అంకురాలకు సంబరమే
అంకుర సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
మరో ఏడాది పాటు పన్ను ప్రయోజనాలు
దిల్లీ: అంకుర సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సావరిన్ వెల్త్ లేదా పింఛను ఫండ్ల పెట్టుబడులపైనా పన్ను ప్రయోజనాలను 2025 మార్చి వరకు వర్తింపజేయనున్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లోని కొన్ని యూనిట్లకు చెందిన నిర్దిష్ట ఆదాయంపై పన్ను మినహాయింపు ఈ ఏడాది మార్చి 31తో ముగియాల్సి ఉంది.
ఎవరికి ప్రయోజనం..: ఇప్పటిదాకా 1.17 లక్షల అంకురాలను ప్రభుత్వం గుర్తించింది. వీటన్నిటికీ స్టార్టప్ ఇండియాలోని ‘యాక్షన్ ప్లాన్’కింద పన్ను ప్రయోజనాలు అందుతాయి.
అంకురాలతో పాటు సావరిన్ వెల్త్ ఫండ్స్, ఐఎఫ్ఎస్సీలోని విమాన లీజింగ్ వ్యాపారాలు చేస్తున్న సంస్థలకూ ప్రయోజనం దక్కనుంది.
దుస్తుల ఎగుమతిదార్లకు 2026 వరకు ప్రోత్సాహకాలు
దుస్తులు ఎగుమతి చేసే వారికి ఉద్దేశించిన ఎగుమతుల ప్రోత్సాహక పథకాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగించారు. ద రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ టాక్సెస్ అండ్ లెవీస్(ఆర్ఓఎస్సీటీఎల్)గా పిలిచే ఈ పథకం ద్వారా రాష్ట్ర, కేంద్ర పన్నులు, సుంకాలకు పరిహారం ఇస్తారు. డ్యూటీ డ్రాబ్యాక్ పథకం కింద రిబేట్ కూడా ఇస్తారు. తొలుత ఈ పథకాన్ని 2020లో ప్రకటించారు. ఇంతకుముందు పొడిగించిన గడువు ఈ ఏడాది మార్చితో ముగియనుంది. తాజాగా ఇంకోసారి పొడిగింపును ప్రకటించారు.
ఎవరికి ప్రయోజనం: పరిశ్రమలోని సంస్థలు దీర్ఘకాల వాణిజ్య ప్రణాళిక రచించుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఎంత కేటాయింపులు: ఈ పథకానికి కేటాయింపులు 2023-24లో రూ.8404.66 కోట్లు కాగా, 2024-25 బడ్జెట్లో రూ.9,246 కోట్లకు పెంచారు.
ఎలక్ట్రానిక్స్ - సెమీకండక్టర్ రంగాలకు రూ.15,500 కోట్లు
దిల్లీ: సెమీకండక్టర్, మొబైల్, ఐటీ హార్డ్వేర్ పీఎల్ఐ పథకం లాంటి వివిధ ఎలక్ట్రానిక్స్ తయారీ కార్యక్రమాలకు 2024-25లో రూ.15,500 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు. అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ ప్లాంట్ల ప్రోత్సాహాకానికి రూ.4,203 కోట్లు కేటాయించారు. గుజరాత్లో మైక్రాన్ ఏర్పాటు చేస్తున్న ప్లాంటు, ఫాక్స్కాన్ ప్లాంటు, హెచ్సీఎల్ సంయుక్త సంస్థ, టాటా గ్రూపు ప్రాజెక్టులకు ప్రయోజనం కలుగుతుంది. సెమీకండక్టర్, సెన్సార్ ప్లాంట్లకు కూడా ఈ కేటాయింపులు వర్తించనున్నాయి. మొత్తంమీద సెమీకండక్టర్ ప్లాంట్లకు రూ.6,903 కోట్లు లభిస్తాయి. మొబైల్ తయారీ ప్రోత్సాహకానికి పీఎల్ఐ పథకం కింద 2024-25లో రూ.6,125 కోట్లు, 2023-24లో రూ.4,489 కోట్లను కేటాయించనున్నారు. మొబైల్ పీఎల్ఐ పథకం కింద డిక్సన్, ఫాక్స్కాన్, ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్, లావా లాంటి కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి.
వాహన రంగానికి ‘ఏడింతల’ సంతోషం
పీఎల్ఐ పథకానికి రూ.3,500 కోట్లు
దిల్లీ: వాహన, వాహన విడిభాగాల కంపెనీలకు ఉద్దేశించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం కింద, 2024-25కు రూ.3,500 కోట్లను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా అయిన రూ.483.77 కోట్లతో పోలిస్తే ఇది ఏడింతలు కావడం విశేషం.
వీటికీ ఊతం: అధునాతన రసాయన బ్యాటరీ, బ్యాటరీ స్టోరేజీలకు వర్తించే పీఎల్ఐ పథకానికీ కేటాయింపులను గత బడ్జెట్లోని రూ.12 కోట్లతో పోలిస్తే రూ.250 కోట్లకు పెంచారు. 2023-24 నుంచి అయిదేళ్ల పాటు వర్తించేలా ఇటీవలే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వాహన పీఎల్ఐ పథకాన్ని పొడిగించింది.
ప్రయోజనం ఏంటి?: అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ(ఏఏటీ) ఉత్పత్తుల తయారీకి పీఎల్ఐ వాహన పథకం ఊతమిస్తుంది. ఏఏటీ ఉత్పత్తులను దేశీయంగా తయరు చేయడంతో పాటు అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.
పవన విద్యుత్ ప్రాజెక్టులకు నిధులు
2070 కల్లా నికర సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. కనీసం 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న ఆఫ్షోర్ ప్రాజెక్టులకు ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రవాణా, గొట్టపు గ్యాస్ అవసరాలకు వినియోగించే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ)లో కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ)ను దశల వారీగా కలపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2030 కల్లా హరిత ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ సామర్థ్యాన్ని 50 శాతానికి పెంచాలన్న లక్ష్యానికీ భారత్ కట్టుబడి ఉందన్నారు.
- 2030 కల్లా 100 మెట్రిక్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సహజ వాయువు, మిథనాల్, అమ్మోనియా దిగుమతులను తగ్గించుకోవాలని భారత్ భావిస్తోంది.
ప్రభుత్వరంగ విద్యుత్ కంపెనీల పెట్టుబడులు రూ.67,286 కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8 ప్రభుత్వ రంగ విద్యుత్ కంపెనీల పెట్టుబడులను రూ.67,286.01 కోట్లకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఈ కంపెనీల పెట్టుబడులు రూ.59,119.55 కోట్లుగా ఉన్నాయి. వీటితో పోలిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు 14% పెరగనున్నాయి. పవర్గ్రిడ్ పెట్టుబడులు రూ.8,800 కోట్ల నుంచి రూ.12,250 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్జేవీఎన్ పెట్టుబడులను రూ.12,000 కోట్లకు, ఎన్హెచ్పీసీ రూ.11,761.87 కోట్లకు, ఎన్టీపీసీ రూ.22,700 కోట్లకు, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ రూ.3,262 కోట్లకు, నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ రూ.1,841.18 కోట్లకు, తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టుబడులను రూ.3,440.96 కోట్లకు పెంచాలని భావిస్తున్నారు. 2023-24 బడ్జెట్లో విద్యుత్ కంపెనీల వార్షిక పెట్టుబడుల లక్ష్యాన్ని రూ.60,805.22 కోట్లుగా పెట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
Amazon Fire TV Stick: అమెజాన్ కొత్త ఫైర్ స్టిక్ను లాంచ్ చేసింది. 4కె సపోర్ట్తో ఇది వస్తోంది. -
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
బైజూస్ సంస్థ పూర్వ వైభవం కోసం కృషి చేస్తోంది. ఇందులోభాగంగా కోర్సు ఫీజులను తగ్గించింది. సేల్స్ టీమ్కు ప్రోత్సాహకాలను పెంచింది. -
దలాల్ దఢేల్: భారీ నష్టాల్లో సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22 వేల స్థాయిని కోల్పోయింది. -
ఎస్బీఐ లాభం ₹21,384 కోట్లు.. పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. -
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
Maruti Suzuki Swift: అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ మారుతీ సుజుకీ తమ హ్యాచ్బ్యాక్ మోడల్లో కొత్త స్విఫ్ట్ను విడుదల చేసింది. దీని ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. -
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
Moto: 50dB, 46dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కు సపోర్ట్ చేసే రెండు కొత్త ఇయర్బడ్స్ను మోటో భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. -
అందుకే భారత్కు సొంత టెక్నాలజీ అవసరం.. లింక్డిన్పై ఓలా సీఈఓ ఫైర్!
Ola CEO: ఓలా సీఈఓ చేసిన ఓ పోస్ట్ను లింక్డిన్ తొలగించింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
ఐపీఓకు గో డిజిట్ ఇన్సూరెన్స్.. విరుష్క జోడీ వాటాలు వదులుకుంటున్నారా?
డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓకు రానుంది. మే 15న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై.. 17న ముగియనుంది. -
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
TCS CEO Salary: టీసీఎస్ సీఈఓ కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. అదే సమయంలో సీఓఓ గణపతి సుబ్రమణియం రూ.26.18 కోట్ల వేతనాన్ని పొందారు. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
AI Express: ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. కంపెనీ 25 మందిని తొలగించింది. మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది. -
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో 73,321 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతోంది. -
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్
India Economic Superpower: రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారత్ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. దీంట్లో ప్రధాని మోదీతో పాటు అంబానీ, అదానీ కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది. -
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్