cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే.. సార్వత్రిక ఎన్నికల(2024)కు నోటిఫికేషన్ విడుదలైంది.
అందుబాటులో ‘సి విజిల్’ యాప్
ఇలా 100 నిమిషాల్లో ఫిర్యాదును పరిష్కరిస్తారు
గవర్నర్పేట, న్యూస్టుడే: రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే.. సార్వత్రిక ఎన్నికల(2024)కు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్) అమల్లోకి వచ్చేసింది. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగైనా సరే గెలవాలనే దురుద్దేశంతో.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. రెచ్చిపోవచ్చు. ఎన్నికల నిబంధనలను సైతం తుంగలో తొక్కేవాళ్లు లేకపోలేదు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థ.. అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేసేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇందులో పౌరులను సైతం భాగస్వాములను చేస్తోంది. ‘సి విజిల్’ యాప్ ద్వారా ఈ అవకాశం కల్పించింది. దాని గురించి తెలుసుకుని, నిబంధనలు ఉల్లంఘించే వారి పని పట్టండిలా...
అసలు.. ఏంటిది..?
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నాటి నుంచి ఈ ‘సి విజిల్’ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో లేదా వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. దీన్ని పౌరులు ఎవరైనా వినియోగించవచ్చు. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు.
రిజిస్టర్ చేసుకోండిలా..
ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో కేంద్ర ఎన్నికల సంఘం వారి ‘సి విజిల్’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ చరవాణి నంబరు ద్వారా దానిలో రిజిస్టర్ చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ‘సి విజిల్’ యాప్ సిద్ధమైనట్లే. దాని ద్వారా మీరు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చు.
ఎలాంటివి చేయవచ్చంటే...
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజు ఓటర్లను వాహనాల్లో తరలించడం. ఇలాంటి ఉల్లంఘనలను ఫొటో లేదా వీడియో లేదా ఆడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి.
ఎలా చేయాలంటే...
మీ యాప్ తెరవగానే తెరపై ‘ఫొటో’, ‘వీడియో’, ‘ఆడియో’ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. మీరు ఫొటో ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే ఫోటో ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. మీ లొకేషన్ నమోదవుతుంది. ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోను అప్లోడ్ చేయండి. ఏ రాష్ట్రం, ఏ నియోజకవర్గం తదితర వివరాలను నమోదు చేయాలి. సదరు ఉల్లంఘనను క్లుప్తంగా వివరించాలి. ఇది ఎన్నికల సంఘానికి చేరుతుంది.
5 నిమిషాల్లో రంగంలోకి అధికారులు..
యాప్లో వివరాలు పొందుపరచగానే జిల్లా ఎన్నికల అధికారి 5 నిమిషాల్లో.. దానిని ఫీల్డ్ యూనిట్కు పంపిస్తారు. వారు 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. విచారించి, 30 నిమిషాల్లో వివరాలు సేకరిస్తారు. అనంతరం ఎన్నికల అధికారికి నివేదిస్తారు. ఆయన దానిపై 50 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. ఇలా 100 నిమిషాల్లో సి విజిల్ యాప్లో చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారు. మీరు చేసిన ఫిర్యాదు స్టేటస్ కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది.
అడ్డుకట్ట వేయండి..
తాయిలాలు పంచి, అక్రమాలకు పాల్పడి అధికార పీఠం ఎక్కాలనుకునే అరాచక రాజకీయ పార్టీలకు ఈ యాప్ ద్వారా చరమ గీతం పాడొచ్చు. ఈ రోజే యాప్ డౌన్లోడ్ చేసుకుని.. ఎక్కడైనా ఎన్నికల ఉల్లంఘన కనిపిస్తే ఫిర్యాదు చేయండి. అక్రమాలకు అడ్డుకట్ట వేయండి. మీ పిల్లలు, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం.. మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సచివాలయానికి వెళ్లలేని వారు.. బ్యాంకుకు ఎలా వెళ్తారు?: వర్ల
[ 29-04-2024]
వెయ్యి మంది ఏపీ పోలీసులు మహారాష్ట్రలో ఎన్నికల విధులకు వెళ్లారని, వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య కోరారు. -
తెదేపాను గెలిపించాలని ఘంటసాలలో ఎన్నారైల ఎన్నికల ప్రచారం
[ 29-04-2024]
అవనిగడ్డ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలను గెలిపించాలని కోరుతూ ఘంటసాలకు చెందిన ప్రవాస భారతీయులు గొర్రెపాటి రంగనాథ బాబు, మూల్పూరి వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఏపీ ఎన్నికలు.. రేపే తెదేపా-భాజపా-జనసేన కూటమి మ్యానిఫెస్టో
[ 29-04-2024]
ఏపీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు తెదేపా-భాజపా-జనసేన కూటమి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది. -
నందిగామలో ఉమ్మడి అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 29-04-2024]
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలంలోని రుద్రవరం, సోమవరం గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తండ్రి హయాం నుంచి డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్: బొండా ఉమా
[ 29-04-2024]
రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని తెదేపా నేత బొండా ఉమా విమర్శించారు. -
అధికారం నీడలో.. అరాచక లాఠీ!
[ 29-04-2024]
ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్ అనేశామన్న బాధే లేదు. -
పట్టాల పేరుతో కోట్లు కొట్టేశారు!
[ 29-04-2024]
జగన్ జమానాలో అవినీతి, అక్రమాల ఆక్టోపస్లు దశదిశలా వేళ్లూనుకుపోయాయి. నేతలు.. కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని నిలువునా దోచేశారు. సెంటు పట్టా పేరుతో భారీ కుంభకోణానికి తెర తీసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. -
బ్యాంకు ఖాతాలకే పింఛను సొమ్ము జమ
[ 29-04-2024]
ఏప్రిల్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
6న అవనిగడ్డకు పవన్ కల్యాణ్
[ 29-04-2024]
ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. -
భారీగా బంగారం.. వెండి పట్టివేత
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. -
బుద్ధవిహార్కు వైకాపా గ్రహణం
[ 29-04-2024]
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. -
కూడూరులో కాగితకు మద్దతు
[ 29-04-2024]
వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
అభివృద్ధే ఆకాంక్ష..ఆశీర్వదించండి: కొల్లు
[ 29-04-2024]
బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. -
ఏకోపాధ్యాయులతో ఎదిగేదెట్టా?
[ 29-04-2024]
ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. -
కదిలితే కేసు.. మెదిలితే నోటీసు
[ 29-04-2024]
ఇలా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. -
వీరి గోడు పట్టించుకునేదెవరు..?
[ 29-04-2024]
నగరంలోని ఏ డివిజన్కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
‘జగన్ వస్తే అవస్థలు తప్పవు..’
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 29-04-2024]
పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి అన్నారు. మండల పరిధిలోని పోసినవారిపాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పలువురు ఆదివారం తెదేపాలో చేరారు. -
అమ్మకు కష్టం.. అందని వైద్యం
[ 29-04-2024]
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు. -
అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు
[ 29-04-2024]
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. -
కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి
[ 29-04-2024]
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైకాపా మాటలు నమ్మి మోసపోవద్దు : వర్ల
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
అభివృద్ధికి బాటలు వేద్దాం రండి
[ 29-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాణ్యమైన విద్యకు భరోసా ఏది జగన్?
[ 29-04-2024]
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్