గంజాయి రవాణాకు.. పుష్ప మార్గం
గంజాయి తరలింపులోనూ ఓ ముఠా చాణక్యం ప్రదర్శించింది. అచ్చం పుష్ప సినిమా తరహాలో దాన్ని రవాణా చేస్తూ కటకటాలపాలయ్యారు. హైదరాబాద్ ఉప్పల్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ టి.దేవి రవికాంత్, మల్కాజిగిరి జిల్లా డీపీఈఓ డి.అరుణ్కుమార్, ఏపీ అండ్ ఈఎస్ ముకుందరెడ్డి, ఉప్పల్ అబ్కారీ ఇన్స్పెక్టర్ ఎస్.చంద్రశేఖర్గౌడ్ మంగళవారం తెలిపిన వివరాలివి..
ఉప్పల్లో 440 కిలోల పట్టివేత.. విలువ రూ.కోటి
ఉప్పల్లో చిక్కిన గంజాయి ముఠాను చూపిస్తున్న అబ్కారీ అధికారులు దేవి రవికాంత్, అరుణ్కుమార్ ఇతర సిబ్బంది
ఉప్పల్, న్యూస్టుడే: గంజాయి తరలింపులోనూ ఓ ముఠా చాణక్యం ప్రదర్శించింది. అచ్చం పుష్ప సినిమా తరహాలో దాన్ని రవాణా చేస్తూ కటకటాలపాలయ్యారు. హైదరాబాద్ ఉప్పల్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ టి.దేవి రవికాంత్, మల్కాజిగిరి జిల్లా డీపీఈఓ డి.అరుణ్కుమార్, ఏపీ అండ్ ఈఎస్ ముకుందరెడ్డి, ఉప్పల్ అబ్కారీ ఇన్స్పెక్టర్ ఎస్.చంద్రశేఖర్గౌడ్ మంగళవారం తెలిపిన వివరాలివి..
అనుమానం రాకుండా సినీ ఫక్కీలో..
ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన పెరపురెడ్డి అర్జున్(25), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన నేరళ్ల కిరణ్కుమార్(26), హైదరాబాద్ ఫలక్నుమాకు చెందిన సయ్యద్ తహెర్(24)తో పాటు వీరేంద్రకుమార్, సందీప్, తేజ, ఫజల్ ముఠాగా ఏర్పడ్డారు. ఏపీలోని అరకు నుంచి చేపలు రవాణా చేసే ప్లాస్టిక్ డబ్బాల్లో గంజాయి ప్యాకెట్లను నింపి డీసీఎంలో విశాఖపట్నంకు తెచ్చారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు విశాఖపట్నంలో కొన్ని చేపల డబ్బాలను సైతం వాహనంలో ఎక్కించారు. విశాఖ నుంచి నేరుగా వరంగల్ వచ్చి అక్కడ చేపలు ఉన్న డబ్బాలను దించారు. అక్కడ నుంచి సోమవారం రాత్రి డీసీఎం ఉప్పల్ భగాయత్లోని హెచ్ఎండీఏ లే అవుట్కు చేరుకుంది. ఇక్కడి నుంచి మహారాష్ట్రలోని సాంగ్లి, సోలాపూర్కు తరలించేందుకు కారులోకి గంజాయి ప్యాకెట్లను ఎక్కిస్తున్నారు. పక్కా సమాచారంతో ఉప్పల్ ఆబ్కారీ పోలీసులు దాడి చేశారు. డబ్బాల్లో ఉన్న 440 కిలోల గంజాయి ప్యాకెట్లను, డీసీఎం వ్యాన్, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రూ.కోటికి పైగానే ఉంటుంది. ముఠాలో అర్జున్, కిరణ్కుమార్, తహెర్ మాత్రమే పట్టుబడ్డారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు. వీరిలో కిరణ్పై భద్రాచలం పోలీస్స్టేషన్లో గంజాయి రవాణా కేసు ఉంది. అందరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా..
ఈ ముఠా హైదరాబాద్ కేంద్రంగా గంజాయి దందా చేస్తోంది. అరకు నుంచి హైదరాబాద్ వరకు పెద్ద వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి రాత్రి వేళ కార్లల్లో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలించే సమయంలోనే పక్కా సమాచారంతో ఉప్పల్ ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈత కొలనులో మునిగి చిన్నారి మృతి
[ 10-05-2024]
ఈత కొలనులో మునిగి చిన్నారి మృతి చెందింది. శుక్రవారం మొయినాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది. -
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
[ 10-05-2024]
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని కలిసిన వ్యక్తిని దుండగులు భయపెట్టి రూ.60వేలతో పరారైన ఘటన ఫిల్మ్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
మల్కాజిగిరి.. విలక్షణమే ప్రతిసారీ
[ 10-05-2024]
అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ప్రజల తీర్పు ప్రతిసారీ విలక్షణంగానే ఉంటోంది. 2009లో ఏర్పాటైన ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 31,50,303 మంది ఓటర్లు ఉన్నారు. -
జనం పోటెత్తి.. జాతర హోరెత్తి
[ 10-05-2024]
కాంగ్రెస్ కార్యకర్తల కేరింతలు.. నాయకుల హర్షాతిరేకాల నడుమ సరూర్నగర్ స్టేడియంలో గురువారం రాత్రి ఆ పార్టీ నిర్వహించిన జన జాతర సభ విజయవంతమైంది. -
కమలానికి అండగా.. ప్రచారంలో భిన్నంగా
[ 10-05-2024]
రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా భాజపా ప్రణాళికను అమలు చేస్తోంది. ముఖ్యంగా సంఘ్ పరివార్ ఇందులో కీలక భూమిక పోషిస్తోంది. ఈ పరివారంలోని సభ్యులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. -
ఓటేద్దాం.. ఛాలెంజ్ చేద్దాం
[ 10-05-2024]
ఓటింగ్శాతం పెంచేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ఛాలెంజ్ విసురుతున్నాయి. ‘మీరు ఓటేయండి...మీకు తెలిసిన పది మందికి ఓటేయాలని ఛాలెంజ్ విసరండి’ అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. -
లోక్సభ బరి.. 17 మంది మహిళల గురి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే పోటీ చేస్తున్నారు. మిగిలిన వారు రాష్ట్రంలో పెద్దగా ఉనికి లేని పార్టీలు, స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. -
మోదీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు: కేటీఆర్
[ 10-05-2024]
తెలంగాణ కోసం తెగించి కోట్లాడేది భారాసేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గురువారం అల్వాల్లో ఏర్పాటు చేసిన యువ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. -
లబ్ధిదారులే గెలిపిస్తారు
[ 10-05-2024]
‘హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్లు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. 40 ఏళ్లుగా ఇక్కడ గెలుస్తున్నామని చెప్పుకుంటున్న నేతలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారే తప్ప.. -
కక్కుర్తి పడొద్దు.. భోజనాలు బాగుండాలి
[ 10-05-2024]
ఎన్నికల నిర్వహణలోని అధికారులు, సిబ్బందికి నాసిరకం భోజనం సరఫరా అవుతోంది. అన్నం, కూరలు సరిగా ఉండట్లేదంటూ కొన్ని రోజులుగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
లష్కర్ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు
[ 10-05-2024]
సికింద్రాబాద్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్.. -
నాడు సందడిగా.. నేడు సైలెంట్గా
[ 10-05-2024]
ఎన్నికల ప్రచారమంటేనే హంగూ, ఆర్భాటం అధికం.. మైకుల గోల, కార్యకర్తల హంగామా మామూలుగా ఉండదు..అసెంబ్లీ ఎన్నికలు జరిగి 5 నెలలే అయినా లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం ఆ సందడి కనిపించడం లేదు. -
మోదీతోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు: కొండా
[ 10-05-2024]
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనితీరుతోనే ప్రపంచంలోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
హామీలు అమలు చేస్తాం: కాంగ్రెస్
[ 10-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డిని గెలిపించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఓటర్లను కోరారు. పట్టణంలోని 2,3,4,5,6,25 వార్డులలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. -
మేం ఓటేస్తాం.. మరి మీరు..
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మేధావులు, ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈసారి ఇంటి వద్దే ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. -
బీసీలు ఏకమై కాసానిని గెలిపించాలి
[ 10-05-2024]
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పదేళ్ల పాలన సుభిక్షంగా కొనసాగిందని, ఐదు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా మారిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. -
కొత్త వారికి కలిసొస్తుందా..!
[ 10-05-2024]
చేవెళ్ల లోక్సభ నియోజక వర్గానికి ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ భారాస నుంచి కొత్తగా పోటీచేసిన అభ్యర్థులే విజయం సాధించారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో ఎన్నికల ప్రచారం..ఎక్కువ మంది గుమిగూడడంపై ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు గురువారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. -
మహిళల అభ్యున్నతికి మోదీ ప్రాధాన్యం
[ 10-05-2024]
మహిళల స్వయంసమృద్ధి, ఆత్మగౌరవానికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యమిస్తున్నారని భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, తమిళనాడు దక్షిణ కోయంబత్తూరు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ అన్నారు. -
‘యాదాద్రి కట్టినా.. రాజకీయాలకు వాడుకోలేదు’
[ 10-05-2024]
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం తెల్లాపూర్ ఎంఐజీ కాలనీలో మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచార సభ నిర్వహించారు. -
బాచుపల్లి.. ఘటనలో ఐదుగురి అరెస్టు
[ 10-05-2024]
బాచుపల్లి రేణుకాఎల్లమ్మ కాలనీలో గోడ కూలిన ఘటనపై నమోదైన కేసులో ఐదుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అర్జన్ నిర్మాణ సంస్థకు చెందిన రైజ్ ప్రాజెక్టు వద్ద రక్షణ గోడ కూలడంతో ఏడుగురు వలస కార్మికులు దుర్మరణం -
ప్రధాని రాక.. ట్రాఫిక్ ఆంక్షలు నేడు
[ 10-05-2024]
ఎల్బీ స్టేడియంలో శుక్రవారం భాజపా బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సా.4 గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. -
నన్నొదిలేసి వెళ్లిపోతావా బిడ్డా..
[ 10-05-2024]
షాపింగ్కని తల్లిని తీసుకొచ్చిన కుమారుడు వదిలేసి పలాయనం చిత్తగించిన ఘటన కేపీహెచ్బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్వో వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం.. -
నరేంద్రమోదీ నాయకత్వానికి అండగా నిలవాలి: కిషన్రెడ్డి
[ 10-05-2024]
భారత్ కీర్తిప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిచెప్పిన నరేంద్రమోదీ నాయకత్వానికి ఈ దఫా ఎన్నికల్లోనూ ప్రజలు అండగా నిలవాలని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్రెడ్డి కోరారు. -
కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మరు: కొండా
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని భాజపా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి చేవెళ్ల పట్టణ కేంద్రంలో రోడ్షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం