17,300 ఎగువకు నిఫ్టీ
లోహ, ఐటీ, భారీ యంత్ర పరికరాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రెండో రోజూ రాణించాయి. దసరా సందర్భంగా బుధవారం మన మార్కెట్లు పని చేయలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడిన ప్రభావం, గురువారం మన మార్కెట్లపై కనిపించింది.
రెండో రోజూ రాణించిన సూచీలు
సమీక్ష
లోహ, ఐటీ, భారీ యంత్ర పరికరాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రెండో రోజూ రాణించాయి. దసరా సందర్భంగా బుధవారం మన మార్కెట్లు పని చేయలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడిన ప్రభావం, గురువారం మన మార్కెట్లపై కనిపించింది. అయితే బ్యాంకింగ్, టెక్ షేర్లలో లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలు కొంత మేర తగ్గాయి. దీంతో సెన్సెక్స్ 157 పాయింట్లు, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో లాభపడగా, షాంఘై, హాంకాంగ్ స్వల్పంగా నష్టపోయాయి. ఐరోపా సూచీలు ప్రతికూలంగా కదలాడాయి.
డాలర్ విలువ రూ.82.17: ఒపెక్ దేశాలు నవంబరు నుంచి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల మేర ముడిచమురు ఉత్పత్తిలో కోత విధిస్తామని ప్రకటించడంతో చమురు ధరలు పెరగడం ప్రారంభించాయి. ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది కనుక అమెరికాలో వడ్డీరేట్లు ఇంకా పెరుగుతాయనే అంచనాతో, డాలరుకు గిరాకీ అధికమైంది. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 55 పైసలు తగ్గి 82.17 వద్ద ముగిసింది. రూపాయి 82 దిగువన ముగియడం ఇదే తొలిసారి. బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 94.07 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
* సెన్సెక్స్ ఉదయం 58,314.05 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. ఒక దశలో 58,578.76 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. లాభాల స్వీకరణతో 58,173.70 పాయింట్లకు పడింది. చివరకు 156.63 పాయింట్ల లాభంతో 58,222.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సైతం 57.50 పాయింట్లు లాభపడి 17,331.80 పాయింట్ల వద్ద ముగిసింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 18 లాభపడ్డాయి. టాటా స్టీల్ 2.27%, ఎల్అండ్టీ 2.24%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.04%, హెచ్సీఎల్ టెక్ 1.98%, ఇన్ఫోసిస్ 1.76%, యాక్సిస్ బ్యాంక్ 1.65%, సన్ ఫార్మా 1.20%, విప్రో 1.13%, ఐటీసీ 1.11% చొప్పున పెరిగాయి. భారతీ ఎయిర్టెల్ 2.53%, హెచ్యూఎల్ 2.08%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.52%, హెచ్డీఎఫ్సీ 1.41%, బజాజ్ ఫైనాన్స్ 1.18%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.08%, పవర్గ్రిడ్ 1.06% మేర నష్టపోయాయి.
* అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద స్పైస్జెట్కు అదనంగా రూ.1,000 కోట్ల నిధులు అందుతాయన్న వార్తలతో సంస్థ షేరు 8.84 శాతం లాభపడి రూ.41.85 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 10.14 శాతం లాభంతో రూ.42.35 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది.
* రూ.2,200 కోట్లతో పారిశ్రామిక, లాజిస్టిక్స్ సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ యాక్టిస్తో సంయుక్త సంస్థ (జేవీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు స్థిరాస్తి సంస్థ మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ గురువారం ప్రకటించింది.
* బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో విక్రయశాలల్ని నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా ఐపీఓకు రెండోరోజు ముగిసేసరికి 7.57 రెట్ల స్పందన లభించింది. సంస్థ 6.25 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తుండగా 47.29 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయని ఎన్ఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి. సంస్థాగతేతర విభాగంలో 11.74 రెట్లు, రిటైల్ విభాగంలో 7.81 రెట్లు, అర్హులైన సంస్థాగత మదుపర్ల (క్యూఐబీ) విభాగంలో 4.01 రెట్ల స్పందన లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..