UPI: ఈకామర్స్ చెల్లింపుల్లో యూపీఐ హవా.. తగ్గుతున్న డెబిట్ కార్డుల వినియోగం!
UPI: ఈకామర్స్లో డెబిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీల విలువ మొత్తం 2022 ఏప్రిల్లో రూ.21,000 కోట్లుగా నమోదైంది. ఆ మొత్తం 2023 నవంబరులో రూ.16,127 కోట్లకే పరిమితమైంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో చెల్లింపులకు ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)’ వినియోగదారుల తొలి ప్రాధాన్యంగా మారుతోది. దీంతో డెబిట్ కార్డు (Debit cards)ల వాడకం క్రమంగా తగ్గుతున్నట్లు ఆర్బీఐ తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈకామర్స్ పుంజుకుంటున్న నేపథ్యంలో చాలా మంది ఆన్లైన్ లావాదేవీలకు యూపీఐ (UPI) చెల్లింపుల వైపే మొగ్గుచూపుతున్నారు.
గత ఏడాది ఏప్రిల్లో కేంద్ర బ్యాంకు ఈకామర్స్, ఆఫ్లైన్ మర్చంట్ స్వైప్లను విభజించడం ప్రారంభించింది. ఆ సమయంలో ఈకామర్స్లో డెబిట్ కార్డు (Debit cards)ల లావాదేవీల సంఖ్య 117 మిలియన్లుగా నమోదైంది. ఆ సంఖ్య 2023 సెప్టెంబర్ నెలలో సగానికి పైగా తగ్గి 51 మిలియన్లకు పడిపోయింది. అదే సమయంలో లావాదేవీల విలువ మొత్తం రూ.21,000 కోట్ల నుంచి రూ.16,127 కోట్లకు తగ్గింది. ముఖ్యంగా యూపీఐ (UPI) ద్వారా వ్యాపారులకు చేసే చెల్లింపుల సంఖ్య 2.2 బిలియన్ల నుంచి 6.1 బిలియన్లకు ఎగబాకింది. తక్కువ మొత్తం చెల్లింపులకు చాలా మంది యూపీఐ (UPI) వైపే మొగ్గుచూపుతున్నారు. పెద్ద మొత్తంలో లావాదేవీలకి మాత్రమే నెట్ బ్యాంకింగ్ వైపు వెళ్తున్నారు.
ఈకామర్స్లో క్రెడిట్ కార్డు లావాదేవీల సంఖ్య 2022 ఏప్రిల్లో 107 మిలియన్లుగా నమోదయ్యాయి. అది 2023 సెప్టెంబరులో 22 శాతం పెరిగి 131 మిలియన్లకు చేరాయి. విలువ పరంగా చూస్తే రూ.65,652 కోట్ల నుంచి రూ.92,878 కోట్లకు పెరిగినట్లైంది. ఆఫ్లైన్ స్టోర్లలోనూ డెబిట్ కార్డు ద్వారా లావాదేవీల సంఖ్య తగ్గినప్పటికీ.. ఇంకా గణనీయ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ఆఫ్లైన్ స్టోర్లలో డెబిట్ కార్డ్ (Debit cards) స్వైప్ల సంఖ్య 213 మిలియన్ల నుంచి 132 మిలియన్లకు తగ్గింది. యూపీఐ (UPI) చెల్లింపుల్లోని సరళత, క్రెడిట్ కార్డులపై ఆఫర్లు, డిజిటల్ చెల్లింపుల దిశగా ప్రభుత్వ ప్రోత్సాహం వంటి పరిణామాల వల్ల యూపీఐ (UPI) చెల్లింపులకు ఆదరణ పెరుగుతోందని నిపుణులు అంచనా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!