Auto Industry: ఇలాగైతే భారత వాహన పరిశ్రమ వృద్ధి కష్టం.. మారుతీ సుజుకీ ఛైర్మన్
భారత్లో వాహన పరిశ్రమపై విధిస్తున్న పన్నులపై మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్సీ భార్గవ పెదవి విరిచారు. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే వృద్ధి కష్టమని అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత వాహన పరిశ్రమలో కీలక విభాగం అయిన చిన్న కార్లపై నియంత్రణా భారం అధికంగా ఉందని మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా ఛైర్మన్ ఆర్సీ భార్గవ (RC Bhargava) తెలిపారు. అలాగే అన్ని విభాగాల వాహనాలపై ఏకరీతి పన్ను (Uniform Tax) వ్యవస్థ ఉందని తెలిపారు. దీనివల్ల వాహన రంగ (Auto Industry) వృద్ధికి మేలు జరగదని పేర్కొన్నారు. చిన్న కార్ల కొనుగోళ్లు పూర్వస్థాయిలో జరగడం లేదన్నారు. ఇది వాహన పరిశ్రమ (Auto Industry)తో పాటు దేశానికీ మంచిది కాదని సోమవారం ఓ కార్యక్రమంలో అన్నారు.
భారత తయారీ రంగం వేగంగా వృద్ధి చెందితేనే దేశ ఆర్థిక వృద్ధి రేటు పరుగులు పెడుతుందని భార్గవ (RC Bhargava) అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్నప్పటికీ అంతగా ఫలితాలు రావడం లేదన్నారు. క్షేత్రస్థాయి అమలులో లోపాలే దీనికి కారణమన్నారు. వాహన పరిశ్రమలో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదు కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్ల కొనుగోలులో కొత్త కస్టమర్ల సంఖ్య పెరిగితేనే అది సాధ్యమవుతుందన్నారు. ఫలితంగా మొత్తం కార్లు వినియోగించేవారి సంఖ్య పెరిగి మొత్తం పరిశ్రమకు ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రస్తుతం పెద్ద కార్ల విభాగాల్లో మాత్రమే వృద్ధి కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో ఏకరీతి పన్ను వ్యవస్థ ఉండడం సరికాదన్నారు.
ప్రస్తుతం, ఆటోమొబైల్స్పై 28 శాతం జీఎస్టీతో పాటు వాహన రకాన్ని బట్టి 1 శాతం నుంచి 22 శాతం వరకు అదనపు సెస్సు విధిస్తున్నారు. ‘పూర్తిగా తయారు చేసిన యూనిట్లు’గా (CBU) దిగుమతి చేసుకున్న కార్లపై ఇంజిన్ పరిమాణం, ధర, బీమా, రవాణా (CIF).. అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని 60 శాతం నుంచి 100 శాతం మధ్య కస్టమ్స్ సుంకాన్ని విధిస్తున్నారు.
విద్యుత్తు వాహనాల (Electric Vehicles) విషయానికి వస్తే చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని రకాల కార్లపై 5 శాతం జీఎస్టీ (GST) విధిస్తున్నారని భార్గవ గుర్తుచేశారు. దీంతో ఇక్కడ కూడా ఏకరీతి పన్ను వ్యవస్థ అమలవుతోందన్నారు. ఆటో రంగంపై ఇలా భారీ పన్నుల వల్లే పరిశ్రమ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు. భారత్లో వాహన పరిశ్రమను ఎప్పుడూ అత్యధిక పన్ను పరిధిలోనే కొనసాగిస్తూ వచ్చారన్నారు. 50 శాతం పన్నులతో పరిశ్రమ వృద్ధి కాంక్షించడం ఏమాత్రం సరికాదన్నారు. ఈ అంశాన్ని పూర్తిగా పాలకులు, రాజకీయ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నామని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
Maruti Suzuki Swift: అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ మారుతీ సుజుకీ తమ హ్యాచ్బ్యాక్ మోడల్లో కొత్త స్విఫ్ట్ను విడుదల చేసింది. దీని ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
Bajaj Pulsar NS400Z: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్400Z పేరుతో మరో కొత్త పల్సర్ను లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!