37% తగ్గిన అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం
అదానీ ఎంటర్ప్రైజెస్, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.450.58 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.722.48 కోట్లతో పోలిస్తే ఇది 37% తక్కువ.
దిల్లీ: అదానీ ఎంటర్ప్రైజెస్, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.450.58 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.722.48 కోట్లతో పోలిస్తే ఇది 37% తక్కువ. అక్టోబరు- డిసెంబరు లాభం రూ.1,888.45 కోట్లతో పోలిస్తే బాగా తగ్గింది. వాణిజ్య గనుల తవ్వకాలపై రూ.201.83 కోట్ల నష్టాన్ని చవిచూడటం, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి గత బకాయిల కోసం రూ.627 కోట్లు వెచ్చించాల్సి రావడం వల్లే, సమీక్షా త్రైమాసిక లాభంలో క్షీణతకు కారణమైంది. ఏడాది వ్యవధిలో కార్యకలాపాల ఆదాయం రూ.28,943.84 కోట్ల నుంచి రూ.29,180.02 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం 31% వృద్ధితో రూ.3,240.78 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం మాత్రం రూ.1,27,539.50 కోట్ల నుంచి రూ.96,420.98 కోట్లకు తగ్గింది.
రాణించిన కొత్త విద్యుత్ వ్యాపారాలు: కంపెనీకి చెందిన కొత్త విద్యుత్ వ్యాపారాల విభాగమైన అదానీ న్యూ ఇండస్ట్రీస్ ఎబిటా సమీక్షిస్తున్న త్రైమాసికంలో 6.2 రెట్లు పెరిగి రూ.641 కోట్లుగా నమోదైంది. విమానాశ్రయాల వ్యాపార ఎబిటా రెట్టింపునకు పైగా పెరిగి రూ.662 కోట్లకు చేరింది. అదానీ ఎంటర్ప్రైజెస్ నిర్వహణలోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ 19% పెరిగి 8.86 కోట్లకు చేరింది. ‘భారత్లో కొత్త వ్యాపారాల పరంగానే కాకుండా మౌలిక అభివృద్ధిలో అంతర్జాతీయంగాను అదానీ ఎంటర్ప్రైజెస్ తన సత్తాను మరోసారి చాటినట్లు’ అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. సౌర మాడ్యుళ్ల తయారీలో వాడే ఇన్గాట్, వేఫర్ విభాగాల కార్యకలాపాలు ప్రారంభించాయని.. 254 గాలిమరల తయారీ కోసం ఆర్డర్లు లభించాయని కంపెనీ తెలిపింది. ఎడ్జ్కనెక్స్తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ చెన్నైలో ఒక డేటా కేంద్రాన్ని ప్రారంభించిందని.. నోయిడా, హైదరాబాద్లలో డేటా కేంద్రాల నిర్మాణం 81-88% పూర్తయ్యిందని వెల్లడించింది. డిజిటల్ సేవల గిరాకీ అవసరాలకు తగ్గట్లుగా మౌలిక వసతులను అందుబాటులో తెచ్చే నిమిత్తం 2030 కల్లా మొత్తంగా 1 గిగావాట్ సామర్థ్యమున్న 9 డేటా కేంద్రాలను నెలకొల్పే యోచనలో అదానీ ఎంటర్ప్రైజెస్ ఉంది. లోహ వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు ముంద్రాలో రాగి విభాగాన్ని మార్చిలో సంస్థ ప్రారంభించింది.
అదానీ పోర్ట్స్ డివిడెండ్ 300%
దిల్లీ: అదానీ గ్రూప్నకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,014.77 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.1,139.07 కోట్లతో పోలిస్తే ఇది 76.87% అధికం. మొత్తం ఆదాయం రూ.6,178.35 కోట్ల నుంచి రూ.7,199.94 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.3,995 కోట్ల నుంచి రూ.4,450.52 కోట్లకు చేరాయి. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏపీఎస్ఈజెడ్ నికర లాభం 50% పెరిగి రూ.8,103.99 కోట్లుగా నమోదైంది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.6 (300%) చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది.
‘ఏపీఎస్ఈజెడ్ మంచి పని తీరు కనబరిచింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సరకు రవాణా, ఆదాయం, ఎబిటా అంచనా కంటే 6-8% అధికంగా నమోదైంది. నికర అప్పు-ఎబిటా నిష్పత్తి 2.5 రెట్లుగా అంచనా వేయగా, 2.3 రెట్లకు పరిమితం అయ్యింద’ని కంపెనీ పూర్తికాల డైరెక్టర్, సీఈఓ అశ్వినీ గుప్తా వెల్లడించారు. రెండేళ్లలోపే 100 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) సంచిత సరకు రవాణా పరిమాణానికి చేరుకున్నామని, 2025లో 500 ఎంఎంటీ సరకు రవాణా పరిమాణ లక్ష్యాన్ని చేరుకుంటామని గుప్తా పేర్కొన్నారు. దేశ మొత్తం సరకు రవాణాలో 27%, కంటైనర్ కార్గోలో 44% వాటా ఏపీఎస్ఈజెడ్దేనని కంపెనీ తెలిపింది. కార్గో పరిమాణం 2023-24లో 21% పెరిగింది. 2024-25లో ఆదాయం రూ.29,000-31,000 కోట్లకు చేరుతందని, మూలధన వ్యయాలు రూ.10,500-11,500 కోట్ల మధ్య ఉండొచ్చని కంపెనీ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
Narayana Murthy: భారత్లో ప్రతీ విద్యార్థి చదవాల్సిన పుస్తకాన్ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పంచుకున్నారు. అలాగే కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనే అపోహలపైనా స్పందించారు. -
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
Stock Market Closing bell: శుక్రవారం నాటి ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 250 పాయింట్లు పైగా లాభపడగా.. నిఫ్టీ 22,450 మార్క్ పైన స్థిరపడింది. -
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
అనేక పాశ్చాత్య దేశాల సంస్థలు తమ పెట్టుబడులను పెట్టేందుకు భారత్ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారిందని ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణుడు పేర్కొన్నారు. -
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
Super Rich Club: 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తులను సూపర్-రిచ్గా వ్యవహరిస్తుంటారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ఈ జాబితాలో ఎప్పుడూ లేనంతగా 15 మంది చేరారు. -
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
India Economic Growth: ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పుంజుకోవడం వల్ల భారత వృద్ధిరేటు 2024లో బలంగా నమోదవుతుందని ఐరాస అంచనా వేసింది. -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 22,365 దగ్గర కొనసాగుతోంది. -
మళ్లీ 22,400 పైకి నిఫ్టీ
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. -
4 లక్షల కోట్ల డాలర్ల భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. -
మహీంద్రా రూ.37,000 కోట్ల పెట్టుబడులు
మహీంద్రా గ్రూప్ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
కిమ్స్ హాస్పిటల్స్కు రూ.71.6 కోట్ల లాభం
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
261% పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!
మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) అంచనా వేసింది. -
రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం
వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
నరేశ్ గోయెల్ భార్య అనిత కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్ భార్య అనిత గోయెల్(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. -
వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ నయ్యర్ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. -
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్ మృతి
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్ అధికారులు తెలిపారు. -
42 కోట్ల మంది గగన విహారం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. -
రికార్డు గరిష్ఠాలకు వెండి
బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. -
62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్ లాభం
ఎలక్ట్రికల్ స్టీల్ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్-అసెంబ్లీస్, డైకాస్ట్ రోటార్స్ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. -
పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు
పోకర్ణ లిమిటెడ్ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
ఎం అండ్ ఎం లాభం రూ.2,754 కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
-
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్