సేద్యానికి సాంకేతిక సాయం
ఆరుగాలం శ్రమించే రైతు ఎదుర్కొనే సమస్యలు అన్నీఇన్నీ కావు. పంట ఎంపిక మొదలు, సస్యరక్షణ చర్యలు, చేతికి వచ్చాక సరైన ధరకు విక్రయించడం ఇలా ఎన్నో విషయాల్లో వారికి సందేహాలు ఉంటాయి.
ఈనాడు - హైదరాబాద్
ఆరుగాలం శ్రమించే రైతు ఎదుర్కొనే సమస్యలు అన్నీఇన్నీ కావు. పంట ఎంపిక మొదలు, సస్యరక్షణ చర్యలు, చేతికి వచ్చాక సరైన ధరకు విక్రయించడం ఇలా ఎన్నో విషయాల్లో వారికి సందేహాలు ఉంటాయి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలనూ సరిగ్గా వినియోగించుకోని వారెందరో. రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ వ్యవసాయానికి సాంకేతిక సాయం చేస్తున్న అంకురమే కిసాన్ దాస్ (ఇఅగ్రిసేవ.కామ్). రైతులకు అవసరమైన సేవలన్నీ ఒకేచోట అందేలా చూడాలనే ఆలోచన నుంచే తమ సంస్థ ఆవిర్భవించింది అంటున్నారు సహ వ్యవస్థాపకులు విజయ్ మనోహర్. తమ సంస్థ గురించి ఇలా వివరిస్తున్నారు.
‘ఏదైనా ఒక మంచి సంస్థను స్థాపించాలి.. దాని కోసం అనువైన రంగం ఏమిటి అని అన్వేషిస్తున్న సమయంలో వ్యవసాయం నన్ను ఆకర్షించింది. కంప్యూటర్ సైన్స్ చదివినప్పటికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలను పక్కన పెట్టాను. ఐఎస్బీలో రెండేళ్లపాటు ఐడియా టు స్టార్టప్ ల్యాబ్ కోర్సునూ పూర్తి చేశాను. నా ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లే దశలో అనేక సదస్సులకు హాజరయ్యాను. ఇలా నాకు చింతల వెంకటయ్యతో పరిచయం ఏర్పడింది. అప్పటికే తను రైతులకు సహాయం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరం కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి అనుకున్నాం. అప్పుడే కిసాన్ దాస్ (డిజిటల్ అగ్రి సర్వీసెస్)ను తీసుకొచ్చాం. మా ఆలోచనను టి-హబ్తో పంచుకున్నాం. అలా మాకు ర్యూబిక్స్ ప్రోగ్రాంలో చోటు లభించింది.
ఏం చేస్తామంటే..
రైతులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యం. భూసార పరీక్షలు, విత్తనాల ఎంపిక, ఎరువులు, క్రిమిసంహారకాల వాడకంలో సలహాలు, యంత్రాలను అద్దెకు తెచ్చుకోవడం, పంటల బీమా, కిసాన్ క్రెడిట్ కార్డు.. ఇలా పలు ప్రభుత్వ పథకాల సమాచారమంతా ఒకేచోట అందేలా ఒక వేదికను ఏర్పాటుచేశాం. కిసాన్దాస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా రైతులు తమకు అవసరమైన సేవలను పొందొచ్చు. దీన్ని తెలుగులో అందిస్తున్నాం. తమ పంటను అమ్ముకునేందుకు కొనుగోలుదార్లతో అనుసంధానం చేస్తున్నాం. చీడపీడల నివారణకు మందుల పిచికారీ కోసం డ్రోన్ల సేవలనూ అందిస్తున్నాం. కలుపు మొక్కలను తొలగించేందుకు రోబోటిక్ మైక్రో ట్రాక్టర్లనూ అందుబాటులోకి తెచ్చాం. ఇలా రైతులకు అవసరమైన అన్ని విషయాల్లోనూ సహాయం చేయడంతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లోని యువ రైతులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రైతులు పండించిన కొన్ని పంటలను మేమే నేరుగా కొనుగోలు చేసే ఏర్పాటూ చేస్తున్నాం.
ఇప్పటి వరకూ..
2022లో మా సంస్థను ప్రారంభించినప్పటి నుంచీ కొన్ని పైలెట్ ప్రాజెక్టులను చేపట్టాం. ఆ తర్వాత ఇటీవలే రెండు ఇఅగ్రిసేవా సెంటర్లను ఏర్పాటు చేశాం. ఒక్కో ఏజెంట్ ద్వారా కనీసం 100 మంది రైతులకు సేవలు అందుతాయి. రానున్న రోజుల్లో 500లకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, యువకులకు డ్రోన్ పైలెట్ శిక్షణ, లైసెన్సులు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. డ్రోన్ల వల్ల రైతులకు ఖర్చు తగ్గుతుంది.
లాభం పెంచేలా..
రైతులు తమ పంటలను మంచి ధరకు అమ్ముకునేందుకు కిసాన్దాస్అర్బన్నూ అందుబాటులోకి తెస్తున్నాం. ఇందులో వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా కొనే ఏర్పాటు చేస్తున్నాం. పంటను గ్రేడింగ్, ప్యాకేజింగ్ చేయడంలో రైతులకు సహాయం చేస్తాం. విదేశీ సాంకేతికతనూ రైతులకు పరిచయం చేసి, ఉత్పాదకతను పెంచేలా ప్రోత్సహిస్తాం. ఇప్పటివరకూ సొంతంగా నిధులు సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కనీసం రూ.3 కోట్ల నిధుల కోసం చూస్తున్నాం. ఏడాదిలో 200 కేంద్రాలను ప్రారంభించడం మా లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..