Atlee: అట్లీ దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్‌.. టార్గెట్‌ ఎన్ని కోట్లంటే!

దర్శకుడు అట్లీ (Atlee) త్వరలోనే ఓ భారీ మల్టీస్టారర్‌ తీయనున్నట్లు చెప్పారు. అలాగే దాని కలెక్షన్స్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 14 Nov 2023 14:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జవాన్‌’తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు అట్లీ (Atlee). దీంతో ఆయన తర్వాతి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అట్లీ ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళపతి విజయ్‌, షారుక్‌తో (Shah Rukh Khan) కలిసి ఓ మల్టీ స్టారర్‌ తీసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం ఈ మల్టీస్టారర్‌ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నట్లు తెలిపిన అట్లీ.. త్వరలోనే ఇది తెరకెక్కే అవకాశాలున్నట్లు చెప్పారు. ‘‘ఇటీవల ఓ పార్టీలో విజయ్‌, షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నా సినిమాల గురించి మాట్లాడుకొని నాకు ఫోన్‌ చేశారు. మల్టీస్టారర్‌ తీసే ఆలోచన ఉంటే.. అందులో తాను నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు షారుక్‌ చెప్పారు. అలాగే విజయ్‌ కూడా ఇదే మాట అన్నారు. అందుకే వాళ్లిద్దరితో ఓ మల్టీస్టారర్ తీయాలని నిర్ణయించుకున్నా. ఇది నా తర్వాత సినిమాగానే రానుంది. రూ.3000 కోట్లు వసూళ్లు చేసే చిత్రమవుతుంది. ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంటే నేను చెప్పలేను. ఈరోజు నేను ఈస్థాయిలో ఉండడానికి విజయ్‌ మొదటి కారణం. నాపై నమ్మకంతో అవకాశాలిచ్చారు’’ అని అట్లీ చెప్పారు.

మృణాల్‌తో డేటింగ్‌..! స్పందించిన సింగర్‌..

ఇక అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా తీయాలంటూ ఓ ప్రముఖ హాలీవుడ్‌ స్టూడియో తనను సంప్రదించినట్లు చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని