జియో ఎయిర్ఫైబర్ వచ్చేసింది
దిల్లీ: 5జీ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలను ‘జియో ఎయిర్ఫైబర్’ పేరిట రిలయన్స్ జియో మంగళవారం తీసుకొచ్చింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్కతా, ముంబయి, పుణె.. ఈ 8 మెట్రో నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది.
హైదరాబాద్ సహా 8 నగరాల్లో ప్రారంభం
దిల్లీ: 5జీ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలను ‘జియో ఎయిర్ఫైబర్’ పేరిట రిలయన్స్ జియో మంగళవారం తీసుకొచ్చింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్కతా, ముంబయి, పుణె.. ఈ 8 మెట్రో నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. గత నెలలో జరిగిన రిలయన్స్ 46వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో జియో ఎయిర్ఫైబర్ సేవలను తీసుకురానున్నట్లు కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. జియో ఎయిర్ఫైబర్తో కోట్లాది కుటుంబాలు ప్రపంచస్థాయి డిజిటల్ వినోదం, బ్రాడ్బ్యాండ్, స్మార్ట్ హోమ్ సేవలను పొందుతాయని రిలయన్స్ జియో వెల్లడించింది. ఇప్పటికే జియోఫైబర్తో కోటి మందికి పైగా వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని, ప్రతినెలా లక్షలాది మంది ఖాతాదారులు చేరుతున్నారని, జియో ఎయిర్ఫైబర్తో మరిన్ని గృహాలకు చేరువకానున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ వెల్లడించారు. 550కు పైగా డిజిటల్ టీవీ ఛానెళ్లు, 16కు పైగా ఓటీటీ యాప్లు, బ్రాడ్బ్యాండ్ సేవలు, స్మార్ట్హోమ్ సేవలు పొందొచ్చన్నారు.
పథకాలు 6, 12 నెలల కాలవ్యవధితో లభిస్తున్నాయి. ప్లాన్ ధరకు జీఎస్టీ అదనంగా చెల్లించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
దేశ రాజధాని దిల్లీలో ఉబర్ సంస్థ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. ఈమేరకు లైసెన్స్ అందుకుంది. -
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
Hero MotoCorp: హీరో-హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు రానున్నాయి. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది. -
హెచ్డీఎఫ్సీ నుంచి పిక్సెల్ పే క్రెడిట్ కార్డు.. రివార్డులు మీకు నచ్చినట్టుగా..
HDFC Bank Pixel Play: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్తగా పిక్సెల్ ప్లే పేరిట కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. దీంట్లో మీకు నచ్చిన కేటగిరీని ఎంపిక చేసుకుని రివార్డు ప్రయోజనాలు అందుకోవచ్చు. -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
SBI Rewardz Fraud: తమ బ్యాంకు పేరిట వాట్సప్, ఎసెమ్మెస్ సందేశాల్లో వచ్చే లింకులపై క్లిక్ చేయొద్దని ఎస్బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. -
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
EPF auto settlement: నగదు ఉపసంహరణను సులభతరం చేయడం కోసం ఈపీఎఫ్ తీసుకొచ్చిన ఆటో సెటిల్మెంట్ సదుపాయం గురించి తెలుసా? -
టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. -
జీడీపీ వృద్ధి 6.7శాతం!
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. -
కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. -
2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్ ఫండ్లు (ఎంఎఫ్) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. -
మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి
విమాన ఇంధన (ఏటీఎఫ్) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రభుత్వాన్ని కోరింది. -
పసుపు కిందకు!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్కు మరిన్ని చిక్కులు
అగ్రగామి మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. -
చైనా స్థిరాస్తి రంగానికి ఊరట
దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. -
భారత్ వృద్ధి 6.6%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. -
సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు. -
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల