స్మార్ట్ఫోన్ కంపెనీలకు షాక్!
దేశంలో స్మార్ట్ఫోన్ వినియోగదార్ల డేటా భద్రత, గోప్యతతో పాటు దేశ భద్రత ప్రయోజనాల దృష్ట్యా.. స్మార్ట్ఫోన్ కంపెనీలకు సరికొత్త భద్రతా నిబంధనలను తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం ఉంది.
సరికొత్త భద్రతా నిబంధనల ప్రణాళికలో భారత్
ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ల తొలగింపునకూ వీలు
దేశంలో స్మార్ట్ఫోన్ వినియోగదార్ల డేటా భద్రత, గోప్యతతో పాటు దేశ భద్రత ప్రయోజనాల దృష్ట్యా.. స్మార్ట్ఫోన్ కంపెనీలకు సరికొత్త భద్రతా నిబంధనలను తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం ఉంది. దీని వల్ల స్మార్ట్ఫోన్ కంపెనీలు తాము అనుకున్న సమయం కంటే ఆలస్యంగా కొత్త మోడళ్లను ఆవిష్కరించాల్సి రావొచ్చు. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ల ద్వారా వచ్చే ఆదాయాన్నీ కోల్పోవాల్సి రావొచ్చని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.
ప్రతిపాదిత నిబంధనలు ఇవీ
స్మార్ట్ఫోన్ తయారీదార్లు తమ ఫోన్లలో కొన్ని యాప్లను ముందస్తుగా ఇన్స్టాల్ చేసి వినియోగదార్లకు విక్రయిస్తుంటాయి. వీటిని తీసేయడానికి వీలుండదు. కొన్ని థర్డ్పార్టీ యాప్లను ఇలా ఇన్స్టాల్ చేసినందుకు, సెల్ కంపెనీలు వారి నుంచి డబ్బులు తీసుకుంటాయి. ఒక్కో ఫోన్పై రూ.500-1,000 వరకు కూడా ఇలా వచ్చే వీలుంటుందని ఒక కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. ఇలా ముందస్తుగా ఇన్స్టాల్ చేసిన యాప్లనూ వినియోగదారులు తొలగించుకునే వీలు కల్పించే నిబంధనను తీసుకురానుందని సమాచారం.
* ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) అప్డేట్లకు తప్పనిసరిగా తనిఖీలు (స్క్రీనింగ్) ఉండాలనీ యోచిస్తోంది.
ఇదీ ప్రభావం: ఒక స్మార్ట్ఫోన్, వాటి విడిభాగాలను ప్రభుత్వ ఏజెన్సీ తనిఖీ చేయడానికి ప్రస్తుతం 21 వారాలు పడుతోంది. మరిన్ని పరీక్షలకు ఇంకా అధిక సమయం పట్టొచ్చు. శాంసంగ్, షియోమీ, వివో వంటి కంపెనీలు ప్రీ-ఇన్స్టాల్డ్ యాప్ల ద్వారా పొందుతున్న వ్యాపారాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
విదేశీ నిఘా లేకుండా
2020లో చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచీ, ఆ దేశ వ్యాపార సంస్థల విధానాలపై మన ప్రభుత్వం గట్టి నిఘా ఉంచింది. టిక్ టాక్ వంటి 300 చైనా యాప్లను నిషేధించింది కూడా. అంతర్జాతీయంగానూ చాలా దేశాలు చైనా సంస్థలైన హువావే, హక్విజన్ వంటి టెక్ కంపెనీల సాంకేతికతను వినియోగించకుండా ఆంక్షలు విధిస్తున్న విషయం విదితమే. తమ సాంకేతికత ద్వారా విదేశీ పౌరులపై చైనా నిఘా ఉంచుతోందన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మన ప్రభుత్వమూ కఠిన చర్యలకు దిగుతోంది.
* మన స్మార్ట్ఫోన్ విపణిలో చైనా కంపెనీలైన షియోమీ, వివో, ఒప్పోలదే సగం వరకు వాటా ఉంది. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్కు 20%, యాపిల్కు 3% వాటా ఉన్నాయి.
బీఐఎస్ ల్యాబ్లో..
షియోమీ యాప్ స్టోర్ గెట్యాప్స్ కానీ శాంసంగ్కు చెందిన శాంసంగ్ మినీ కానీ.. ఐఫోన్లో యాపిల్ బ్రౌజర్ అయిన సఫారీ కానీ ప్రీ-ఇన్స్టాల్డ్వే. వీటిని తొలగించడానికి వీలుండదు. ఇకపై అన్ఇన్స్టాల్ ఆప్షన్ను అవి పొందుపరచాలి. కొత్త మోడళ్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) అధీకృత ల్యాబ్లో తనిఖీ చేసే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
Warren Buffett: భారత మార్కెట్లో ఉన్న అవకాశాలను భవిష్యత్తులో అందిపుచ్చుకునేందుకు తమ కంపెనీ బెర్క్షైర్ హాత్వే సిద్ధంగా ఉందని వారెన్ బఫెల్ తెలిపారు. -
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
IPO: రూ.6,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చేవారంలో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. 2004 నుంచి సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఐపీఓలు ఉండడం ఇదే తొలిసారి. -
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
యాపిల్ వాచ్ ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అసలు ఒక స్మార్ట్ గడియారం ఆమెను ఎలా రక్షించగలిగిందంటే. -
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
USA: అమెరికా టెక్ పరిశ్రమలో భారతీయులది కీలక పాత్ర అని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ సీఈఓ హర్బీర్ కె భాటియా తెలిపారు. వారు లేనిదే ఆ పరిశ్రమ మనుగడ సాగించలేదని అభిప్రాయపడ్డారు. -
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి