Twitter- Elon Musk: మస్క్.. మీ ఆలోచన సరైంది కాదు!
ఎలాన్ మస్క్కు ట్విటర్ ఉద్యోగులు లేఖ రాశారు. సిబ్బందిని తొలగించాలనే ఆలోచన సరైంది కాదని తెలిపారు. అలా చేస్తే కంపెనీ కార్యకలాపాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.
శాన్ఫ్రాన్సిస్కో: ట్విటర్ కొనుగోలు ఒప్పందంలో నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వ్యవహారంపై కంపెనీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ను సొంతం చేసుకుంటే దాదాపు 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చెందిన ఉద్యోగులు కంపెనీ యాజమాన్యాన్ని వివరణ కోరారు. తాజాగా కొంతమంది ఎలాన్ మస్క్కు బహిరంగ లేఖ రాశారు.
సిబ్బందిని తొలగించాలన్న మస్క్ నిర్ణయం అనాలోచితమైందని ఉద్యోగులు లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల ప్రజల సమాచార బట్వాడాకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. ట్విటర్పై యూజర్లకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసినట్లేనని తెలిపారు. పైగా ఉద్యోగులపై బహిరంగ బెదిరింపులకు దిగుతున్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. ఇలా నిరంతర వేధింపుల మధ్య పని చేయడం కష్టతరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రస్తుత, భవిష్యత్తు యాజమాన్యం ముందు ఉద్యోగులు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు.
ఉద్యోగులను తొలగించే విషయంలో కంపెనీలో న్యాయబద్ధమైన విధానాలు ఉండాలని లేఖలో డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుతం ట్విటర్ యాజమాన్యం కల్పిస్తున్న ‘ఇంటి నుంచి పని’ వంటి ప్రయోజనాలన్నింటినీ కొనసాగించాలని మస్క్ను కోరారు. ట్విటర్ను నడిపే విషయంలోనూ కంపెనీ ఉద్యోగులు, మస్క్ మధ్య సైద్ధాంతికపరమైన వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే జాతి, జెండర్, వైకల్యం, రాజకీయ అభిప్రాయాల ఆధారంగా ఉద్యోగులపై పక్షపాతం చూపించొద్దని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా సెమీ కండక్టర్ చిప్ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం. -
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
Warren Buffett: ప్రముఖ మదుపరి, బిలియనీర్ వారెన్ బఫెట్ ఏఐ సాంకేతికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని అణుబాంబుతో పోల్చారు.