Tesla: భారత్లో టెస్లా కోసం ప్రత్యేక పాలసీ లేదు.. స్పష్టతనిచ్చిన కేంద్రం
టెస్లా (Tesla)కు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే ఎలాంటి ప్రణాళిక తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని స్పష్టం చేశారు.
దిల్లీ: భారత్లో టెస్లా (Tesla) కార్ల పరిశ్రమ నెలకొల్పేందుకు ఆ సంస్థకు ప్రోత్సాహకాలు అందివ్వడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి విధివిధానాలను రూపొందించలేదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే, ఆటో అండ్ అడ్వాన్స్డ్ కెమెస్ట్రీ సెల్ (ACC) కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) కింద టెస్లా సంస్థ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ. 18,100 కోట్లు నుంచి రూ. 26,058 కోట్లతో ఆటో, ఆటో విడిభాగాలు, డ్రోన్ పరిశ్రమల కోసం పీఎల్ఐ కింద ప్రత్యేక పథకాన్ని రూపొందించిందని వెల్లడించారు.
‘‘ఇప్పటికే పీఎల్ఐ కింద రూపొందించిన పథకాల గురించి టెస్లాకు చెప్పాం. ఈ పథకం కింద వారు ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయి. ఒక కంపెనీ కోసం కేంద్రం ప్రత్యేకంగా విధివిధానాలను రూపొందించదు. ఇప్పటి వరకు టెస్లాకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలనే ప్రణాళిక కేంద్రం వద్ద లేదు. టెస్లాకు అతిపెద్ద బ్యాటరీ సరఫరాదారుగా ఉన్న పానాసోనిక్ ప్రతినిధులు ఇప్పటికే కేంద్రాన్ని సంప్రదించారు. బ్యాటరీలను తయారుచేస్తున్నట్లు చెప్పారు. పీఎల్ఐ కింద ఏసీసీ బ్యాటరీల కోసం దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించాం ’’ అని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.
పక్షి లోగోకు వీడ్కోలు పలకనున్న ట్విటర్..!
కొద్దినెలల క్రితం భారత్కు వచ్చిన టెస్లా ప్రతినిధులు.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహా వివిధ మంత్రిత్వశాఖ అధికారులతో భేటీ అయ్యారు. అంతేకాకుండా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం మస్క్ మాట్లాడుతూ.. 2024లో తాను భారత్కు రానున్నట్లు ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా టెస్లా పరిశ్రమను భారత్లో నెలకొల్పుతామని తెలిపారు.
రెండేళ్ల క్రితం మస్క్ మాట్లాడుతూ.. భారత్లో విద్యుత్ వాహనాలపై దిగుమతి పన్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. పూర్తిగా తయారైన వాహనాల (CBU) దిగుమతిపై భారత్లో కస్టమ్స్ సుంకం 60 శాతం నుంచి 100 శాతం వరకు ఉంది. ఇంజిన్ పరిమాణం, వ్యయాలు, బీమా, రవాణా విలువల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. అయితే, ప్రస్తుతం చైనా, అమెరికాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా.. చైనాలోని విదేశీ పరిశ్రమలు ఆ దేశాన్ని వీడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ను తమ పెట్టుబడికి ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్