లో వోల్టేజ్ మోటార్స్, గేర్స్ వ్యాపారాన్ని విక్రయిస్తోన్న సీమెన్స్
సీమెన్స్ ఏజీ అనుబంధ సంస్థ సీమెన్స్ లార్జ్ డ్రైవ్స్ ఇండియాకు లో వోల్టేజ్ మోటార్స్, గేర్డ్ మోటార్స్ వ్యాపారాన్ని సీమెన్స్ విక్రయించనుంది.
దిల్లీ: సీమెన్స్ ఏజీ అనుబంధ సంస్థ సీమెన్స్ లార్జ్ డ్రైవ్స్ ఇండియాకు లో వోల్టేజ్ మోటార్స్, గేర్డ్ మోటార్స్ వ్యాపారాన్ని సీమెన్స్ విక్రయించనుంది. లావాదేవీ విలువ రూ.2,200 కోట్లు. ఇందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిపాదిత వ్యాపారాల బదిలీ, విక్రయం 2023 అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే ఇరు పక్షాల నిర్దేశించుకున్న షరతుల పాటింపు, వాటాదార్లు, నియంత్రణ సంస్థల ఆమోదంపై ఈ లావాదేవీ పూర్తి కావడం ఆధారపడి ఉంటుంది. 2021-22లో సీమెన్స్ లో వోల్టేజ్ మోటార్స్, గేర్డ్ మోటార్స్ వ్యాపారం రూ.1,061 కోట్ల కార్యకలాపాల ఆదాయాన్ని, రూ.132 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సంస్థ మొత్తం ఆదాయంలో ఈ వ్యాపార ఆదాయ వాటా 7 శాతం కాగా.. లాభం వాటా 9 శాతం.
బజాజ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ సూపర్ సేల్
హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ బజాజ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ సూపర్ సేల్ను ప్రకటించింది. శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లను ఈనెల 28 వరకు రాయితీ ధరలపై విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా శామ్సంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4ను రూ.1,21,999, గెలాక్సీ ఎస్23 అల్ట్రాను రూ.84,999కు పొందే వీలుంటుంది. గెలాక్సీ ఎల్22 అల్ట్రా రూ.63,999కు, గెలాక్సీ ఎస్22 రూ.30,999కు, గెలాక్సీ ఎస్23 మోడల్ను రూ.42,499 నుంచి పొందొచ్చు. పాత మొబైల్ మార్చుకుని, కొత్తది కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు బోనస్ అదనంగా లభిస్తుందని సంస్థ తెలిపింది.
తగ్గిన జొమాటో నష్టం
దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికంలో జొమాటో ఏకీకృత ప్రాతిపదికన రూ.187.60 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాలంలో నమోదైన రూ.359.70 కోట్లతో పోలిస్తే నష్టం భారీగా తగ్గడం గమనార్హం. కార్యకలాపాల ఆదాయం రూ.1,211.80 కోట్ల నుంచి పెరిగి రూ.2,056 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జొమాటో రూ.971 కోట్లు కాగా.. 2021-22లో నమోదైన రూ.1,222.50 కోట్లతో పోలిస్తే తగ్గింది. ఏకీకృత ఆదాయం రూ.4,192.40 కోట్ల నుంచి పెరిగి రూ.7,079.40 కోట్లకు చేరింది. ఆహార ఆర్డర్లు, డెలివరీ వ్యాపారానికి రాకేశ్ రంజన్ను సీఈఓగా నియమించినట్లు జొమాటో తెలిపింది. సీఓఓగా రిన్షుల్ చంద్రా వ్యవహరిస్తారని పేర్కొంది. జొమాటో హైపర్ప్యూర్కు సీఈఓగా రిషి అరోరాకు బాధ్యతలు అప్పగించినట్లు వివరించింది.
ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.87,416 కోట్ల డివిడెండ్
ముంబయి: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. 2021-22లో చెల్లించిన రూ.30,307 కోట్ల డివిడెండ్తో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 3 రెట్లు అధికం కావడం గమనార్హం. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆర్బీఐ బోర్డు డైరెక్టర్ల 602వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023-23 సాధారణ బడ్జెట్లో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వం అంచనా వేసిన మొత్తం కంటే ఇది ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.48,000 కోట్లను ప్రభుత్వం ఆశిస్తోంది. 2022-23లో ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు రూ.లక్ష కోట్లను మించడంతో, ప్రభుత్వ రాబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 2021-22కు సంబంధించి ఆర్బీఐ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ.40,953 కోట్లు లభించాయి. 2022-23 బడ్జెట్ అంచనా రూ.73,948 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. -
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. -
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. -
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్ల వాటా
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్నకు చెందిన ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ వెల్లడించింది. -
నరేశ్ గోయెల్కు మధ్యంతర బెయిలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. -
అంతర్జాతీయ మొబైల్ నంబర్తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్
భారత్లో ఉన్న ప్రవాసులు (ఎన్ఆర్ఐ), అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. -
సేవల రంగ వృద్ధి వేగవంతంగానే
దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. -
ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ
30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు
ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్, నారాయణన్ వెల్లాయన్ నియమితులయ్యారు. -
జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా
జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. -
ఫరూఖ్నగర్లో 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. -
ఆఫ్లైన్లోనూ ఇ-రుపీ
ఇ-రుపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్లైన్ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
మాస్చిప్ టెక్నాలజీస్ ఆదాయాల్లో వృద్ధి
సెమీకండక్టర్, సాఫ్ట్వేర్, సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మాస్చిప్ టెక్నాలజీస్ 2023-24 పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.293.91 కోట్ల ఆదాయాన్ని, రూ.9.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
సంక్షిప్త వార్తలు(7)
సువెన్ లైఫ్సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.6.66 కోట్ల ఆదాయాన్ని, రూ.26.54 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం 8.21 కోట్లు, నష్టం రూ.27.64 కోట్లు ఉండటం గమనార్హం