ఇన్ఫోసిస్‌లో సుధామూర్తికి రూ.5,600 కోట్ల విలువైన షేర్లు

రాజ్యసభ సభ్యురాలుగా నియమితులైన సుధామూర్తికి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో 0.83% వాటాకు సమానమైన 3.45 కోట్ల షేర్లు ఉన్నాయి.

Updated : 09 Mar 2024 05:30 IST

దిల్లీ: రాజ్యసభ సభ్యురాలుగా నియమితులైన సుధామూర్తికి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో 0.83% వాటాకు సమానమైన 3.45 కోట్ల షేర్లు ఉన్నాయి. ప్రస్తుత షేరు ధర రూ.1,616.95 ప్రకారం, సుధామూర్తి షేర్ల విలువ రూ.5,600 కోట్ల వరకు ఉండొచ్చు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి భార్య అయిన సుధామూర్తి దాతృత్వంలోనూ ముందుంటారు. మూర్తి ట్రస్ట్‌కు ఛైర్‌పర్సన్‌గా ఆమె ఉన్నారు. పలు పుస్తకాలు కూడా రాశారు. నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్‌లో 1.66 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారుగా రూ.2,691 కోట్లు.

2006లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న సుధామూర్తికి.. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్‌ పురస్కారమూ లభించింది. బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ భార్య అక్షతామూర్తి ఈమె కుమార్తె. ‘సుధామూర్తిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్‌ చేయడం సంతోషంగా ఉంది. సామాజిక కార్యకలాపాలు, దాతృత్వం, విద్య.. ఇలా పలు విభాగాల్లో ఆమె అందించిన సేవలు స్ఫూర్తివంతం. రాజ్యసభ సభ్యురాలిగా దేశ భవిష్యత్తును మార్చడంలో నారీశక్తికి నిదర్శనంగా ఆమె తన వంతు పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి సేవ చేసేందుకు తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ ఆమె ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని