వంచన.. దాడులు, మోసాలు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నవంబరులో పోకిరీల వేధింపులపై మహిళలనుంచి 98 ఫిర్యాదులు అందగా దర్యాప్తును పూర్తి చేసినట్లు షీ టీమ్స్ డీసీపీ కవిత తెలిపారు.
మహిళలపై నేరాలు ఇలా..
నిందితులపై షీ టీమ్స్ ఉక్కుపాదం
సైబరాబాద్ కమిషనరేట్లో పోకిరీలకు కౌన్సెలింగ్..
రాయదుర్గం, న్యూస్టుడే: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నవంబరులో పోకిరీల వేధింపులపై మహిళలనుంచి 98 ఫిర్యాదులు అందగా దర్యాప్తును పూర్తి చేసినట్లు షీ టీమ్స్ డీసీపీ కవిత తెలిపారు. అత్యధికంగా వాట్సప్లోే 74 ఫిర్యాదులు అందగా 9 మంది నేరుగా షీటీమ్స్ను ఆశ్రయించారు. 13 మంది ఊమెన్ సేఫ్టీ వింగ్లో ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్, క్యూఆర్కోడ్ ద్వారా ఒక్కొక్కరు సంప్రదించారు. వాటిలో ఫోన్ చేసి వేధించినవి 33, బ్లాక్మెయిలింగ్ 14, పెళ్లి పేరుతో మోసగించిన 12 ఫిర్యాదులూ ఉన్నాయి. 29 కేసుల్లో 4 క్రిమినల్ కేసులున్నాయి. ఒక బాల్య వివాహాన్ని అడ్డుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేశారు. 126 మంది పోకిరీలను అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యుల ముందు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితులు వాట్సప్ నంబరు 9490617444, డయల్ 100, సామాజిక మాధ్యమాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని డీసీపీ తెలిపారు.
ప్రేమ పేరుతో..
రాయదుర్గానికి చెందిన ఓ వ్యక్తి తాను వ్యాపారినని, ప్రేమిస్తున్నట్లు చెప్పి ఓ మహిళను నమ్మించాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెను అనుమానిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నాడు. ఆమె కారునూ ధ్వంసం చేశాడు. బాధితురాలు మాదాపూర్ షీ టీమ్స్ను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.
ఫొటోలు, వీడియోలతో..
అల్వాల్లో ఓ వివాహిత చరవాణుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఒక చరవాణి సంస్థలో టీమ్ లీడర్గా పనిచేసే గాజుల రామారం రోడామిస్త్రీనగర్వాసి సయ్యద్ రియాజ్ (32) తరచూ వచ్చి చరవాణుల అమ్మకాలపై వివరాలు సేకరించేవాడు. వేసవిలో ఇంట్లో ఏసీ, గీజర్లు పనిచేయని విషయాన్ని ఆమె తన భర్తకు చెబుతుండగా ఆ వ్యక్తి విని తాను మెకానిక్ తీసుకొచ్చి మరమ్మతులు చేయిస్తానన్నాడు. తర్వాత ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, తనతో నగ్నంగా వీడియోకాల్ చేయాలని లేకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని, ఆమె ఇంటి వద్ద అతికిస్తానని బెదిరిస్తున్నాడు. ఒక రోజు ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు పేట్ బషీర్బాద్ షీ టీమ్స్ను ఆశ్రయించారు.
నమ్మించి.. మోసగించి..
శంషాబాద్కు చెందిన ప్రైవేటు సంస్థలో పనిచేసే సొంటి సందీప్(27) అదే సంస్థలో పనిచేసే ఓ యువతిని ప్రేమ, పెళ్లి అంటూ నమ్మించి మోసగించాడు. ఆమె గర్భం దాల్చగా గర్భస్రావం చేయించాడు. తర్వాత వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. శంషాబాద్ షీ టీమ్స్కు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నంబరు బ్లాక్ చేసినా..
ప్రైవేటు సంస్థలో పనిచేసే ఓ యువతి(22) పెళ్లి సంబంధం ఉంటే చూడాలని తోటి ఉద్యోగితో చెప్పింది. అతడు తన స్నేహితుడు సోమేష్(26)కు చెప్పి ఆమె ఫోన్ నంబరు ఇచ్చాడు. అతడు ఫోన్చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పగా అతడి అలవాట్లు నచ్చక ఆమె నిరాకరించింది. అతడు ఫోన్ చేస్తూ, సంక్షిప్త సందేశాలతో వేధిస్తున్నాడు. అతడి నంబరు బ్లాక్ చేసినా ఇతరుల ఫోన్ తీసుకుని కాల్స్ చేస్తున్నాడు. బాధితురాలు మాదాపూర్ షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారు. విచారణలో అతడికి అప్పటికే పెళ్లయిందని, ముగ్గురు పిల్లలున్నట్లు తేలింది.
ఐటీ కోర్ టీం సహాయంతో
నిజాంపేట్ ప్రాంతంలో.. ఓ బాలిక (17)ను ఓ వ్యక్తి వెంబడిస్తూ ఆమె ఉంటున్న భవనానికి వచ్చాడు. ఆమె లిఫ్టలో ఐదో అంతస్తులోకి వెళ్తుండగా అందులోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి షీ టీమ్స్ బృందాలు అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో అతడిని గుర్తించారు. సైబరాబాద్ ఐటీ కోర్ టీం సహకారంతో అతడి లొకేషన్ను తెలుసుకుని పట్టుకున్నారు. ప్రగతి నగర్కు చెందిన, ఓ రెస్టారెంట్లో పనిచేసే జి.అజయ్ (22)గా గుర్తించారు.
ఫేస్బుక్లో స్నేహం..
ఓ యువతి (20) గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించి చాటింగ్ చేశారు. అతడు ఆమె చరవాణి నంబరు తీసుకుని మాట్లాడటంతో పాటు వీడియో చాటింగ్ చేసుకుంటున్నారు. ఆమెను కలిసి ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడ¢ు. తనతో సంబంధం కొనసాగించాలని లేనిపక్షంలో ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
* మల్కం చెరువు వద్ద ఉదయపు నడకకు వెళ్లిన ఓ మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె షీ టీమ్స్కు ఫిర్యాదుచేయగా మాటు వేసి నిందితుడిని పట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసే బి.రమేష్ (31) ఈ చేష్టలకు పాల్పడినట్టు తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్వం తానై.. సమరానికి సై
[ 07-05-2024]
రాజధాని పరిధిలో మూడు లోక్సభ స్థానాలను దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మహానగరంలో కీలకమైన కాంగ్రెస్ నేతలతో వారం రోజులుగా ఆయన మాట్లాడుతున్నారు. -
హైదరాబాద్లో ఆ ఏడు ప్రాంతాలు హీట్ ఐలాండ్లు
[ 07-05-2024]
చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారి నిప్పు కుంపటిని తలపిస్తోందని హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ తాజాగా విడుదల చేసిన పరిశోధన నివేదిక స్పష్టం చేస్తోంది. -
ఒక క్లిక్తో.. పోలింగ్ కేంద్రం ప్రత్యక్షం
[ 07-05-2024]
‘పోల్ క్యూ రూట్’ యాప్ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. -
ప్రశాంత ఎన్నికలకు సత్వర చర్యలు
[ 07-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
నిరంత విద్యుత్తుకు.. కమాండ్ కంట్రల్ సెంటర్
[ 07-05-2024]
నగరంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. అగ్నిమాపక కమాండ్ కంట్రోల్ సెంటర్ సైతం సిద్ధమవుతోంది. -
ఈవీఎంలు సిద్ధం.. స్ట్రాంగ్ రూముల్లో భద్రం
[ 07-05-2024]
ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధమయ్యాయి. రెండ్రోజుల క్రితం చేపట్టిన కమిషనింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, మంగళవారంతో అన్ని స్ట్రాంగ్ రూముల్లో ముగుస్తుందని ఇంజినీర్లు సోమవారం వెల్లడించారు. -
చేయి చేయి కలిపి.. చెయ్యెత్తి కదిలి
[ 07-05-2024]
అడుగడుగున హారతులు.. బతుకమ్మ ఆటలు.. లంబాడీ నృత్యాలు.. సీఎం రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. సోమవారం రాత్రి కంటోన్మెంట్, అంబర్పేట, ఉప్పల్ పరిధిలో ఆయన రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. -
మలక్పేట శ్రేణులకు దక్కని లోక్సభ
[ 07-05-2024]
మలక్పేట వాసులకు లోక్సభ స్థానం నుంచి ఒక్కసారి కూడా విజయం దక్కలేదు. మలక్పేట నియోజకవర్గం 2009 వరకు నల్గొండ లోక్సభ పరిధిలో ఉండేది. అనంతరం హైదరాబాద్ లోక్సభలోకి మారింది. -
ఐసీఎస్ఈ ఫలితాల్లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రభంజనం
[ 07-05-2024]
ఐసీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రభంజనం సృష్టించింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. వరుసగా 17వ ఏటా శత శాతం ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది. -
అసెంబ్లీకి ఓటేసి.. లోక్సభకు ముఖం చాటేసి
[ 07-05-2024]
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నిక ఏదైనా.. అటు దేశం.. ఇటు రాష్ట్రం, నియోజకవర్గం బాగుపడాలంటే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. రెండు ఎన్నికలకున్న ప్రాధాన్యం ఒకటే. -
ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య
[ 07-05-2024]
ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన కడ్తాల్ ఠాణా పరిధిలోని మక్తమాదారంలో చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురినీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. -
ఆ నాలుగు పార్టీలు నా గెలుపును అడ్డుకోలేవు
[ 07-05-2024]
‘పాతబస్తీలో నివసిస్తున్న ముస్లింలకు తామే రక్షకులమంటూ మజ్లిస్ పార్టీ చెప్పుకుంటోంది. వాస్తవానికి ఇక్కడ వెనుకబాటుతనానికి వారే కారణం. ముస్లింల పేర్లు చెప్పుకొని పాతబస్తీలో భూ కబ్జాలు చేస్తున్నారు. చివరికి శ్మశానాలూ వదల్లేదు. -
గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల పరస్పర దాడులు
[ 07-05-2024]
గాంధీభవన్లో కార్వాన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పరస్పరం దాడి చేసుకున్నారు. సోమవారం పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ను నియోజకవర్గంలో ప్రచారానికి ఆహ్వానించేందుకు కార్వాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉస్మాన్బిన్ అల్హాద్రీ, ఇతర నాయకులు గాంధీభవన్కు వచ్చారు. -
మల్కాజిగిరికి ప్రత్యేక మ్యానిఫెస్టో
[ 07-05-2024]
‘మల్కాజిగిరిలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది. మహిళా ఓటర్లు నా వెనకే ఉన్నారు. మల్కాజిగిరి మినీ భారత్.. అన్ని ప్రాంతాల వారుంటున్నారు. -
కాసానిని ఆశీర్వదించండి: కేటీఆర్
[ 07-05-2024]
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి గత 20 ఏళ్లలో ఏ పార్టీ బీసీ అభ్యర్థిని నిలపలేదని, అలాంటిది భారాస అధినేత కేసీఆర్ 93 బీసీ కులాలను ఏకం చేసిన కాసాని జ్ఞానేశ్వర్ను బరిలో ఉంచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
పాలమూరు... ప్రచార హోరు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ‘మహబూబ్నగర్ (పాలమూరు)’ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంహోరెత్తిస్తున్నారు. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఓటు సద్వినియోగానికి సౌకర్యాల కల్పన
[ 07-05-2024]
జిల్లాలోని దివ్యాంగులకు (మూగ, చెవిటి, అంధ) లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించామని జిల్లా స్వీప్ నోడల్ అధికారి మహ్మద్ అబ్దుల్ సత్తార్ తెలిపారు. -
కేంద్రాలు దూరం.. సాయం అవసరం
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల తేదీ (ఈనెల 13) దగ్గరకొచ్చేస్తోంది.అయితే జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాల కల్పన ఇంకా కొలిక్కి రాలేదు. అసలే ఎండలు మండుతున్నాయి. -
మూడోసారీ మోదీయే ప్రధాని: కొండా
[ 07-05-2024]
ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, మూడోసారీ మోదీయే ప్రధాని అవుతారని చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి
[ 07-05-2024]
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. -
అత్యధిక ఎంపీ స్థానాలు భాజపా కైవసం: గీతామూర్తి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యురాలు, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి ధీమా వ్యక్తం చేశారు. -
మధ్యంతర దరఖాస్తులను పరిష్కరించకుండా తుదితీర్పు చెల్లదు: హైకోర్టు
[ 07-05-2024]
పైగా భూమి దస్తావేజుల రద్దుకు సంబంధించిన వివాదంలో ఇరుపక్షాలు సమర్పించిన ఆధారాలను, మధ్యంతర పిటిషన్లను పరిష్కరించకుండా కింది కోర్టు తుది తీర్పు వెలువరించడం చెల్లదంటూ హైకోర్టు పేర్కొంది. -
మహిళ మెడలోని గొలుసు లాక్కుని పరారీ
[ 07-05-2024]
మహిళ మెడలోని గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు లాక్కుని పరారయ్యారు. వీరిలో ఒకరు యువతి కావడం గమనార్హం. -
‘టెక్ మహీంద్ర’ సహకారంతో.. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ
[ 07-05-2024]
టెక్ మహీంద్ర ఫౌండేషన్ సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు 4 నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు క్యాడర్ సంస్థ ప్రతినిధి నాగరాజు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర