డిపాజిటర్లకు బైడెన్ భరోసా
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) దివాలా నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి దేశ బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు అమెరికా అధ్యక్షుడైన బైడెన్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వమూ రంగంలోకి దిగింది.
ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంకుల్లో నగదు ఉపసంహరణకు అనుమతి
న్కూయార్క్/వాషింగ్టన్: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) దివాలా నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి దేశ బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు అమెరికా అధ్యక్షుడైన బైడెన్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వమూ రంగంలోకి దిగింది. ఎస్వీబీ డిపాజిటర్లందరికీ సోమవారం నుంచే నగదు ఉపసంహరణకు వీలు కల్పించింది. అయితే న్యూయార్క్లోని సిగ్నేచర్ బ్యాంక్ను మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు తాజాగా ప్రకటించడం ఆందోళనను పెంచింది. ఈ బ్యాంకును సైతం ఎఫ్డీఐసీ (ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల వ్యవధిలో అమెరికాలోని 2 బ్యాంకులు మూతపడడం, ప్రపంచవ్యాప్తంగా మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విషయంలో ఎఫ్డీఐసీ, ఫెడరల్ రిజర్వ్ బోర్డుల సిఫారసులను అందుకున్న అనంతరం.. అధ్యక్షుడు బైడెన్తో సంప్రదించి ఆర్థిక శాఖ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. అందరు డిపాజిటర్లు సోమవారం నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు వీలు కల్పించింది. బీమా పరిమితి ఉండే 2,50,000 డాలర్ల కు మించిన డిపాజిట్లు ఉన్నవారు కూడా నిధులు ఉపసంహరించేందుకు వీలు కల్పించినట్లు ప్రకటించారు.
* డిపాజిట్ల బదిలీ: ఎస్వీబీకి చెందిన అన్ని డిపాజిట్లను (బీమా పరిధిలోని, అంతకుమించిన) కొత్తగా ఏర్పాటు చేసిన ఒక బ్రిడ్జ్ బ్యాంక్కు ఎఫ్డీఐసీ బదిలీ చేసింది. (ఏదైనా బ్యాంకు విఫలమైతే, పరిష్కారం చూపే వరకు తాత్కాలికంగా ఈ తరహా బ్రిడ్జ్ బ్యాంక్కు ఆస్తులను బదిలీ చేయడం అమెరికాలో రివాజు.)
ఎఫ్డీఐసీ నియంత్రణలోకి సిగ్నేచర్ బ్యాంకు : న్యూయార్క్కు చెందిన సిగ్నేచర్ బ్యాంకును తన నియంత్రణలోకి తీసుకున్నట్లు ఎఫ్డీఐసీ సోమవారం ప్రకటించింది. రెండు దశాబ్దాల నాటి ఈ బ్యాంక్ స్థిరాస్తి, డిజిటల్ అసెట్స్ సహా 9 విభాగాల్లో సేవలందిస్తోంది. క్రిప్టోకరెన్సీ విలువలు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాటి డిపాజిట్లను అనుమతించాలని 2019లో ఈ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత పతనానికి కారణమైంది. 2022 సెప్టెంబరు నాటికి ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచి వచ్చినవే. క్రిప్టో విలువలు క్షీణిస్తున్నందున, ఈ డిపాజిట్లను త్వరలోనే 8 బిలియన్ డాలర్లకు కుదించుకుంటామని డిసెంబరులోనే బ్యాంకు ప్రకటించింది. అయితే డిపాజిటర్లు ఒక్కసారిగా నిధుల ఉపసంహరణకు ప్రయత్నించడమే ప్రస్తుత స్థితికి కారణం. తమ స్వాధీనంలోకి వచ్చిన ఈ బ్యాంకు డిపాజిటర్లు కూడా తమ నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఎఫ్డీఐసీ పేర్కొంది.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : బైడెన్
ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంకుల పతనానికి కారణమైన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు, పన్ను చెల్లింపుదారులు సహా మొత్తం ఆర్థిక వ్యవస్థను రక్షించేలా నియంత్రణ సంస్థలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయని.. అందుకు తాను హర్షిస్తున్నానని తెలిపారు.
25 బి. డాలర్లతో తాత్కాలిక నిధి: ఫెడ్
బ్యాంకులు ద్రవ్యలభ్యత సమస్యలు ఎదుర్కోకుండా 25 బిలియన్ డాలర్లతో తాత్కాలిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది.
హెచ్ఎస్బీసీ చేతికి ఎస్వీబీ యూకే యూనిట్
లండన్: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనుబంధ ఎస్వీబీ యూకే విషయంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చర్యలు చేపట్టింది. ఎస్వీబీ యూకే దివాలా ప్రక్రియలో భాగంగా ఆ బ్యాంక్ను హెచ్ఎస్బీసీకు ఒక్క పౌండ్కే విక్రయించింది. ఆ బ్యాంక్ ఆస్తులు విక్రయించి, డిపాజిట్లు చెల్లిస్తామని యూకే ఆర్థిక శాఖ తెలిపింది.
భారత అంకురాలకు సాయం
ఎస్వీబీ కుప్పకూలడంతో ఇబ్బంది పడుతున్న అమెరికాలోని భారత అంకురాలకు మద్దతు ఇవ్వడానికి యాక్సిస్ బ్యాక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ఎస్బీసీ భారత విభాగం కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఉన్న తమ శాఖల్లో, ఆయా అంకురాలు డాలర్ ఖాతాలను తెరవడానికి సహాయం చేస్తున్నాయి.
* డిపాజిటర్లను రక్షించేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకున్నందున.. తమ రూ.64 కోట్ల డిపాజిట్లను తిరిగి పొందగలమన్న విశ్వాసం వచ్చిందని దేశీయ గేమింగ్ మీడియా ప్లాట్ఫాం నజారా టెక్ సీఈఓ పేర్కొన్నారు.
భయాలు తొలిగాయి: ‘తాజా సంక్షోభం ఫలితంగా, భారత బ్యాంకింగ్ వ్యవస్థపై మరింత విశ్వాసం ఉంచాలని భారత అంకురాలు నేర్చుకున్నాయ’ని ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ‘తగిన విధంగా స్పందించిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి, ఆర్బీఐలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. -
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత