అన్నదాతకు.. అందని ‘సహకారం’
జిల్లాలోని వివిధ సహకార సంఘాల్లో రైతులు రుణాలకు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకుల విలీనంతో అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఎస్బీహెచ్ సౌజన్యంతో సంఘాలు
ఏడాదిగా నిలిచిన రుణ పంపిణీ
న్యూస్టుడే, పెద్దేముల్: జిల్లాలోని వివిధ సహకార సంఘాల్లో రైతులు రుణాలకు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకుల విలీనంతో అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఎస్బీహెచ్ సౌజన్యంతో సంఘాలు కొనసాగాయి. ప్రస్తుతం ఎస్బీఐలో విలీనం కావడంతో అన్నదాతలకు అవస్థలు మొదలయ్యాయి. రుణ ప్రణాళిక రూపొందించినా ఆమోదం లభించని పరిస్థితి. దీంతో పలు సంఘాలు ఖరీఫ్, రబీకి రుణాలు ఇవ్వడంలేదు. కేవలం పునరుద్ధరించి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. దీంతో సంఘం నుంచి బయటికి వచ్చి వాణిజ్య బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. సహకార సంఘాల్లో సభ్యత్వం వదులుకుని చాలా మంది ఇతర బ్యాంకుల్లో రుణం తీసుకుంటున్నారు.
జిల్లాలో కొత్తగడి, ఎక్ మామిడి, పూడూరు, హరిదాన్ పల్లి ప్రాథమిక సహకార సంఘాలు, పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం సుమారు 40 ఏళ్లగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కొనసాగాయి. బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా లావాదేవీలు జరిగేవి. ఏటా రుణ ప్రణాళిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపించే వారు. దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించి రుణాలు ఇచ్చే వారు. బ్యాంకుల విలీనంతో పరిస్థితి మారింది. ఎస్బీఐ అధికారులు రుణాలు ఇవ్వడం నిలిపివేశారు. నిధుల కోసం సహకార సంఘాలు ఏడాదిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకు చిల్లిగవ్వ విదల్చలేదు. కొత్తగడి సోసైటీలో 850 మంది రైతులకు రూ.7 కోట్లు, ఎక్ మామిడిలో 686 మందికి రూ.4.5 కోట్లు, హరిదాన్ పల్లిలో 530 మందికి రూ.3 కోట్లు, పెద్దేముల్లో 2800 మందికి రూ.3 కోట్ల చొప్పున రుణాలు ఇచ్చేందుకు అప్పుల కోసం బ్యాంకులకు ప్రతిపాదనలు పంపించారు. మొత్తం 4,866 మంది రైతులకు రూ.14.5 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది.
డీసీసీబీలో కలుపాలని తీర్మానాలు: చాలా మంది రైతులు అప్పులు చెల్లించి ఇతర బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. రైతులతో కళకళలాడాల్సిన సహకార సంఘాల భవనాలు వెలవెలబోతున్నాయి. కొన్ని చోట్ల సిబ్బంది జీతాలు చెల్లించలేని స్థితి నెలకొంది. వడ్డీలు కట్టుకుని ఖాతాలను రెన్యూవల్ చేస్తున్నారు. రుణమాఫీకి చాలా మంది అన్నదాతలు ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు అనువుగా లేకపోవడంతో ప్రాథమిక సహకార సంఘాలు, పెద్దేముల్ రైతు సహకార సంఘం డీసీసీబీలో విలీనం చేయాలని తీర్మానాలు చేశారు.
సిబ్బందికి జీతాలు ఇవ్వలేక..: పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం 1977లో ఏర్పాటు చేశారు. 22 గ్రామాలకు చెందిన 6 వేలకు పైగా రైతులు సభ్యత్వం పొందారు. అన్నదాతలకు అన్ని రకాల రుణాలను అందజేశారు. ఎరువులు, విత్తనాలను రాయితీపై పంపిణీ చేశారు. చేనేత, ఫౌల్ట్రీ రంగాన్ని ప్రోత్సహించారు. ఇలా 25 ఏళ్ల పాటు వివిధ రకాల తోడ్పాటును అందిస్తూ కళకళలాడింది. లాభాలు రావడంతో సొంత భవనాన్ని సమకూర్చుకున్నారు. ప్రస్తుతం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. రైతుల రాకపోకలు లేక వెలవెలబోతోంది.
బ్యాంకు నుంచి సరైన స్పందన లేదు: విష్ణువర్ధన్రెడ్డి, ఛైర్మన్, పెద్దేముల్ సొసైటీ
సంఘం సమావేశాల్లో, సర్వసభ్య సమావేశాల్లో రుణాల కోసం తీర్మానాలు చేశాం. బ్యాంకుల విలీనంతో మేనేజింగ్ డైరెక్టర్ ను తొలగించారు. రూ.3 కోట్ల రుణానికి ప్రతిపాదనలు పంపించినా స్పందన లేదు. డీసీసీబీలో విలీనం చేయాలని తీర్మానం చేశాం. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. రుణాలు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. తక్షణం బ్యాంకు అధికారులు స్పందించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
[ 08-05-2024]
రెండ్రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
[ 08-05-2024]
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేసింది. -
నాలాలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాలు
[ 08-05-2024]
నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది. బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీ వద్ద ఈ మృతదేహాలను గుర్తించారు. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
[ 08-05-2024]
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
రాజకీయాలకు కేరాఫ్.. కేపీహెచ్బీ టెంపుల్ బస్టాపు
[ 08-05-2024]
ఎన్నికలొచ్చాయంటే 45ఏళ్ల చరిత్ర గల కేపీహెచ్బీ టెంపుల్ బస్టాపు పేరు మార్మోగుతుంది. ఏ పార్టీ నాయకులైనా ఎన్నికల సమయంలో ఈ బస్టాపు కేంద్రంగానే రాజకీయాలు చేస్తుంటారు. -
ఒక్క వానకే.. వణికె
[ 08-05-2024]
అకాలవర్షం నగరంపై విరుచుకుపడింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులతో అస్తవ్యస్తం చేసింది. నిప్పుల కుంపటిలా మారిన నగరానికి వరుణుడు ఉపశమనం కలిగించినా.. విద్యుత్తు తీగలు తెగటం, చెట్లకొమ్మలు విరిగిపడడం.. ట్రాఫిక్ స్తంభించి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఆ వైభవం చూడాలని.. భుజానికెత్తుకొని
[ 08-05-2024]
మహానగరం పరిధిలోని లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో బస్సు యాత్రలో ఉంటే మరో నేత హరీశ్రావు మెదక్ లోక్సభ మీద దృష్టి పెట్టారు. -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ చర్యలు
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు పటిష్ఠ బందోబస్తు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి వెల్లడించారు. 5 లోక్సభ నియోజకవర్గాల్లో విస్తరించిన కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న చర్యలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు. -
ఓటుతో దేశభక్తి చాటండి
[ 08-05-2024]
ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ నగరవాసులకు పిలుపునిచ్చారు. -
ఏడుగురు ఎమ్మెల్యేలు మా వాళ్లే.. ఎంపీ సీటు మాదే
[ 08-05-2024]
‘మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న పార్లమెంట్ నియోజకవర్గం. ఇదో మినీ ఇండియా. భిన్న ప్రాంతాల వారున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు, అన్నిరంగాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. మెట్రో కావాలనే ఆకాంక్ష ఎక్కువ ప్రాంతాల నుంచి వినబడుతోంది. -
ఇంజినీర్ను.. విజన్ ఉంది.. సాంకేతికతతో అభివృద్ధి చేస్తా
[ 08-05-2024]
‘‘దేశంలోని లోక్సభ స్థానాల్లో చేవెళ్ల వైవిధ్యమైనది. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందగా మరికొన్నిచోట్ల కనీస సౌకర్యాల్లేవ్. ఐటీ, రియల్ రంగాల్లో దూసుకెళ్తున్న ప్రాంతాలు కొన్నైతే, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న గ్రామాలు కొన్ని. -
ఓటరు స్లిప్పుల పంపిణీలో అలసత్వం
[ 08-05-2024]
గ్రేటర్లో లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఒకవైపు డిజిటల్ ఫొటో ఓటర్ స్లిప్పులు పంపిణీని వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. స్థానిక సిబ్బంది నిర్లక్ష్యంతో ఇవి ఇంకా ఓటర్లకు చేరడం లేదు. -
ఎన్నికల రద్దీకి అనుగుణంగా బస్సులు
[ 08-05-2024]
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఓటర్లను స్వస్థలాలకు తీసుకువెళ్లడం మా భాద్యత అంటున్నాయ్ ఆర్టీసీలు. ఏపీలో ఓటు న్న నగరవాసులు వెళ్లేందుకు సరిపడా బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ బి.రాజు తెలిపారు. -
పట్నం సునీతారెడ్డిపై సీఈఓకు ఫిర్యాదు
[ 08-05-2024]
మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్కు సంబంధించి వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోలకు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి కారణమంటూ భాజపా నేతలు ఎన్.రామచందర్రావు, గోకుల రామారావు తదితరులు మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఏ అవకాశం వదిలేది లే..!
[ 08-05-2024]
చేవెళ్ల, మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్, భాజపా, భారాస అభ్యర్థులు విజయం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. -
శత శాతం ఓటు.. ప్రజాస్వామ్యానికి చోటు
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం లక్ష్యం. దీంతో ‘శత శాతం’ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓటర్లను కార్యోన్ముఖులను చేస్తున్నారు. -
అవినీతిలో భారాస, కాంగ్రెస్ ఒకటే
[ 08-05-2024]
అవినీతిలో భారాస, కాంగ్రెస్ల మధ్య తేడా ఏమీ లేదని తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై అన్నారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం రాత్రి ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఫైట్) ఆధ్వర్యంలో అన్నామలై, చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో లెట్స్ యునైట్ వికసిత్ భారత్ పేరుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. -
అక్కను నిత్యం వేధిస్తున్నాడని బావ హత్య
[ 08-05-2024]
అక్కను నిత్యం వేధిస్తున్నాడని కక్ష పెంచుకున్న బావమరిది బావను బండరాయితో మోది హత్య చేశాడు. అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరి యోగేందర్(40)కు ఇద్దరు కుమార్తెలు. -
హామీలు అమలు చేసి తీరతాం: కాంగ్రెస్
[ 08-05-2024]
పరిగి, కొడంగల్ పక్కపక్కనే ఉన్నాయి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నేను (ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి) తోడు పెళ్లి కొడుకుని. ఆయనకు వచ్చే లడ్డూ (అభివృద్ధి ఫలాల్లో)ల్లో నాకు ఎక్కువగానే అందుతాయి. వాటిని మీకు తినిపించడానికి అవకాశం కలుగుతుందని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి అన్నారు. -
మళ్లీ మునుపటి పరిస్థితులు పునరావృతం
[ 08-05-2024]
తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని ఎంపీ, భారాస మహబూబ్నగర్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
భారాస చేసిన అభివృద్ధి చూసి ఓటేయండి
[ 08-05-2024]
రాష్ట్రంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటు వేయాలని మాజీ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి, మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పరిగి అసెంబ్లీ ఇంఛార్జి గట్టు రాంచందర్రావు అన్నారు. -
పాలమూరుకు ఏంచేశారో సీఎం చెప్పాలి: అరుణ
[ 08-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని పాలమూరు లోక్సభ భాజపా అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ వచ్చిన ఆమె స్థానిక అంబేడ్కర్ కూడలిలో మాట్లాడుతూ పాలమూరుకు రేవంత్రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. -
ప్రత్యర్థులు ఒక్కటయ్యారు
[ 08-05-2024]
రాజకీయంలో శాశ్వత శత్రువులు.. మిత్రులుండరు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో పలువురు నేతల వ్యవహారం దీనికి అద్దం పట్టేలా మారింది. మొన్నటి వరకు కత్తులు దూసుకుని.. ఆగర్భ శత్రువుల్లా మెలిగిన నేతలు ప్రస్తుతం ఒకే గొడుగు కిందికి చేరారు. -
కాంగ్రెస్, భారాసలకు కాలం చెల్లింది: కొండా
[ 08-05-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్, భారాసలకు కాలం చెల్లిందని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్లో ఆయన సమక్షంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 6వ డివిజన్ కార్పొరేటర్ మమతప్రవీణ్ తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు. -
నూతన ఆవిష్కరణలతో ముందుకు..
[ 08-05-2024]
డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ ‘కాన్స్టెల్లి’ 6వ వార్షికోత్సవం టీహబ్లో జరిగిందని ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హై ఫిడిలిటీ, సిమ్యులేషన్ సొల్యూషన్స్లో ప్రముఖ ప్రొవైడర్ అయిన కాన్స్టెల్లి పోరాట విమానాలు, నిఘా విమానాలు, డ్రోన్లు, వార్ఫేర్ సిస్టమ్, మైక్రోవేవ్ పేలోడ్లలో ప్రోగ్రాం జాప్యాలను తగ్గించే లక్ష్యంతో పనిచేస్తోంది. -
కన్హా శాంతివనంలో గ్లోబల్ టీన్స్ మీట్ ప్రారంభం
[ 08-05-2024]
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని ధ్యాన మందిరంలో గ్లోబల్ టీన్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది. ఈ మీట్లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 500 మంది యువత ప్రత్యక్షంగా, వర్చువల్గా వేల మంది పాల్గొన్నారు. -
కష్టసుఖాలు ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణం
[ 08-05-2024]
కష్టాలు, సుఖాలున్నప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనరెడ్డి అన్నారు. -
మన కారు.. ఎవరూ పోటీ పడలేరు
[ 08-05-2024]
సికింద్రాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్ నాంపల్లి నియోజకవర్గంలో రోడ్షోలో పాల్గొన్నారు. ఓటర్లకు కారు బొమ్మను చూపిస్తూ భారాసకు ఓటేయాల్సిందిగా స్థానికులను అభ్యర్థించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..