోట్లకు కుదించారు. ఈ ఐపీఓ పూర్తిగా ‘ఆఫర్ ఫర్ సేల్’ ప్రాతిపదికన జరుగుతున్న నేపథ్యంలో సమీకరించిన నిధులు కంపెనీకి చెందబోవు. ఈ ఐపీఓలో 10 శాతం వాటాను ప్రత్యేకంగా టాటా మోటార్స్ వాటాదారుల కోసం రిజర్వ్ చేశారు.
2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ను పబ్లిక్ ఇష్యూకు తీసుకొచ్చిన టాటా గ్రూప్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మరో సంస్థను ఐపీఓ (Tata Tech IPO)కు తీసుకురావడం ఇదే. టాటా టెక్కు 18 అంతర్జాతీయ డెలివరీ కేంద్రాలున్నాయి. దీనిలో దాదాపు 11 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్, పరిశోధన-అభివృద్ధి (ఈఆర్అండ్డీ) సేవలు, డిజిటల్ ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ (డీఈఎస్), ఎడ్యుకేషన్ ఆఫరింగ్స్, వాల్యూ యాడెడ్ రీసెల్లింగ్ అండ్ ఐప్రోడక్ట్స్ ఆఫరింగ్స్ విభాగాల్లో వ్యాపారాలున్నాయి. టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్రోవర్ సహా టాటా గ్రూప్లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- ఐపీఓ తేదీలు: నవంబరు 22-24
- ఒక్కో షేరు ముఖ విలువ : రూ.2
- ధరల శ్రేణి : రూ.475- 500
- కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు : 30 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి: రూ.15,000 (గరిష్ఠ ధర వద్ద)
- షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 30
- రిఫండ్ల ప్రారంభ తేదీ : డిసెంబరు 1
- డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 4
- లిస్టింగ్ తేదీ : డిసెంబరు 5
ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
పెన్నుల తయారీ కంపెనీ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. (Flair Writing Industries IPO) రూ.593 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వచ్చింది. నవంబర్ 22న ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రారంభమై 24న ముగియనుంది. ఐపీఓలో రూ.292 కోట్లకు సమానమైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనున్నారు. మరో రూ.301 కోట్లకు సమానమైన ప్రమోటర్ల వాటాలను విక్రయించనున్నారు.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- ఐపీఓ తేదీలు: నవంబరు 22-24
- ఒక్కో షేరు ముఖ విలువ : రూ.5
- ధరల శ్రేణి : రూ.288- 304
- కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు : 49 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి: రూ.14,896 (గరిష్ఠ ధర వద్ద)
- షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 30
- రిఫండ్ల ప్రారంభ తేదీ : డిసెంబరు 1
- డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 4
- లిస్టింగ్ తేదీ : డిసెంబరు 5
ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్
రూ.1,092 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ (Fedbank Financial Services IPO)కి వచ్చింది. ఈ ఐపీఓ కూడా ఈరోజు ప్రారంభమై 24న ముగియనుంది. రూ.660 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు రూ.492 కోట్లు విలువ చేసే షేర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- ఐపీఓ తేదీలు: నవంబరు 22-24
- ఒక్కో షేరు ముఖ విలువ : రూ.10
- ధరల శ్రేణి : రూ.133- 140
- కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు : 107 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి: రూ.14,980 (గరిష్ఠ ధర వద్ద)
- షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 30
- రిఫండ్ల ప్రారంభ తేదీ : డిసెంబరు 1
- డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 4
- లిస్టింగ్ తేదీ : డిసెంబరు 5
గాంధార్ ఆయిల్ రిఫైనరీ
గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా ఐపీఓ (Gandhar Oil Refinery IPO) సైతం నవంబర్ 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. ధరల శ్రేణి రూ.160- 169. మదుపర్లు రూ.14,872తో కనీసం 88 షేర్లు కొనాలి. మొత్తం రూ.500 కోట్లు సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రూ.302 కోట్లకు సమానమైన తాజా షేర్లతో పాటు 198 కోట్లు విలువ చేసే షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తున్నారు.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- ఐపీఓ తేదీలు: నవంబరు 22-24
- ఒక్కో షేరు ముఖ విలువ : రూ.2
- ధరల శ్రేణి : రూ.160- 169
- కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు : 88 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి: రూ.14,872 (గరిష్ఠ ధర వద్ద)
- షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 30
- రిఫండ్ల ప్రారంభ తేదీ : డిసెంబరు 1
- డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 4
- లిస్టింగ్ తేదీ : డిసెంబరు 5
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
Maruti Suzuki Swift: అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ మారుతీ సుజుకీ తమ హ్యాచ్బ్యాక్ మోడల్లో కొత్త స్విఫ్ట్ను విడుదల చేసింది. దీని ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. -
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
Moto: 50dB, 46dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కు సపోర్ట్ చేసే రెండు కొత్త ఇయర్బడ్స్ను మోటో భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. -
అందుకే భారత్కు సొంత టెక్నాలజీ అవసరం.. లింక్డిన్పై ఓలా సీఈఓ ఫైర్!
Ola CEO: ఓలా సీఈఓ చేసిన ఓ పోస్ట్ను లింక్డిన్ తొలగించింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
ఐపీఓకు గో డిజిట్ ఇన్సూరెన్స్.. విరుష్క జోడీ వాటాలు వదులుకుంటున్నారా?
డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓకు రానుంది. మే 15న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై.. 17న ముగియనుంది. -
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
TCS CEO Salary: టీసీఎస్ సీఈఓ కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. అదే సమయంలో సీఓఓ గణపతి సుబ్రమణియం రూ.26.18 కోట్ల వేతనాన్ని పొందారు. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
AI Express: ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. కంపెనీ 25 మందిని తొలగించింది. మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది. -
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో 73,321 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతోంది. -
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్
India Economic Superpower: రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారత్ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. దీంట్లో ప్రధాని మోదీతో పాటు అంబానీ, అదానీ కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది. -
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది. -
400 మంది ఇంజినీర్ల నియామకాలు: కోటక్ బ్యాంక్
ఈ ఏడాది దాదాపు 400 మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనిఖీల్లో వెలుగు చూసిన సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు, టెక్నాలజీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని బ్యాంక్ భావిస్తోంది. -
10 కిలోల పెంపుడు జంతువు క్యాబిన్లోనే
తమ దేశీయ విమానాల క్యాబిన్లో 10 కిలోల లోపున్న పెంపుడు జంతువులను అనుమతిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎల్అండ్టీ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.4,396.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,986.78 కోట్లతో పోలిస్తే ఇది 10.2% అధికం. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా?
తాజా వార్తలు (Latest News)
-
ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్కు అధికారుల నోటీసులు
-
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
-
రోహిత్ను కోల్కతా ఓపెనర్గా చూడాలనుంది : వసీమ్ అక్రమ్
-
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
-
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
-
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ