నష్టాల నుంచి లాభాల్లోకి
ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవ్వడం, సానుకూల తయారీ గణాంకాల మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్ను బలోపేతం చేశాయి.
సమీక్ష
ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవ్వడం, సానుకూల తయారీ గణాంకాల మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్ను బలోపేతం చేశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 83.46 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.02% పెరిగి 84.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ మినహా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
- సెన్సెక్స్ ఉదయం 74,391.73 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం పుంజుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ, 74,812.43 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 128.33 పాయింట్ల లాభంతో 74,611.11 వద్ద ముగిసింది. నిఫ్టీ 43.35 పాయింట్లుపెరిగి 22,648.20 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,567.85- 22,710.50 పాయింట్ల మధ్య కదలాడింది.
- జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎస్ మణియన్ రాజీనామా చేయడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ఇంట్రాడేలో 4.38% నష్టపోయి రూ.1552.55 వద్ద 52 వారాల కనిష్ఠానికి పడింది. చివరకు 2.95% తగ్గి రూ.1,575.80 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ విలువ రూ.9,532.07 కోట్లు కోల్పోయి, రూ.3.13 లక్షల కోట్లకు చేరింది.
- గోద్రేజ్ కుటుంబం ఆస్తులను విభజించుకుంటున్నట్లు ప్రకటించడంతో, గ్రూప్ సంస్థల షేర్లు మిశ్రమంగా ముగిశాయి. గోద్రేజ్ ఇండస్ట్రీస్ 8.60%, గోద్రేజ్ ప్రోపర్టీస్ 6.25%, ఆస్టెక్ లైఫ్సైన్సెస్ 2.15% చొప్పున నష్టపోయాయి. గోద్రేజ్ అగ్రోవెట్ 5.58%, గోద్రేజ్ కన్జూమర్ 2.82% పెరిగాయి.
- మార్చి త్రైమాసికంలో నికర లాభం 13.88% తగ్గడంతో, సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు 5.10% కోల్పోయి రూ.29.20 దగ్గర స్థిరపడింది.
- వచ్చే నాలుగేళ్లలో వ్యాపారాలపై 20 బి.డాలర్ల (సుమారు రూ.1.66 లక్షల కోట్ల) పెట్టుబడులు పెడతామని ప్రకటించడంతో, వేదాంతా షేరు 3.22% పెరిగి రూ.410.70 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,757.64 కోట్లు పెరిగి రూ.1.52 లక్షల కోట్లుగా నమోదైంది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 18 రాణించాయి. పవర్గ్రిడ్ 3.91%, ఏషియన్ పెయింట్స్ 3.36%, టాటా మోటార్స్ 1.99%, ఎన్టీపీసీ 1.72%, టాటా స్టీల్ 1.45%, ఎం అండ్ ఎం 1.31%, టీసీఎస్ 1.08%, సన్ఫార్మా 1.07%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.05% లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్ 1.41%, భారతీ ఎయిర్టెల్ 1.26%, విప్రో 1.09%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.05% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. యుటిలిటీస్ 1.49%, విద్యుత్ 1.47%, సేవలు 1.24%, వాహన 1.17%, లోహ 1.03% పెరిగాయి.
సందీప్ బక్షి తప్పుకోవడం లేదు..ఐసీఐసీఐ బ్యాంక్: తమ ఎండీ, సీఈఓ సందీప్ బక్షి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. ఒక వెబ్సైట్లో వచ్చిన కథనంలో నిజం లేదని ఎక్స్ఛేంజీలకు బ్యాంక్ స్పష్టతనిచ్చింది. 2023 సెప్టెంబరులో ఎండీగా సందీప్ పదవీకాలాన్ని బ్యాంక్ మూడేళ్ల పాటు పొడిగించింది.
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.300- 315గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ఈనెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.3000 కోట్లు సమీకరించనుంది. యాంకర్ మదుపర్లు మే 7న బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్ మదుపర్లు కనీసం 47 షేర్లు దరఖాస్తు చేసుకోవాలి.
ట్రావెల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ టీబీఓ టెక్ లిమిటెడ్ ఐపీఓ మే 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల తాజా షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో 1.25 కోట్ల వరకు షేర్లను ప్రమోటర్లు, పెట్టుబడిదార్లు విక్రయించనున్నారు. ఓఎఫ్ఎస్ పరిమాణం దాదాపు రూ.600 కోట్లుగా ఉండొచ్చని, మొత్తం ఐపీఓ పరిమాణం రూ.1000 కోట్లు అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దిల్లీ- దుబాయ్ అంతర్జాతీయ మార్గంలో ఏ350 విమాన కార్యకలాపాలను ఎయిరిండియా బుధవారం ప్రారంభించింది. రాబోయే నెలల్లో మరిన్ని విదేశీ మార్గాల్లో వైడ్- బాడీ విమానాలను నడిపేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
ఇంజినీరింగ్ అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆటోమోటివ్ సరఫరా సంస్థ ఫోర్వియా నుంచి 45 మిలియన్ యూరోల (సుమారు రూ.400 కోట్లు) కాంట్రాక్టును ఐటీ కంపెనీ ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ అందుకుంది.
నేటి బోర్డు సమావేశాలు: టైటన్ కంపెనీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, బ్రిటానియా, గోద్రేజ్ ప్రోపర్టీస్, ఎంఆర్ఎఫ్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఎంఆర్పీఎల్, టాటా టెక్, రేమండ్, గో ఫ్యాషన్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ, విరించి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
Super Rich Club: 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తులను సూపర్-రిచ్గా వ్యవహరిస్తుంటారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ఈ జాబితాలో ఎప్పుడూ లేనంతగా 15 మంది చేరారు. -
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
India Economic Growth: ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పుంజుకోవడం వల్ల భారత వృద్ధిరేటు 2024లో బలంగా నమోదవుతుందని ఐరాస అంచనా వేసింది. -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 22,365 దగ్గర కొనసాగుతోంది. -
మళ్లీ 22,400 పైకి నిఫ్టీ
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. -
4 లక్షల కోట్ల డాలర్ల భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. -
మహీంద్రా రూ.37,000 కోట్ల పెట్టుబడులు
మహీంద్రా గ్రూప్ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
కిమ్స్ హాస్పిటల్స్కు రూ.71.6 కోట్ల లాభం
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
261% పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!
మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) అంచనా వేసింది. -
రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం
వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
నరేశ్ గోయెల్ భార్య అనిత కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్ భార్య అనిత గోయెల్(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. -
వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ నయ్యర్ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. -
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్ మృతి
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్ అధికారులు తెలిపారు. -
42 కోట్ల మంది గగన విహారం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. -
రికార్డు గరిష్ఠాలకు వెండి
బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. -
62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్ లాభం
ఎలక్ట్రికల్ స్టీల్ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్-అసెంబ్లీస్, డైకాస్ట్ రోటార్స్ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. -
పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు
పోకర్ణ లిమిటెడ్ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
ఎం అండ్ ఎం లాభం రూ.2,754 కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. -
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు