logo

తెరాస-వైకాపా నాటకంలో భాగమే సజ్జల వ్యాఖ్యలు

తెరాస-వైకాపాల నాటకంలో భాగమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు.

Published : 09 Dec 2022 04:58 IST

మీడియాతో మాట్లాడుతున్న చింతల రామచంద్రారెడ్డి, చిత్రంలో గీతామూర్తి, బాబూమోహన్‌, ప్రేమేందర్‌రెడ్డి, చంద్రవదన్‌ తదితరులు

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: తెరాస-వైకాపాల నాటకంలో భాగమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓడిపోతామనే భయంతో తెలంగాణ ముఖ్యమంత్రి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

గుజరాత్‌ విజయోత్సవాలు... గుజరాత్‌లో భాజపా విజయంతో గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలు నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు నిర్వహించారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆర్వీ చంద్రవదన్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రి బాబూమోహన్‌, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, పార్టీ తమిళనాడు సహ ఇంఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సినీ నటి కవిత, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు వేముల అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని