Hyderabad Metro: మెట్రో డీపీఆర్లకు రెండు కన్సల్టెన్సీల ఎంపిక.. ఒక్కో సంస్థకు రెండేసి ప్యాకేజీలు
మెట్రో మూడో దశ విస్తరణ మార్గాల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు అర్హులైన రెండు కన్సల్టెన్సీలను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్ఎల్) ఎంపిక చేసింది.
ఈనాడు, హైదరాబాద్: మెట్రో మూడో దశ విస్తరణ మార్గాల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు అర్హులైన రెండు కన్సల్టెన్సీలను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్ఎల్) ఎంపిక చేసింది. సిస్ట్రా, ఆర్వీ అసోసియేట్స్ ఎంపికైనట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐదు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా, ఆగస్టు 30న టెండర్ కమిటీ పరిశీలన అనంతరం సిస్ట్రా, ఆర్వీ అసోసియేట్స్, యూఎంటీఎస్, రైట్స్ సంస్థలు సాంకేతికత అర్హత సాధించాయి. ఒక్కో ప్యాకేజీలో ఎల్1గా నిల్చిన సంస్థను ఎంపిక చేశారు. దీంతో ఒక్కో సంస్థ రెండు ప్యాకేజీలను దక్కించుకుంది. ఈ సంస్థలు రెండు నెలల్లోగా ప్రాథమిక ప్రాజెక్ట్ నివేదిక (పీపీఆర్)ను అందజేయాలి. ఇందులో ట్రాఫిక్ సర్వేలు, ప్రయాణికుల డిమాండ్, భవిష్యత్తు అంచనాలు, ప్రత్యామ్నాయాలను సూచించాల్సి ఉంటుంది. డీపీఆర్ను మూడు నెలల్లో సమర్పించాలి. మెట్రో రైల్ అలైన్మెంట్ దగ్గర నుంచి స్టేషన్లు, డిపోలు, భూమి మీద ఎక్కడ వెళ్లొచ్చు? ఎలివేటెడ్ అవసరం ఎక్కడ ఉంటుంది? రవాణా ఆధారిత అభివృద్ధి వంటి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలి. టెండర్ దక్కించుకున్న సంస్థలు వెంటనే క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మెట్రో రైలు ఎండీ వెల్లడించారు.
- ప్యాకేజీ-1: బీహెచ్ఈఎల్-ఇస్నాపూర్ (13 కి.మీ), ఎల్బీనగర్-పెద్ద అంబర్పేట (13 కి.మీ.), ఓఆర్ఆర్ పటాన్చెరు- ఓఆర్ఆర్ నార్సింగి (22 కి.మీ.) కలిపి 48 కి.మీ.లకు డీపీఆర్ను సిస్ట్రా ఏజెన్సీ దక్కించుకుంది. రూ.2.55 కోట్లకు బిడ్ వేసింది.
- ప్యాకేజీ-4: జేబీఎస్- తూంకుంట (17 కి.మీ.) డబుల్ ఎలివేటెడ్ మెట్రో, ప్యారడైజ్ -కండ్లకోయ (12 కి.మీ.) డబుల్ ఎలివేటెడ్ మెట్రో, ఓఆర్ఆర్ మేడ్చల్- ఓఆర్ఆర్ పటాన్చెరు (29 కి.మీ.) మొత్తం 58 కి.మీ.మార్గం డీపీఆర్ను సిస్ట్రా దక్కించుకుంది. రూ.2.56 కోట్లకు బిడ్ వేసింది.
- ప్యాకేజీ-2: శంషాబాద్ కూడలి- షాద్నగర్ (28 కి.మీ.), శంషాబాద్ విమానాశ్రయం- కందుకూరు ఫార్మాసిటీ (26 కి.మీ.), ఓఆర్ఆర్ శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ పెద్ద అంబర్పేట (40 కి.మీ.) వరకు మొత్తం 94 కి.మీ. డీపీఆర్ను ఆర్వీ అసోసియేట్స్ దక్కించుకుంది. రూ.3.05 కోట్లకు బిడ్ దాఖలు చేసింది.
- ప్యాకేజీ-3: ఉప్పల్ కూడలి- బీబీనగర్ (25 కి.మీ.), తార్నాక చౌరస్తా- ఈసీఐఎల్ చౌరస్తా (8కి.మీ.), ఓఆర్ఆర్ పెద్ద అంబర్పేట నుంచి ఓఆర్ఆర్ మేడ్చల్ (45 కి.మీ.) మొత్తం 78 కి.మీ. దూరానికి రూ.2.53 కోట్లతో బిడ్ వేసి ఆర్వీ అసోసియేట్స్ దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలిలా.. ప్రచారమెలా..!
[ 03-05-2024]
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
పగలు భగభగలు.. రాత్రిపూట సెగలు
[ 03-05-2024]
మే నెల రాకతో ఎండలు మరింత ముదిరాయి. పగటిపూట భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. -
ఫేస్బుక్లో పరిచయం చేసుకొని.. పిస్తోల్ తెప్పించుకొని!
[ 03-05-2024]
ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. -
ప్రతి గడప ఎక్కాలి.. గెలుపు మాటే వినిపించాలి
[ 03-05-2024]
ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
[ 03-05-2024]
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
కమల దళం.. అధినేతల కదనోత్సాహం
[ 03-05-2024]
నగరంలో భాజపాకు మంచి పట్టుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు కైవసం చేసుకుని సత్తాచాటిన భాజపా.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. పలుచోట్ల రెండో స్థానంలో నిలిచింది. -
నేటి నుంచి తపాలా ఓటింగ్
[ 03-05-2024]
ఈనెల 13న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సరిగ్గా 10 రోజుల ముందు తపాలా ఓటు, ఇంటివద్ద ఓటు ప్రక్రియలు మొదలు కాబోతున్నాయి. -
యువత ఓటెత్తాలి
[ 03-05-2024]
నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 03-05-2024]
ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కనీస ప్రభావం చూపలేక పోతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కొందరికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావడం లేదు. -
అత్యధిక ఓటింగ్ నమోదైంది అప్పుడే!
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది 1991లోనే. -
‘కాంగ్రెస్ వైపే బలహీన వర్గాలు’
[ 03-05-2024]
దళితుల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న కాంగ్రెస్కు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్ జి.చెన్నయ్య పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న బడేభాయ్, చోటాభాయ్: కేటీఆర్
[ 03-05-2024]
అమలు కాని హామీలతో బడే భాయ్ మోదీ, చోటాభాయ్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు. -
చేవెళ్ల.. అభిమానం నిలువెల్లా
[ 03-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి లింగంపల్లి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓటర్లు భిన్నం.. ఓటింగ్ విభిన్నం
[ 03-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది. -
ఉత్కంఠ పోరులో ఆధిక్యాలు స్వల్పమే
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ నమోదైంది హైదరాబాద్లోనే. -
పేద విద్యార్థులకు సహకారం ప్రశంసనీయం
[ 03-05-2024]
చారిత్రక నేపథ్యం కలిగిన రాజ్బహదూర్ వెంకట్రామ్రెడ్డి వసతి గృహ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. -
అంధులు.. చదరంగంలో ఎత్తులు
[ 03-05-2024]
దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో బేగంపేట లోని దేవనార్ పాఠశాలలో ఫిడే రేటింగ్ జాతీయ ఓపెన్ చదరంగం పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. -
‘బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు భాజపా కుట్ర’
[ 03-05-2024]
బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రజేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. -
కాంగ్రెస్లో చేరిన గ్రేటర్ హైదర్బాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల
[ 03-05-2024]
గ్రేటర్ హైదరాబాద్ భారాస మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్ గురువారం సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. -
ఇంటినుంచే ఓటు..ఇక్కట్లకు లేదు చోటు
[ 03-05-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. గతంలో పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారు ఓటు వేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. -
కాంగ్రెస్తోనే ముదిరాజ్లకు గుర్తింపు: రంజిత్రెడ్డి
[ 03-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే ముదిరాజ్లకు సరైన గుర్తింపు లభిస్తుందని చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తెలిపారు. -
ఎంఎన్జేలో రొమ్ము పునర్ నిర్మాణ శస్త్రచికిత్సలు విజయవంతం
[ 03-05-2024]
మారిన జీవన విధానం, అహారపు అలవాట్ల కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. -
హెచ్ఎండీఏలో మరో అవినీతి తిమింగలం!
[ 03-05-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది. -
వైద్య పరీక్షలకు గర్భవిచ్ఛిత్తి చేసుకున్న బాలిక
[ 03-05-2024]
పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొని గుర్తు తెలియని 28 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం అర్ధరాత్రి తరువాత జరిగింది.