హిండెన్బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నాం
అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని, షేర్ల కదలికలపైనా ఓ కన్నేసినట్లు సుప్రీం కోర్టుకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ స్పష్టం చేసింది.
షేర్ల కదలికలనూ గమనిస్తున్నాం
షార్ట్ సెల్లింగ్ను నిషేధించే ఉద్దేశం లేదు
అది చట్టబద్ధ పెట్టుబడుల ప్రక్రియే
సుప్రీం కోర్టుకు సెబీ స్పష్టీకరణ
దిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని, షేర్ల కదలికలపైనా ఓ కన్నేసినట్లు సుప్రీం కోర్టుకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ స్పష్టం చేసింది. ‘షార్ట్ సెల్లింగ్ / అప్పుతెచ్చిన షేర్ల విక్రయంపై’ నిషేధం విధించే ఉద్దేశం కూడా లేదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనానికి రాతపూర్వకంగా నోట్ పంపింది. అదానీ గ్రూప్ షేర్ల విలువ ఒక్కసారిగా క్షీణించడం వల్ల, అమాయక మదుపర్లు భారీగా నష్టపోతున్నారంటూ దాఖలైన రెండు ప్రయాప్రయోజన వ్యాజ్యాలను(పిల్) ఈ ధర్మాసనం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.
20 పేజీల్లో సెబీ ఏం చెప్పిందంటే..
సుప్రీం కోర్టుకు సెబీ 20 పేజీల పత్రాలను పంపింది. అందులో షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటో.. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఏం చేసిందన్నదానిపై వివరాలు అందజేసింది. అయితే ఒక్కసారి కూడా అదానీ గ్రూప్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇప్పటికే హిండెన్బర్గ్ నివేదికలోని ఆరోపణలపైనా; ఆ నివేదిక వెలువడక ముందు, తర్వాత మార్కెట్లో కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టినట్లు అందులో తెలిపింది. నివేదిక వెలువడిన మూడు వారాల్లో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.10.2 లక్షల కోట్ల మేర క్షీణించిన సంగతి తెలిసిందే.
షార్ట్ సెల్లింగ్ నిషేధిస్తే..
‘మదుపర్లు కొన్ని షేర్లను అప్పుగా తీసుకుని.. వాటిని విక్రయిస్తారు. ఆ షేర్ల ధరలు తగ్గుతాయన్న అంచనాలు ఇందుకు నేపథ్యం. అవి ఒక్కసారి కిందకు పడితే.. వాటిని కొనుగోలు చేసి.. తిరిగి లెండర్లకు అప్పజెబుతారు. ఈ పద్ధతిలో ‘అధిక విక్రయ ధరకు, తక్కువ కొనుగోలు ధర’కు మధ్య ఉన్న అంతరం ద్వారా లాభాలు పొందుతార’ని సెబీ సుప్రీంకు వివరించింది. ‘షార్ట్ సెల్లింగ్ అనేది సెక్యూరిటీ మార్కెట్లో అవసరమైనదేనని.. దీని వల్ల ద్రవ్యలభ్యత లభించడంతో పాటు ఓవర్ వేల్యూడ్ షేర్లు దిద్దుబాటుకు గురిఅవుతాయ’ని వివరించింది. అందువల్ల షార్ట్ సెల్లింగ్పై ఏవైనా ఆంక్షలు విధిస్తే.. షేర్లకు ఉన్న అసలు విలువను కనిపెట్టే ప్రక్రియకు విఘాతం కలుగుతుందని తెలిపింది. ఈ విషయంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్స్ (ఐఓఎస్సీఓ) విధానాన్ని భారత్ పాటిస్తోందని తెలిపింది. కరోనా సమయంలో నిఫ్టీ సూచీ కేవలం 13 రోజుల్లో 26% పతనమైనా షార్ట్సెల్లింగ్పై నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. తీవ్ర ఒడుదొడుకుల్లోనూ ట్రేడింగ్ సజావుగా సాగేందుకు అవసరమైన నిబంధనావళి, కట్టుదిట్టమైన వ్యవస్థలు ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఆరోపణలు నుంచి కాపాడుకునేందుకు అదానీ ‘ఆడిట్ అస్త్రం’
గ్రాంట్ థార్టన్ నియామకం
హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను ధీటుగా ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ ఆడిట్ మార్గాన్ని పట్టింది. గ్రూప్లోని కొన్ని కంపెనీలపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించేందుకు అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థార్టన్ను నియమించింది. గ్రూప్ అన్ని చట్టాలను పాటిస్తోందని, ఏ విషయాలనూ దాచిపెట్టలేదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వంటి నియంత్రణ సంస్థలకు నిరూపించడమే ఆడిట్ ముఖ్య ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ పరిశీలిస్తుంది..
‘నిధుల దుర్వినియోగం లేదా విదేశాల నుంచి నిధులు అక్రమంగా వచ్చాయా.. రుణాలు ఏ అవసరం కోసం తీసుకున్నారో- అందుకే వాడారా.. లేదా ఇతరత్రా అవసరాలకు వినియోగించారా’ వంటి అంశాలను ఈ ఆడిట్ సంస్థ పరిశీలిస్తుందని చెబుతున్నారు. కంపెనీ ఖాతాలకు వచ్చిన ఇబ్బంది లేదని, ప్రాజెక్టులు సకాలంలోనే పూర్తవుతాయంటూ అదానీ గ్రూప్ ప్రకటిస్తున్న సంగతి విదితమే. మదుపర్లు ఎదురుచూస్తున్న అంశాలను వెల్లడించాలంటే, ఆడిట్ సంస్థకు సమయం పట్టే అవకాశం ఉంది.
* వృద్ధి ప్రణాళికలన్నీ అనుకున్న సమయానికే పూర్తవుతాయని.. అన్నిటికీ పూర్తి నిధులున్నాయని ప్రకటిస్తూ, వాటాదార్లలో విశ్వాసం నింపే ప్రయత్నాన్ని అదానీ గ్రూప్ చేస్తోంది.
అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం రూ.820 కోట్లు
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.820 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాలంలో సంస్థ రూ.11.63 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. ఆదాయం కూడా రూ.18,758 కోట్ల నుంచి 42 శాతం వృద్ధితో రూ.26,612.33 కోట్లకు చేరుకోవడం విశేషం. విమానాశ్రయ వ్యాపార ఆదాయాలు రెండింతలయ్యాయి. అయితే లాభదాయకత మాత్రం 29 శాతమే పెరిగింది. కంపెనీ మొత్తం వ్యయాలు 37% పెరిగి రూ.26,171.18 కోట్లకు చేరాయి.
* అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మంగళవారం మిశ్రమంగా కదలాడాయి. మెరుగైన త్రైమాసిక ఫలితాలతో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 1.91% పెరిగి రూ.1750.30 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్ 2.15%, ఏసీసీ 0.41% పెరిగాయి. అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మర్, ఎన్డీటీవీ 5% చొప్పున కుదేలై లోయర్ సర్క్యూట్ను తాకాయి. అంబుజా సిమెంట్స్ 1.68% నష్టపోయింది. హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత ఇప్పటివరకు అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ రూ.10.4 లక్షల కోట్లు ఆవిరైంది.
ఆర్థికంపై అదానీ సంక్షోభ ప్రభావం ఉండదు
అదానీ గ్రూప్ సమస్యల కారణంగా నేరుగా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఎదురుకావు. అయితే కార్పొరేట్లకు రుణాలు ఇచ్చే సమయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరింత జాగ్రత్తగా పరిశీలన చేయొచ్చు. దీని వల్ల రుణాల జారీ ఆలస్యమై పరోక్ష ప్రభావం పడొచ్చు. అదానీ గ్రూప్ కంపెనీలకు బ్యాంకింగ్ రంగం 1 శాతం లోపు రుణాలే ఇచ్చాయి. ఆయా కంపెనీల క్రెడిట్ రేటింగ్లు కూడా ‘ఒత్తిడిలో’ లేవు. అయితే అదానీ గొడుకు కింద ఉన్న కొన్ని భారతీయ కంపెనీలకు నష్టభయం పెరిగితే పెరగొచ్చు.
ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. -
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM