మళ్లీ ఆసియా సంపన్నుడిగా అంబానీ
ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 24వ స్థానానికి పడిపోయారు. 2023కు ప్రపంచ కుబేరుల జాబితాను మంగళవారం ఫోర్బ్స్ విడుదల చేసింది.
24వ స్థానానికి పడిపోయిన అదానీ
ఫోర్బ్స్ కుబేరుల జాబితా - 2023
దిల్లీ
ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 24వ స్థానానికి పడిపోయారు. 2023కు ప్రపంచ కుబేరుల జాబితాను మంగళవారం ఫోర్బ్స్ విడుదల చేసింది. 83.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ఆసియాలో అగ్రస్థానంలో, ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో నిలిచారు. ‘జనవరి 24న అదానీ 126 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో మూడో సంపన్నుడిగా ఉన్నారు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత ప్రస్తుతం ఆయన సంపద 47.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది’ అని ఫోర్బ్స్ తెలిపింది. అంబానీ తర్వాత రెండో ధనిక భారతీయుడిగా అదానీ నిలిచారు. గతేడాది అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి భారతీయ సంస్థగా అవతరించింది.
* ఫోర్బ్స్ జాబితాలోని అగ్రగామి 25 సంపన్నుల మొత్తం సంపద విలువ 2.1 లక్షల కోట్ల డాలర్లు. 2022లో వీరి సంపద 2.3 లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 200 బిలియన్ డాలర్లు తక్కువ. గతేడాదితో పోలిస్తే మూడింట రెండొంతుల మంది సంపన్నుల సంపద తగ్గింది.
* అమెజాన్ షేర్లు 38 శాతం క్షీణించడంతో జెఫ్ బెజోస్ సంపద 57 బిలియన్ డాలర్లు ఆవిరైంది. గతేడాది ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న ఆయన.. ఈ ఏడాది మూడో స్థానానికి చేరారు. ట్విటర్ కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ సంపద 39 బిలియన్ డాలర్లు తగ్గి రెండో స్థానానికి వచ్చారు.
* ఫ్రాన్స్ విలాస వస్తువుల దిగ్గజం ఎల్వీఎంహెచ్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ 211 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. మస్క్ (180 బి.డాలర్లు), బెజోస్ (114 బి.డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
* ఫోర్బ్స్ 2023 జాబితాలో 169 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. 2022లో వీరి సంఖ్య 166గా ఉంది. కానీ వీరి సంపద మాత్రం 750 బి.డాలర్ల నుంచి 10% తగ్గి 675 బి.డాలర్లకు చేరింది.
* హెచ్సీఎల్ టెక్ అధిపతి శివ్ నాడార్ సంపద 11% కోల్పోయి 25.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఆయన దేశంలో మూడో సంపన్న వ్యక్తిగా ఉన్నారు. సైరస్ పూనావాలా, లక్ష్మీ మిత్తల్, సావిత్రి జిందాల్, దిలీప్ సంఘ్వీ, రాధాకిషన్ దమానీ, కుమార్ బిర్లా, ఉదయ్ కోటక్ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు.
* జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, నితిన్ కామత్లు వరుసగా 1.1 బి.డాలర్లు, 2.7 బి.డాలర్ల సంపదతో జాబితాలో తొలిసారి స్థానం పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!