మురుగులో కాసుల వేట!
వికారాబాద్ పురపాలక సంఘం పరిధి భూగర్భ మురుగు నీటి సరఫరా వ్యవస్థలో మ్యాన్హోల్ మూతల మరమ్మతుకు పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ డ్రిల్లింగ్ యంత్రాలను వినియోగించి, గుత్తేదారుని పేరిట
సిబ్బందే గుత్తేదారులుగా మారుతున్న వైనం
ఈనాడు డిజిటల్, వికారాబాద్
వికారాబాద్ అగ్నిమాపక కేంద్రం ఎదుట మరమ్మతు చేపడుతున్న సిబ్బంది
* వికారాబాద్ పురపాలక సంఘం పరిధి భూగర్భ మురుగు నీటి సరఫరా వ్యవస్థలో మ్యాన్హోల్ మూతల మరమ్మతుకు పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ డ్రిల్లింగ్ యంత్రాలను వినియోగించి, గుత్తేదారుని పేరిట ఎంబీలు రాయిస్తున్నారు. ఇలా పనులను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలుగా విభజించి సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
* మరో కాలనీలో మున్సిపల్ సిబ్బందితో 50 మీటర్ల మురుగు పైపులైన్ పనులు చేయించారు. దీనికీ బిల్లులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
* ఏడాదిన్నర కిందట వికారాబాద్ ఓ కాలనీలో భూగర్భ మురుగు నీటి పైపులైన్ వేయడానికి సిబ్బంది, పైపులు, జేసీబీ ఇతర అన్ని రకాలుగా మున్సిపాలిటీకి చెందిన వాటిని వినియోగించుకుని రూ.1.25 లక్షల వరకు బిల్లు చేసుకోవాలని ప్రయత్నించారు. ఈ విషయమై ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కావడంతో నిలిపివేశారు.
చేసే పనులు పురపాలక సంఘానివే.. అక్కడ పనిచేసే సిబ్బందికి వేతనాలు చెల్లించేది మున్సిపాలిటీయే.. ఉపయోగించే పరికరాలూ ప్రభుత్వానివే.. అయినా బిల్లుల చెల్లించాలంటూ ఉద్యోగులే గుత్తేదారుగా మారారు. ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చినట్లు.. వారే పనులు చేసినట్లు నకిలీ బిల్లులు రికార్డు చేసి అందినంత జేబులో వేసుకుంటున్నారు. ఈ తతంగం అధికారులకు తెలిసినా తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదంతాజిల్లా కేంద్రమైన వికారాబాద్ పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న కొంత మంది సిబ్బంది మాయాజాలం.
వికారాబాద్ పురపాలక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ టౌన్షిప్గా గర్తించింది. భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరాకు రూ.190 కోట్లకుపైగా నిధులు కేటాయించింది. టెండర్ దక్కించుకున్న సంస్థ పూర్తి స్థాయిలో పనులు చేపట్టకుండానే బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం భూగర్భ మురుగు నీటి వ్యవస్థ నిర్వహణ పేరు చెప్పి కొంత మంది సిబ్బంది జేబులు నింపుకొంటున్నారు. ఇటీవల పట్టణంలో మ్యాన్హోళ్ల మరమ్మతు చేపట్టారు. ఈ సమయంలో పురపాలక యంత్రాలు ఉపయోగించి, సిబ్బందే పనులు చేశారు. రికార్డుల్లో మాత్రం గుత్తేదారు చేపట్టినట్లు ఎంబీలు రికార్డు చేసి, సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
భూగర్భ మురుగు నీటి పారుదల పైపులైన్ వేస్తూ..
పనుల్లో నాణ్యతా అంతంతమాత్రమే...
రాతి పొడి వాడటం వల్ల అవి నెల రోజులే బూడిద తొలగి గుంతలు పడుతున్నాయి. మరో వైపు సెప్టిక్ ట్యాంకుల నిర్వహణ, వాహనాల పనితీరులోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రోజు ఎన్ని ట్యాంకులను శుభ్రం చేసినా, రెండు నుంచి మూడు చలానాలను పురపాలక సంఘానికి చెల్లించి, మిగతావి జేబులో వేసుకుంటున్నారని సమాచారం. చెత్త సేకరణ ఆటోల విషయంలో రోజు దస్త్రాల్లో చూపించే ఖర్చు, వాస్తవాలకు వ్యత్యాసం కనిపిస్తోంది. వాహనాలు నడిపించకుండానే డీజిల్ బిల్లులు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
బిల్లులు నిలిపివేస్తాం
శరత్చంద్ర, పురపాలక సంఘం కమిషనర్
ఈ విషయమై విచారణ జరిపిస్తాం. పురపాలక సిబ్బందితో పనిచేసి పనులకు బిల్లులు పెట్టినట్లు గుర్తిస్తే, వాటిని రద్దు చేస్తాం. బాధ్యులైన సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
[ 08-05-2024]
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
రాజకీయాలకు కేరాఫ్.. కేపీహెచ్బీ టెంపుల్ బస్టాపు
[ 08-05-2024]
ఎన్నికలొచ్చాయంటే 45ఏళ్ల చరిత్ర గల కేపీహెచ్బీ టెంపుల్ బస్టాపు పేరు మార్మోగుతుంది. ఏ పార్టీ నాయకులైనా ఎన్నికల సమయంలో ఈ బస్టాపు కేంద్రంగానే రాజకీయాలు చేస్తుంటారు. -
ఒక్క వానకే.. వణికె
[ 08-05-2024]
అకాలవర్షం నగరంపై విరుచుకుపడింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులతో అస్తవ్యస్తం చేసింది. నిప్పుల కుంపటిలా మారిన నగరానికి వరుణుడు ఉపశమనం కలిగించినా.. విద్యుత్తు తీగలు తెగటం, చెట్లకొమ్మలు విరిగిపడడం.. ట్రాఫిక్ స్తంభించి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఆ వైభవం చూడాలని.. భుజానికెత్తుకొని
[ 08-05-2024]
మహానగరం పరిధిలోని లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో బస్సు యాత్రలో ఉంటే మరో నేత హరీశ్రావు మెదక్ లోక్సభ మీద దృష్టి పెట్టారు. -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ చర్యలు
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు పటిష్ఠ బందోబస్తు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి వెల్లడించారు. 5 లోక్సభ నియోజకవర్గాల్లో విస్తరించిన కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న చర్యలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు. -
ఓటుతో దేశభక్తి చాటండి
[ 08-05-2024]
ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ నగరవాసులకు పిలుపునిచ్చారు. -
ఏడుగురు ఎమ్మెల్యేలు మా వాళ్లే.. ఎంపీ సీటు మాదే
[ 08-05-2024]
‘మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న పార్లమెంట్ నియోజకవర్గం. ఇదో మినీ ఇండియా. భిన్న ప్రాంతాల వారున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు, అన్నిరంగాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. మెట్రో కావాలనే ఆకాంక్ష ఎక్కువ ప్రాంతాల నుంచి వినబడుతోంది. -
ఇంజినీర్ను.. విజన్ ఉంది.. సాంకేతికతతో అభివృద్ధి చేస్తా
[ 08-05-2024]
‘‘దేశంలోని లోక్సభ స్థానాల్లో చేవెళ్ల వైవిధ్యమైనది. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందగా మరికొన్నిచోట్ల కనీస సౌకర్యాల్లేవ్. ఐటీ, రియల్ రంగాల్లో దూసుకెళ్తున్న ప్రాంతాలు కొన్నైతే, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న గ్రామాలు కొన్ని. -
ఓటరు స్లిప్పుల పంపిణీలో అలసత్వం
[ 08-05-2024]
గ్రేటర్లో లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఒకవైపు డిజిటల్ ఫొటో ఓటర్ స్లిప్పులు పంపిణీని వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. స్థానిక సిబ్బంది నిర్లక్ష్యంతో ఇవి ఇంకా ఓటర్లకు చేరడం లేదు. -
ఎన్నికల రద్దీకి అనుగుణంగా బస్సులు
[ 08-05-2024]
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఓటర్లను స్వస్థలాలకు తీసుకువెళ్లడం మా భాద్యత అంటున్నాయ్ ఆర్టీసీలు. ఏపీలో ఓటు న్న నగరవాసులు వెళ్లేందుకు సరిపడా బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ బి.రాజు తెలిపారు. -
పట్నం సునీతారెడ్డిపై సీఈఓకు ఫిర్యాదు
[ 08-05-2024]
మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్కు సంబంధించి వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోలకు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి కారణమంటూ భాజపా నేతలు ఎన్.రామచందర్రావు, గోకుల రామారావు తదితరులు మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఏ అవకాశం వదిలేది లే..!
[ 08-05-2024]
చేవెళ్ల, మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్, భాజపా, భారాస అభ్యర్థులు విజయం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. -
శత శాతం ఓటు.. ప్రజాస్వామ్యానికి చోటు
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం లక్ష్యం. దీంతో ‘శత శాతం’ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓటర్లను కార్యోన్ముఖులను చేస్తున్నారు. -
అవినీతిలో భారాస, కాంగ్రెస్ ఒకటే
[ 08-05-2024]
అవినీతిలో భారాస, కాంగ్రెస్ల మధ్య తేడా ఏమీ లేదని తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై అన్నారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం రాత్రి ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఫైట్) ఆధ్వర్యంలో అన్నామలై, చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో లెట్స్ యునైట్ వికసిత్ భారత్ పేరుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. -
అక్కను నిత్యం వేధిస్తున్నాడని బావ హత్య
[ 08-05-2024]
అక్కను నిత్యం వేధిస్తున్నాడని కక్ష పెంచుకున్న బావమరిది బావను బండరాయితో మోది హత్య చేశాడు. అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరి యోగేందర్(40)కు ఇద్దరు కుమార్తెలు. -
హామీలు అమలు చేసి తీరతాం: కాంగ్రెస్
[ 08-05-2024]
పరిగి, కొడంగల్ పక్కపక్కనే ఉన్నాయి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నేను (ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి) తోడు పెళ్లి కొడుకుని. ఆయనకు వచ్చే లడ్డూ (అభివృద్ధి ఫలాల్లో)ల్లో నాకు ఎక్కువగానే అందుతాయి. వాటిని మీకు తినిపించడానికి అవకాశం కలుగుతుందని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి అన్నారు. -
మళ్లీ మునుపటి పరిస్థితులు పునరావృతం
[ 08-05-2024]
తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని ఎంపీ, భారాస మహబూబ్నగర్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
భారాస చేసిన అభివృద్ధి చూసి ఓటేయండి
[ 08-05-2024]
రాష్ట్రంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటు వేయాలని మాజీ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి, మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పరిగి అసెంబ్లీ ఇంఛార్జి గట్టు రాంచందర్రావు అన్నారు. -
పాలమూరుకు ఏంచేశారో సీఎం చెప్పాలి: అరుణ
[ 08-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని పాలమూరు లోక్సభ భాజపా అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ వచ్చిన ఆమె స్థానిక అంబేడ్కర్ కూడలిలో మాట్లాడుతూ పాలమూరుకు రేవంత్రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. -
ప్రత్యర్థులు ఒక్కటయ్యారు
[ 08-05-2024]
రాజకీయంలో శాశ్వత శత్రువులు.. మిత్రులుండరు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో పలువురు నేతల వ్యవహారం దీనికి అద్దం పట్టేలా మారింది. మొన్నటి వరకు కత్తులు దూసుకుని.. ఆగర్భ శత్రువుల్లా మెలిగిన నేతలు ప్రస్తుతం ఒకే గొడుగు కిందికి చేరారు. -
కాంగ్రెస్, భారాసలకు కాలం చెల్లింది: కొండా
[ 08-05-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్, భారాసలకు కాలం చెల్లిందని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్లో ఆయన సమక్షంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 6వ డివిజన్ కార్పొరేటర్ మమతప్రవీణ్ తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు. -
నూతన ఆవిష్కరణలతో ముందుకు..
[ 08-05-2024]
డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ ‘కాన్స్టెల్లి’ 6వ వార్షికోత్సవం టీహబ్లో జరిగిందని ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హై ఫిడిలిటీ, సిమ్యులేషన్ సొల్యూషన్స్లో ప్రముఖ ప్రొవైడర్ అయిన కాన్స్టెల్లి పోరాట విమానాలు, నిఘా విమానాలు, డ్రోన్లు, వార్ఫేర్ సిస్టమ్, మైక్రోవేవ్ పేలోడ్లలో ప్రోగ్రాం జాప్యాలను తగ్గించే లక్ష్యంతో పనిచేస్తోంది. -
కన్హా శాంతివనంలో గ్లోబల్ టీన్స్ మీట్ ప్రారంభం
[ 08-05-2024]
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని ధ్యాన మందిరంలో గ్లోబల్ టీన్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది. ఈ మీట్లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 500 మంది యువత ప్రత్యక్షంగా, వర్చువల్గా వేల మంది పాల్గొన్నారు. -
కష్టసుఖాలు ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణం
[ 08-05-2024]
కష్టాలు, సుఖాలున్నప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనరెడ్డి అన్నారు. -
మన కారు.. ఎవరూ పోటీ పడలేరు
[ 08-05-2024]
సికింద్రాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్ నాంపల్లి నియోజకవర్గంలో రోడ్షోలో పాల్గొన్నారు. ఓటర్లకు కారు బొమ్మను చూపిస్తూ భారాసకు ఓటేయాల్సిందిగా స్థానికులను అభ్యర్థించారు.