మారిషస్.. ష్ గప్చుప్!!
నగదు అక్రమ బదిలీ, పన్ను ఎగవేతకు అనువైన డొల్ల కంపెనీలకు కేంద్రంగా మారిషస్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా తమపై ఉన్న ఈ మరకను తుడిచేయడానికి ఆ దేశం యత్నిస్తోంది.
అదానీ గ్రూప్పై ఆరోపణల నేపథ్యంలోమళ్లీ చర్చనీయాంశంగా మారిన దేశం
నగదు అక్రమ బదిలీ, పన్ను ఎగవేతకు అనువైన డొల్ల కంపెనీలకు కేంద్రంగా మారిషస్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా తమపై ఉన్న ఈ మరకను తుడిచేయడానికి ఆ దేశం యత్నిస్తోంది. అయితే అదానీ గ్రూప్పై అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల్లోనూ మారిషస్ కంపెనీల పాత్ర ఉండటంతో.. మళ్లీ ప్రపంచవ్యాప్తంగా మారిషస్ పాత్రపై అనుమానాలు పెరిగాయి.
ఈ ఏడాది జనవరి 24న వెలువడిన హిండెన్బర్గ్ నివేదిక అనంతరం, అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర కుప్పకూలింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ / ఆయన సహచరుల నేతృత్వంలోని కంపెనీలు మారిషస్ను మనీ లాండరింగ్కు వినియోగించాయని.. తద్వారా అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలకు పాల్పడ్డాయని హిండెన్బర్గ్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో కరేబియన్ దీవుల నుంచి యూఏఈ వరకు ఉన్న షెల్ కంపెనీలకు పాత్ర ఉన్నా, మారిషస్లోని కంపెనీలే కీలక పాత్ర పోషించాయని హిండెన్బర్గ్ నొక్కి చెప్పింది. వినోద్తో అనుబంధం ఉన్న 38 సంస్థలు ఈ చిన్న దీవిలోనే ఉన్నాయని పేర్కొంది. భారత్ నుంచి తొలుత మారిషస్కు నిధులు బదిలీ చేసి, మళ్లీ అక్కడి నుంచి భారత్కు నగదు బదిలీ చేయడం ద్వారా అదానీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేయించి.. వాటి ధరలను పెరిగేలా చేశారన్నది ఆరోపణ. హిండెన్బర్గ్ నివేదిక వెలుగు చూడటానికి ముందు అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు అయిదేళ్లలో 2600% పెరగడం గమనార్హం.
1990 నుంచీ..
పర్యాటకులకు స్వర్గధామమైన మారిషస్.. 1990ల్లోనే భారత కార్పొరేట్ వివాదాలకు కేంద్ర బిందువైంది. అందులో అతిపెద్దది స్టాక్ మార్కెట్ కుంభకోణం. 1998-2001 మధ్య కొన్ని షేర్ల విలువలను భారీగా పెంచడానికి ఒక బ్రోకరు (కేతన్ పరేఖ్) మారిషస్ దారినే ఎంచుకున్నారని అప్పట్లో గట్టిగా వినిపించింది. 2006-2007లో హెలికాప్టర్ ఒప్పందానికి సంబంధించి; 2008లో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో, క్రికెట్కు సంబంధించిన మనీ లాండరింగ్ అంశం (2010లో దర్యాప్తు)లోనూ మారిషస్ పేరే కనిపించింది. తాజాగా అదానీ విషయంలోనూ మళ్లీ మారిషస్ పేరే వినిపిస్తోంది. అయితే ఆ దేశం మాత్రం అదానీ గ్రూప్ ‘తమ దేశ నిబంధనలన్నిటినీ పాటించిందని.. భారత అధికారులతో తమ ప్రభుత్వం సహకరిస్తుంద’ని పేర్కొంటోంది. ‘మా దేశ ప్రతిష్ఠను నిలబెట్టాలనే మేం కోరుకుంటున్నామ’ని ఆ దేశ ఆర్థిక మంత్రి మహేన్ కుమార్ సీరుత్తన్ అన్నారు కూడా.
15 శాతం పన్ను అంటుంది కానీ..
ఆర్థిక సహకార-అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) నిబంధనల ప్రకారమే కనీసం 15 శాతం కార్పొరేట్ రేటును విధిస్తున్నట్లు అంతక్రితం మారిషస్ స్పష్టం చేసింది. అయితే కొన్ని కంపెనీలకు కేవలం 3% పన్నునే వర్తింపజేస్తోంది. అందుకే చాలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతాయి. 1992లో ఆఫ్షోర్ వ్యాపారాన్ని వృద్ధి చేయడం కోసం డజన్ల కొద్దీ ద్వైపాక్షిక పన్ను ఒప్పందాలను మారిషస్ కుదుర్చుకుంది. భారత్తోనూ 1980ల్లోనే ద్వంద్వ పన్నుల, మూలధన లాభాల పన్నులను తొలగించే ఒప్పందం చేసుకుంది. అయితే ఆ సమయంలో మనం సోవియట్ ఆధారిత సోషిలిస్ట్ ఆర్థిక వ్యవస్థను విడనాడి.. విదేశీ మూలధన విధానానికి వెళతామని ఊహించలేదు. ఇలా అన్ని దేశాలతోనూ ఒప్పందాలను ఎపుడో కుదుర్చుకోవడంతో.. ఇపుడు అత్యంత ధనవంత దేశాల్లో ఒకటిగా మారిషస్ ఉంది.
పారడైజ్ పేపర్స్ వెలుగు చూశాక
2017లో అంతర్జాతీయ జర్నలిస్టులకు లీకైన పత్రాల (పారడైజ్ పేపర్స్) అనంతరం మారిషస్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. భారత్ కూడా పలు ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో విదేశీ కార్పొరేట్లు ఎక్కువ పన్ను కట్టేలా విధానాలు తీసుకొచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య పన్ను ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు. పీ నోట్లపైనా భారత్ నిబంధనలను కఠినం చేసింది. అయితే మారిషస్ 2021 అక్టోబరులో పన్ను చట్టాలు, ఒప్పందాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. అంతర్జాతీయ ఒప్పందం ద్వారా కనీస కార్పొరేట్ పన్నును ఆవిష్కరించింది. దీంతో యూరోపియన్ యూనియన్ సైతం నెలల వ్యవధిలోనే బ్లాక్లిస్ట్ నుంచి ఆ దేశం పేరును తొలగించింది.
అర్థం కాని... సాలెగూడు
భారతీయ కంపెనీలు మారిషన్ ద్వారా నగదును అక్రమంగా బదిలీ చేయడం ద్వారా పన్నును ఎగ్గొట్టడమే కాకుండా.. క్రిమినల్ చట్టాలకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. అదెలాగంటే.. డజన్ల కొద్దీ విదేశీ డొల్ల కంపెనీలను సృష్టించి.. ఒకదాని నుంచి మరొకదానికి డబ్బులు బదిలీ చేస్తూ ఒక సాలెగూడునే సృష్టిస్తారు. దీని వల్ల దర్యాప్తు సంస్థలకు ఎటు నుంచి ఎటు డబ్బు వెళుతుందో తెలుసుకోవడం చాలా కష్టమవుతోంది. అందుకే మారిషస్ మార్గాన్ని మన కంపెనీలు ఎంచుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్ని జరిగినా.. మారిషస్ చాలా మంది పెట్టుబడుదార్లకు ఆకర్షణీయ ఆఫ్షోర్ కేంద్రంగానే ఉంది. అదానీ సంక్షోభం తర్వాత ఆ దేశంపై ఒత్తిడి పెరుగుతోందేమో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..