Hyderabad: ఆ అడ్డాలో నిలిచేదెవరు బిడ్డా..?
రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలది ఒకదారైతే.. హైదరాబాద్ది మరో దారిలా ఉంది. మిగిలిన ఎంపీ స్థానాల్లో పోటీకి కాంగ్రెస్, భారాసల్లో అనేక మంది పోటీపడుతుంటే.. హైదరాబాద్ స్థానంలో నిలిచేందుకు రెండు పార్టీల్లోనూ ఒక్కరూ ముందుకు రావడంలేదు.
‘హైదరాబాద్’ నుంచి పోటీకి ముందుకురాని నేతలు
అభ్యర్థిని నిలిపేందుకు రెండు ప్రధాన పార్టీల అన్వేషణ
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలది ఒకదారైతే.. హైదరాబాద్ది మరో దారిలా ఉంది. మిగిలిన ఎంపీ స్థానాల్లో పోటీకి కాంగ్రెస్, భారాసల్లో అనేక మంది పోటీపడుతుంటే.. హైదరాబాద్ స్థానంలో నిలిచేందుకు రెండు పార్టీల్లోనూ ఒక్కరూ ముందుకు రావడంలేదు. దీంతో రెండు పార్టీల అగ్రనేతలు ఇక్కడ అభ్యర్థి కోసం అన్వేషించాల్సి వస్తోంది. అందుకే మూడు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినా హైదరాబాద్కు మాత్రం ఎవరినీ ప్రకటించలేకపోయాయి.
ఎంఐఎంతో రెండు పార్టీల దోస్తీ..!
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఎంఐఎంతో భారాస స్నేహంగా ఉంటోంది. దీంతో ఇక్కడ ఆ పార్టీ తమ అభ్యర్థిని నామమాత్రంగానే పోటీకి పెడుతూ వచ్చింది. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని నిలిపినా పెద్దగా బలాన్ని ప్రదర్శించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం.. మారిన పరిణామాల నేపథ్యంలో హస్తం పార్టీతో ఎంఐఎం స్నేహపూర్వకంగా ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నామమాత్రంగా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. భారాసలోనూ ఇదే విధమైన పరిస్థితి ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎవరో ఒక నేతను అభ్యర్థిగా ప్రకటించడానికి పార్టీ కసరత్తు చేస్తోంది. భాజపా మాత్రం హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించింది.
మైనార్టీల ఇలాకా..
గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్, భారాసలు అధికారికంగా ప్రకటించాయి. కానీ ఇంతవరకు హైదరాబాద్ స్థానానికి అభ్యర్థి ఎంపికపై సమీక్ష కూడా చేయలేదు. ఇక్కడ పోటీ చేయడానికి రెండు పార్టీల నుంచి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, మలక్పేట, కార్వాన్ శాసనసభ నియోజకవర్గాల్లో అధికంగా మైనార్టీ ఓటర్లు ఉంటారు. దీనికి తగ్గట్టే కొన్నేళ్లుగా ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. 1984 నుంచి ఎంఐఎం నేత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ గెలువగా.. తరువాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఇతర పార్టీల అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. ఈ పరిణామాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కూడా ఎంఐఎం ఆధిక్యం ప్రదర్శిస్తుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్ భూతం.. దారుణాలు అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
రాజాసింగ్.. రాస్తా అలగ్
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.