పెట్టుబడులు.. 30 కంపెనీల్లో...
ఐటీఐ మ్యూచువల్ ఫండ్ కేంద్రీకృత పెట్టుబడుల విధానాన్ని అనుసరించే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
ఐటీఐ మ్యూచువల్ ఫండ్ కేంద్రీకృత పెట్టుబడుల విధానాన్ని అనుసరించే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఐటీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 12. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకానికి ధీమంత్ షా, రోహన్ కోర్డే ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. నిఫ్టీ 500 టీఆర్ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా పరిగణిస్తారు. ఇది ఫోకస్డ్ ఫండ్ తరగతికి చెందిన పథకం కాబట్టి, దీని పోర్ట్ఫోలియోలో కంపెనీల సంఖ్య 30కి మించకపోవచ్చు. దీర్ఘకాలం పాటు మదుపరులు ఇలాంటి పథకాల్లో మదుపు కొనసాగిస్తే నిఫ్టీ 50 సూచీ స్థాయిలో లేదా అంతకంటే కొంత అధికంగా ప్రతిఫలాన్ని సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు చెందిన ఫోకస్డ్ ఫండ్ పథకాలు మదుపరులకు అందుబాటులో ఉన్నాయి. గత అయిదేళ్ల కాలంలో ఈ పథకాలు సగటున 12 నుంచి 15 శాతం వరకూ వార్షిక ప్రతిఫలాన్ని నమోదు చేశాయి. ఇదే స్థాయి రాబడి భవిష్యత్తులోనూ వస్తుందనే హామీ లేదు. మొత్తంగా చూస్తే.. తక్కువ నష్టభయం, ఆకర్షణీయమైన ప్రతిఫలం ఈ పథకం నుంచి ఆశించవచ్చు.
వెండిలో పరోక్షంగా
మిరే అసెట్ మ్యూచవల్ ఫండ్ వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునే మదుపరుల కోసం సిల్వర్ ఈటీఎఫ్ పథకాన్ని ఆవిష్కరించింది. మిరే అసెట్ సిల్వర్ ఈటీఎఫ్ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 6న ముగుస్తుంది. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకానికి రితేశ్ పటేల్ ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తారు. వెండి ధర హెచ్చుతగ్గుల ఆధారంగా ఈ పథకంలో మదుపరులకు లాభాలు కనిపించే అవకాశం ఉంటుంది. వెండి వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. ఒకవైపు పారిశ్రామిక అవసరాలు, మరోవైపు ఫ్యాషన్, ఆభరణాల కోసం వెండిని అధికంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు రూ.70,000 దరిదాపుల్లో ఉన్న ఒక కిలో వెండి ధర, వచ్చే కొన్నేళ్లలో రూ.1 లక్షకు మించిపోతుందనే అంచనాలున్నాయి. గత అయిదేళ్లలో వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి ఏటా దాదాపు 13 శాతం రాబడి కనిపించింది. నిఫ్టీ 50 సూచీ కంటే ఇది స్వల్పంగా అధికం. వెండిని నేరుగా కొనుగోలు చేస్తే అమ్మడం కొంత కష్టం. అందువల్ల కేవలం వెండిపై పెట్టుబడి పెట్టాలనుకునే మదుపరులకు మిరే అసెట్ సిల్వర్ ఈటీఎఫ్ వంటి పథకాలు అనువుగా ఉంటాయి.
మధుమేహం ఉన్నా టర్మ్ పాలసీ
మధుమేహంతో బాధపడుతున్న వారికోసం ప్రత్యేకంగా టర్మ్ బీమా పాలసీని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆవిష్కరించింది. ముందస్తు మధుమేహంగల వారూ, టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వారూ ఈ పాలసీని ఎంచుకోవచ్చు. ‘బజాజ్ అలియాంజ్ లైఫ్ డయాబెటిక్ టర్మ్ ప్లాన్ సబ్ 8 హెచ్బీఏ1సీ’ ని 30-60 ఏళ్ల వారు తీసుకునేందుకు వీలుంది. 5-25 ఏళ్ల వ్యవధికి పాలసీని ఎంచుకోవచ్చు. కనీసం రూ.25 లక్షల నుంచి ఎంత మొత్తానికైనా పాలసీని తీసుకోవచ్చు. ప్రీమియాలు నెలనెలా లేదా మూడు, ఆరు నెలలు, ఏడాదికోసారి చెల్లించవచ్చు. ఇది పూర్తిగా రక్షణకే పరిమితమైన పాలసీ. కాబట్టి, వ్యవధి ముగిసిన తర్వాత పాలసీదారుడికి ప్రీమియం వెనక్కి రాదు. ఎలాంటి స్వాధీన విలువా ఉండదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, హెచ్బీఏ1సీ స్థాయి తదితరాలను బట్టి, ప్రీమియం ఆధారపడి ఉంటుంది. 35 ఏళ్ల పొగతాగని వ్యక్తి రూ.50 లక్షల విలువైన పాలసీని, 10 ఏళ్ల వ్యవధికి తీసుకుంటే.. రూ.11,802 ప్రీమియం ఉంటుందని బీమా సంస్థ చెబుతోంది. 20 ఏళ్లకు తీసుకుంటే రూ.14,887 చెల్లించాలి. మధుమేహాన్ని నియంత్రించుకుంటూ.. ఆరోగ్యాన్ని కాపాడుకునే వారిని ప్రోత్సహించేందుకు పాలసీ పునరుద్ధరణ సమయంలో ప్రీమియంలో 10 శాతం రాయితీని అందిస్తుంది. జీవన శైలి వ్యాధులు పెరుగుతున్నాయి. మధుమేహం బాధితులకు టర్మ్ బీమా పాలసీ అందుబాటులో లేకపోవడం వల్ల వారి ఆర్థిక లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఇలాంటి వారికోసం టర్మ్ పాలసీని తీసుకొచ్చామని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ తరుణ్ ఛుగ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.