Gold: బంగారం ఇప్పుడు కొనొచ్చా?
ఇటీవల వరకు కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు కొంతమేర దిగి వచ్చాయి. ఈ లోహ ధరలకు అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువే కీలకం.
గరిష్ఠాల నుంచి 10 గ్రాములకు రూ.4000 తగ్గింది
వెండి కిలోకు రూ.8500 పతనం
డాలర్ విలువ, అంతర్జాతీయ పరిణామాలే కీలకం
ఈనాడు వాణిజ్య విభాగం
ఇటీవల వరకు కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు కొంతమేర దిగి వచ్చాయి. ఈ లోహ ధరలకు అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువే కీలకం. దేశీయంగా కూడా ఏప్రిల్లో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు లేనందున, గిరాకీ తక్కువగానే ఉందని విక్రేతలు చెబుతున్నారు. పుత్తడి ధర బాగా పెరిగిన నేపథ్యంలో పాత ఆభరణాలు మార్చుకుని, కొత్తవి తీసుకోవడం పెరుగుతోందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) కూడా ఇటీవలి నివేదికలో పేర్కొనడం గమనార్హం. ధరలు ఇంకా తగ్గుతాయా, వేచి చూడొచ్చా అని పలువురు ఆలోచిస్తున్నారు.
బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని గరిష్ఠస్థాయులకు చేరడం, మన దేశంలో మహిళలకు శరాఘాతమే అయ్యింది. ఏ శుభకార్యమైనా కొత్త ఆభరణం కొనుగోలు చేసుకోవడంలో వారికి ఉండే ఆసక్తే ఇందుకు కారణం. పాశ్చాత్య దేశాల్లో బంగారం, వెండిపై ఆసక్తి ..పెట్టుబడికి మాత్రమే ఎక్కువగా పరిమితం అవుతుంది. మనం షేర్లపై పెట్టుబడి పెట్టినట్లు, బంగారం-వెండి ఫ్యూచర్ కాంట్రాక్టులు కొనుగోలు చేసి, లాభానికి విక్రయించడం అక్కడ ఎక్కువ. లోహ రూపంలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగేది భారత్, చైనాల్లోనే.
అంతర్జాతీయంగా తక్కువగానే ఉన్నా
అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర గతేడాది మార్చిలో 2052 డాలర్లు పలికితే, ఇప్పుడు 1815 డాలర్లు మాత్రమే ఉంది. అప్పట్లో డాలర్ విలువ రూ.76 కాగా, ఇప్పుడు రూ.82 దగ్గర ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔన్సు బంగారం 1952 డాలర్లు పలుకగా, దేశీయంగా 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం ధర రూ.60,900కు చేరింది. ఫిబ్రవరి నుంచి చూస్తే అంతర్జాతీయంగా ఔన్సు ధర 137 డాలర్లు తగ్గితే, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.4000 తగ్గి, రూ.56900కు చేరింది. అదేవిధంగా కిలో వెండి ధర కూడా రూ.72,000 నుంచి రూ.8500 తగ్గి రూ.63,500 స్థాయికి దిగి వచ్చింది.
ఇంకా తగ్గుతుంది
బంగారం ధర గరిష్ఠస్థాయులకు చేరినప్పుడు కూడా చిన్న పట్టణాల్లో అమ్మకం, ఆ ధర మేర జరగలేదని బులియన్ అసోసియేషన్ ప్రముఖులు తెలిపారు. అప్పట్లో గ్రాముకు రూ.270 చొప్పున తగ్గించే పలు ప్రాంతాల్లో అమ్మకాలు జరిపినట్లు వివరించారు. ఇప్పుడు కూడా ధర మరింత తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా కూడా ఔన్సు బంగారం ధర మరో 40-50 డాలర్లు తగ్గొచ్చని, ఇందువల్ల దేశీయ విపణిలోనూ 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.55,000 స్థాయికి, వెండి కిలో రూ.61,000 దరిదాపులకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. ముంబయి బులియన్ వర్తకులు కూడా ఇదే అంచనాతో ఉన్నారని తెలిపారు. అందువల్ల ధరలను నిత్యం గమనిస్తూ, తాము అనుకున్న ధర వచ్చినప్పుడు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు.
బిల్లు లేకుండా కొనడం ప్రమాదకరమే
పసిడి ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, బిల్లు లేకుండా అయితే కొంత తక్కువకే ఆభరణం లభిస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే పదుల సంఖ్యలో షోరూమ్లను నిర్వహించే కార్పొరేట్ సంస్థలేవీ బిల్లు లేకుండా అమ్మకాలు జరపవు. స్థానికంగా ఉన్న దుకాణదారులు మాత్రమే బిల్లు లేకుండా ఆభరణాలు విక్రయించే అవకాశం ఉంది. అయితే బిల్లు లేకపోయినా, బంగారం ధరలో వ్యాపారులు తగ్గించగలిగేది జీఎస్టీ రూపేణ వసూలు చేసే 3 శాతం మాత్రమే. అంటే రూ.లక్షకు రూ.3000 మాత్రమే ఆదా అవుతుంది. కానీ బిల్లు లేకుండా కొంటే ఆభరణంలోని బంగారం స్వచ్ఛతకు భద్రత ఏమీ ఉండదు. సదరు దుకాణదారుపై నమ్మకంతో కొనుగోలు చేసినా, క్యారెట్ మీటరుతో పరీక్షించుకుంటేనే ఉత్తమం. లేకపోతే 22 క్యారెట్లకు (916 స్వచ్ఛత) బదులు తక్కువ నాణ్యత ఉండే బంగారాన్ని అంటగట్టే ప్రమాదముంది. ఇందువల్ల బిల్లు లేకుండా కొనుగోలు చేసినందున, పొందే లాభం కంటే నష్టపోయే మొత్తమే అధికంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్