Sreeleela-Rashmika: శ్రీలీల.. రష్మిక.. ఒకరి స్థానంలో మరొకరు!

విజయ్ దేవరకొండ - గౌతమ్‌ తిన్ననూరి సినిమా నుంచి శ్రీలీల (Sreeleela) వైదొలగినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో రష్మికను తీసుకున్నట్లు సమాచారం. అలాగే మరో సినిమాలో రష్మిక స్థానంలో శ్రీలీల ఎంపికైనట్లు టాక్‌ వినిపిస్తోంది.

Published : 26 Sep 2023 14:36 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో రష్మిక, శ్రీలీల ఇద్దరూ టాప్‌లో కొనసాగుతున్నారు. వీళ్లిద్దరూ వరుస పాన్‌ ఇండియా సినిమాల్లో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరూ భామలకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారితీయడంతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. రెండు సినిమాల్లో ఒకరి స్థానంలో మరొకరు మారినట్లు తెలుస్తోంది.

గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ చిత్రం (VD 12) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారు. ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందులో విజయ్‌, శ్రీలీలకు సంబంధించిన ఫొటోషూట్‌ కూడా నిర్వహించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ నుంచి శ్రీలీల వైదొలగినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో రష్మిక వచ్చిందట. దీంతో విజయ్‌ దేవరకొండ  (Vijay Deverakonda), రష్మికల కాంబినేషన్‌ మరోసారి అలరించనుందని అభిమానులు సంబర పడుతున్నారు. 

రజనీకాంత్‌ను కలిసిన లారెన్స్‌.. ఆనందంగా ఉందంటూ పోస్ట్‌

అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ (Nithiin) హీరోగా ఓ చిత్రం (#VNRTrio) ఇటీవల మొదలైంది. చిరంజీవి క్లాప్‌ కొట్టి దీన్ని ప్రారంభించారు. ఇందులో హీరోయిన్‌గా మొదట రష్మికను ఎంపిక చేశారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక వైదొలగిందట. తన స్థానంలో శ్రీలీలను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటికే ఆమెను కలిసి కథ చెప్పారని దీనికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా వీటిపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం రష్మిక (Rashmika)కు నాలుగు బడా ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. ఇటీవలే ‘యానిమల్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ అమ్మడు.. ‘పుష్ప-2’, ‘రెయిన్‌బో’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ఓ తమిళ సినిమాలోనూ కనిపించనుంది. ఇక శ్రీలీల విషయానికొస్తే.. ‘స్కంద’, ‘భగవంత్ కేసరి’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో ఆరు సినిమాలు వరుసలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని