Hyderabad: ఎల్ అండ్ టీ మెట్రోకు రూ.2 వేల కోట్లపై సందిగ్ధం!
హైదరాబాద్లో మెట్రోరైలును నిర్మించి నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ కొవిడ్ నష్టాల నుంచి బయట పడేందుకు రూ.3 వేల కోట్లు వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది.
నష్టాల నుంచి బయటపడేందుకు ఇస్తామని గత ప్రభుత్వ హామీ
ఇప్పటివరకు రూ.1000 కోట్లు ఇచ్చారని సంస్థ సీఎఫ్వో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్లో మెట్రోరైలును నిర్మించి నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ కొవిడ్ నష్టాల నుంచి బయట పడేందుకు రూ.3 వేల కోట్లు వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు ఇవ్వగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగింపు నాటికి రూ.900 కోట్లను సమకూర్చింది. 16 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా ఈ రుణాన్ని మంజూరు చేసింది. ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం నుంచి అందిందని ఎల్ అండ్ టీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి (సీఎఫ్వో) ఆర్.శంకరరామన్ తెలిపారు. మెట్రోలో ప్రస్తుతం నిత్యం 4.80 లక్షల మంది దాకా ప్రయాణిస్తున్నారు. వార్షిక నిర్వహణకు రూ.2 వేల కోట్లపైనే అవుతోంది. ఇందులో వడ్డీ చెల్లింపులే అధికం. గత ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం రూ.700 కోట్ల దాకా వచ్చింది. మెట్రో ఆపరేషన్స్ నిర్వహణకు రూ.350 కోట్ల వరకు అవుతోంది. మొత్తంగా ఐదేళ్లలో రూ.5,425 కోట్ల నష్టాలొచ్చినట్లు ఎల్ అండ్ టీ చూపించింది. ఇందులో కొవిడ్ సమయంలో రెండేళ్ల నష్టాలే రూ.3,500 కోట్లుగా ఆర్థిక ఫలితాల్లో చూపింది. ఆదుకోవాలని కోరగా హామీ ఇచ్చిన గత సర్కారు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ సిఫార్సులేవీ బయటకు రాలేదు. అయితే రూ.3 వేల కోట్లను 16 ఏళ్లకు వడ్డీలేని రుణాలుగా ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు ఎల్ అండ్ టీ సీఎఫ్వో తెలిపారు.
భూములు, మాల్స్ గంపగుత్తగా..
మెట్రో ప్రాజెక్ట్లో రవాణా ఆధారిత అభివృద్ధికి 60 ఏళ్లకు ప్రభుత్వం రాయదుర్గంలో 15 ఎకరాల విలువైన భూమి, హైటెక్సిటీ, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మూసారాంబాగ్, రసూల్పురా, మియాపూర్, నాగోల్ తదితర ప్రాంతాల్లో 269 ఎకరాల భూములు కేటాయించింది. వీటిలో నిర్మాణాలు చేపట్టి లీజు, అద్దెకు ఇవ్వడం ద్వారా 45 శాతం ఆదాయం సమకూర్చుకోవాలనేది పీపీపీ ప్రాజెక్టులోని ఒప్పందం. ప్రయాణికుల ఛార్జీల నుంచి 50 శాతం మాత్రమే ఆదాయం సమకూర్చుకునేలా ప్రాజెక్ట్ను డిజైన్ చేశారు. అయితే ఊహించని విధంగా కొవిడ్ రావడంతో మెట్రో మూతపడి భారీ నష్టాలు రావడంతోపాటు మాల్స్ నుంచి వచ్చిన ఆదాయం సున్నా. దీంతో ఈ మాల్స్ను గంపగుత్తగా సబ్ లైసెన్సింగ్కు ఇచ్చేందుకు సర్కారు అనుమతిచ్చిందని ఎల్ అండ్ టీ చెబుతోంది. మాల్స్ కట్టని భూములను సైతం సబ్లైసెన్స్కు అనుమతిచ్చిందంటూ వేర్వేరు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఫలితంగా ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగైందని ఆ సంస్థ చెప్పింది. ఇదేకాకుండా అధిక వడ్డీకి తీసుకున్న రుణాలను చెల్లించి తక్కువ వడ్డీకి రుణాలను తీసుకుంది. ఈ చర్యల ఫలితంగా 2021తో పోలిస్తే పరిస్థితి మెరుగైందని సీఎఫ్వో చెబుతున్నారు. మెరుగైన ఆఫర్ వస్తే మొత్తం ప్రాజెక్ట్ను వేరే ఇన్వెస్టర్కు బదలాయించాలనే ప్రణాళికలో ఎల్ అంట్ టీ ఉంది. వచ్చే ఏడాది ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతోంది. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో ఈ మొత్తం వ్యవహారాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓయో హోటల్లో అగ్నిప్రమాదం
[ 03-05-2024]
-
ఎండలిలా.. ప్రచారమెలా..!
[ 03-05-2024]
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
పగలు భగభగలు.. రాత్రిపూట సెగలు
[ 03-05-2024]
మే నెల రాకతో ఎండలు మరింత ముదిరాయి. పగటిపూట భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. -
ఫేస్బుక్లో పరిచయం చేసుకొని.. పిస్తోల్ తెప్పించుకొని!
[ 03-05-2024]
ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. -
ప్రతి గడప ఎక్కాలి.. గెలుపు మాటే వినిపించాలి
[ 03-05-2024]
ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
[ 03-05-2024]
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
కమల దళం.. అధినేతల కదనోత్సాహం
[ 03-05-2024]
నగరంలో భాజపాకు మంచి పట్టుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు కైవసం చేసుకుని సత్తాచాటిన భాజపా.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. పలుచోట్ల రెండో స్థానంలో నిలిచింది. -
నేటి నుంచి తపాలా ఓటింగ్
[ 03-05-2024]
ఈనెల 13న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సరిగ్గా 10 రోజుల ముందు తపాలా ఓటు, ఇంటివద్ద ఓటు ప్రక్రియలు మొదలు కాబోతున్నాయి. -
యువత ఓటెత్తాలి
[ 03-05-2024]
నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 03-05-2024]
ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కనీస ప్రభావం చూపలేక పోతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కొందరికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావడం లేదు. -
అత్యధిక ఓటింగ్ నమోదైంది అప్పుడే!
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది 1991లోనే. -
‘కాంగ్రెస్ వైపే బలహీన వర్గాలు’
[ 03-05-2024]
దళితుల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న కాంగ్రెస్కు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్ జి.చెన్నయ్య పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న బడేభాయ్, చోటాభాయ్: కేటీఆర్
[ 03-05-2024]
అమలు కాని హామీలతో బడే భాయ్ మోదీ, చోటాభాయ్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు. -
చేవెళ్ల.. అభిమానం నిలువెల్లా
[ 03-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి లింగంపల్లి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓటర్లు భిన్నం.. ఓటింగ్ విభిన్నం
[ 03-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది. -
ఉత్కంఠ పోరులో ఆధిక్యాలు స్వల్పమే
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ నమోదైంది హైదరాబాద్లోనే. -
పేద విద్యార్థులకు సహకారం ప్రశంసనీయం
[ 03-05-2024]
చారిత్రక నేపథ్యం కలిగిన రాజ్బహదూర్ వెంకట్రామ్రెడ్డి వసతి గృహ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. -
అంధులు.. చదరంగంలో ఎత్తులు
[ 03-05-2024]
దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో బేగంపేట లోని దేవనార్ పాఠశాలలో ఫిడే రేటింగ్ జాతీయ ఓపెన్ చదరంగం పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. -
‘బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు భాజపా కుట్ర’
[ 03-05-2024]
బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రజేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. -
కాంగ్రెస్లో చేరిన గ్రేటర్ హైదర్బాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల
[ 03-05-2024]
గ్రేటర్ హైదరాబాద్ భారాస మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్ గురువారం సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. -
ఇంటినుంచే ఓటు..ఇక్కట్లకు లేదు చోటు
[ 03-05-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. గతంలో పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారు ఓటు వేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. -
కాంగ్రెస్తోనే ముదిరాజ్లకు గుర్తింపు: రంజిత్రెడ్డి
[ 03-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే ముదిరాజ్లకు సరైన గుర్తింపు లభిస్తుందని చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తెలిపారు. -
ఎంఎన్జేలో రొమ్ము పునర్ నిర్మాణ శస్త్రచికిత్సలు విజయవంతం
[ 03-05-2024]
మారిన జీవన విధానం, అహారపు అలవాట్ల కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. -
హెచ్ఎండీఏలో మరో అవినీతి తిమింగలం!
[ 03-05-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది. -
వైద్య పరీక్షలకు గర్భవిచ్ఛిత్తి చేసుకున్న బాలిక
[ 03-05-2024]
పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొని గుర్తు తెలియని 28 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం అర్ధరాత్రి తరువాత జరిగింది.