logo

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి తోట్లవల్లూరు పరిధిలోని బందరు కాలువ సమీపంలో చోటు చేసుకుంది.

Published : 16 Apr 2024 05:30 IST

ప్రవీణ్‌కుమార్‌ (పాతచిత్రం)

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి తోట్లవల్లూరు పరిధిలోని బందరు కాలువ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కాసరనేనిపాలేనికి చెందిన ఆకునూరు ప్రవీణ్‌కుమార్‌(25) తోట్లవల్లూరు శివారు కలాసమాలపల్లిలో నివాసం ఉంటున్న నానమ్మ ఇంటికి ఆదివారం వచ్చాడు. అంబేడ్కర్‌ జయంతి వేడుకలు పాల్గొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో బైక్‌తో తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు బయలుదేరాడు. బందరు కాలువ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రవీణ్‌కుమార్‌(25) పాలిటెక్నిక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. తండ్రి గంగాధర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.విశ్వనాథ్‌ సోమవారం తెలిపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని