గుర్తింపు ఎన్నికలపై కదలిక
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల అంశంపై కదలిక వచ్చింది. కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా శ్రీనివాసరావును నియమించింది.
13న సింగరేణి కార్మిక సంఘాలతో ఆర్ఎల్సీ భేటీ
శ్రీరాంపూర్ గ్రామీణం, న్యూస్టుడే: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల అంశంపై కదలిక వచ్చింది. కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా శ్రీనివాసరావును నియమించింది. గత మార్చిలోనే ఆయన ఎన్నికల నిర్వహణకు భేటీ కావాలని కార్మిక సంఘాలకు లేఖ రాశారు. అప్పుడు యాజమాన్యం మూడు నెలల గడువు కావాలని కోర్టును ఆశ్రయించింది. మే నెలతో గడువు ముగియడంతో చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు ఈ నెల 13న హైదరాబాద్లో జరిగే సమావేశానికి హాజరు కావాలని కార్మిక సంఘాలకు సమాచారం అందించారు.
సంస్థలో చివరి సారిగా గుర్తింపు సంఘం ఎన్నికలు 2017 అక్టోబర్ 5వ తేదీన నిర్వహించారు. ఇందులో గెలిచిన తెబొగకాసం కాలపరిమితి 2019 అక్టోబర్తో ముగిసింది. తమకు నాలుగేళ్ల కాలపరిమితి ఉందని కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే 2021 అక్టోబర్తో ఆ గడువు పూర్తయింది. కార్మికశాఖ ఇచ్చిన అధికారిక పత్రం ప్రకారం 2019లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కోర్టు కేసు, కరోనా ప్రభావంతో వీటిని నిర్వహించేందుకు యాజమాన్యం ముందుకు రాలేదు. కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్ స్పందించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం సిద్ధంగా ఉండాలని సూచించారు. వార్షిక సంవత్సరం మొదటి మూడు నెలలు ఉత్పత్తిపై ప్రభావం ఉంటుందని జూన్ తర్వాత వీటిని నిర్వహించేందుకు ఇబ్బంది లేదని కోర్టును ఆశ్రయించి గడువు పొందింది.
పార్టీలు, అనుబంధ సంఘాలకు ప్రతిష్ఠాత్మకం
ఈసారి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రధాన పార్టీలు, వాటి అనుబంధ సంఘాలకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతుండటంతో వీటికి ప్రాధాన్యం సంతరించుకొంది. గుర్తింపు ఎన్నికల్లో గెలుపొంది సింగరేణి ప్రాంతాల్లో తమ బలాన్ని మరింత పెంచుకోవాలని భారాస, కాంగ్రెస్, భాజపా, భాకపా పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. వాటి అనుబంధ సంఘాలు తెబొగకాసం, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, ఏఐటీయూసీ గనులపై ప్రచారాలు మొదలు పెట్టాయి. హెచ్చెమ్మెస్ ఎన్నికల వ్యూహంలో నిమగ్నమైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమేనంటూ అధికార, ప్రతిపక్ష సంఘాలన్నీ ఇప్పటికే సంకేతాలు పంపాయి. రోజూ గనులపై ద్వార సమావేశాలు నిర్వహిస్తూ కార్మికులను ఆకర్శించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వేజ్బోర్డులో మెరుగైన ఒప్పందాలు చేసుకున్నామని జాతీయ సంఘాలు కార్మికుల ముందుకొస్తుంటే, ఒప్పందాలతో ఆర్థిక ప్రయోజనాలేవీ లేవని తెబొగకాసం వారికి వివరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 13న కార్మిక సంఘాలు ఆర్ఎల్సీతో జరిగే సమావేశం తర్వాతనే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుంది. ఈ సమావేశంలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముందని కార్మికులు చర్చించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస పార్టీ ఇంటింటి ప్రచారం
[ 10-05-2024]
జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం భారాస నాయకులు విస్తృతంగా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. -
పోలింగ్ వేళ అప్రమత్తత అవసరం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సూచించారు. -
సీపీఐ నాయకుల ముమ్మర ప్రచారం
[ 10-05-2024]
మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న సీపీఐ నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. -
భగత్ సింగ్ నగర్లో సీపీఎం విస్తృత ప్రచారం
[ 10-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో సీపీఎం నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. -
హజ్ యాత్రకు బయలుదేరిన యాత్రికుల బృందం
[ 10-05-2024]
హజ్ యాత్రకు జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ నుంచి 29 మంది గల సభ్యుల బృందం గురువారం రాత్రి బయలుదేరింది. -
పట్టణంలో పోలీసుల కవాతు
[ 10-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. -
ఎన్నికల్లో భాజపాను ఓడించాలి
[ 10-05-2024]
భాజపా దాని మిత్రపక్షాలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(యంఎల్)- మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు -
ఎన్నికల్లో భాజపాను ఓడించాలి
[ 10-05-2024]
భాజపా దాని మిత్రపక్షాలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(యంఎల్)- మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు. -
మూడోసారి మోదీ ప్రధాని కావాలి
[ 10-05-2024]
మోదీ మూడోసారి ప్రధాని కావాలని, అందుకు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో భాజపాను గెలిపించి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. -
మాజీ సర్పంచులు కాంగ్రెస్లో చేరిక
[ 10-05-2024]
తాంసి మండలం జామిడి, బండల్ నాగాపూర్ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
బంగారం దుకాణాల్లో సందడి
[ 10-05-2024]
అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని బంగారం దుకాణాల్లో వినియోగదారుల సందడి నెలకొంది. -
పండగ రోజులా భావించి ఓటేసేందుకు రండి
[ 10-05-2024]
‘ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. కోరుకున్న ప్రభుత్వ విధానాలు అమలు కావాలన్నా.. నచ్చిన ప్రభుత్వం ఏర్పడాలన్నా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. -
మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం బాగుపడ్డదా..తెలంగాణ అప్పుడెట్లుండే. ఇప్పుడెట్లైంది.. కేసీఆర్ ఆనాడే అన్నారు కాంగ్రెస్, భాజపాల మాటలకు మోసపోతే గోసపడుతారని, ఇప్పుడు 5 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం
[ 10-05-2024]
పదేళ్లు అధికారంలో ఉన్న భారాస, భాజపాలు జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. -
సరిహద్దుపై నజర్
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించింది. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. -
బాధ్యతగా ఓటేద్దాం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. అప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. -
గిరిజన కోటలో.. గిరిజనేతరుల ఓట్లే కీలకం
[ 10-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులో గిరిజనులతో పాటు గిరిజనేతరుల ఓట్లు కీలకంగా మారాయి. -
ఓటరు చీటీ అందలేదా.. ఇలా తెలుసుకోండి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటరుకు సంబంధించి ఓటరు చీటీలను ఇంటింటా బీఎల్వోల సాయంతో పంపిణీ చేస్తున్నారు. -
ఎంపీగా గెలిచిన వారికి వసతులు బోలెడు
[ 10-05-2024]
ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తోంది. -
గ్రామస్థులను పలకరించి... కన్నీళ్లు పెట్టుకొని
[ 10-05-2024]
‘పార్టీలను పక్కన పెట్టి మీ ఊరి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఈ గ్రామంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తాను. -
ఓటు వేయడం.. బాద్యతగా భావిద్దాం
[ 10-05-2024]
జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 13న నిర్వహించనున్న ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. -
ఉద్ధృతంగా ఇంటింటి ప్రచారం
[ 10-05-2024]
ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు కీలక నేతలు తమ ప్రచారపంథాను పూర్తిగా మార్చివేశారు. -
ప్రత్యేక కేంద్రం.. శతశాతం లక్ష్యం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు వజ్రాయుధం. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు ఓటరు నమోదు శాతం పెంపునకు కళాజాత బృందాలతో ప్రదర్శనలు, 2కే రన్, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఇక రెండు రోజులే..
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు రోజులు మాత్రమే గడువు ఉండగా.. ప్రచారం శనివారం సాయంత్రానికే పరిసమాప్తం కానుంది. -
అనుమతి ఒకటి.. చేసేది మరొకటి!
[ 10-05-2024]
రహదారి నిర్మాణం కోసం అవసరమైన మొరం కోసం అనుమతులు తీసుకుని యథేచ్ఛగా వెంచర్లకు లారీల్లో మొరం తరలిస్తున్న ఉదంతం ఇది. -
ఫోన్ చేయండి.. కథలు వినండి!
[ 10-05-2024]
కథల పుస్తకాలు చదవడం ద్వారా పిల్లల్లో జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందించవచ్చని మండల విద్యాధికారి ఎం.వెంకటేశ్వరస్వామి అన్నారు. -
చరవాణికి బానిసై విద్యార్థి ఆత్మహత్య
[ 10-05-2024]
చరవాణికి బానిసైన తొమ్మిదో తరగతి విద్యార్థి (17) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!