Keerthy Suresh: హైదరాబాద్‌లో కీర్తిసురేశ్‌.. మాస్క్‌ వేసుకుని టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లిన బ్యూటీ

నటి కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) హైదరాబాద్‌లో షికారుకు వెళ్లారు. గచ్చిబౌలిలోని ఓ ఫేమస్‌ హోటల్‌కు వెళ్లి.. టిఫిన్‌ చేసిన ఆమె ఫొటోలు ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

Published : 11 Jun 2023 14:41 IST

హైదరాబాద్‌: తన తదుపరి చిత్రం ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) చిత్రీకరణలో బిజీగా పాల్గొంటున్నారు నటి కీర్తిసురేశ్‌ (Keerthy Suresh). మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆమె చిరంజీవికి సోదరిగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ నేపథ్యంలోనే నగరానికి వచ్చిన కీర్తిసురేశ్‌ షూట్‌ పూర్తైన వెంటనే సరదాగా కాసేపు సిటీలో చక్కర్లు కొట్టారు. తన టీమ్‌తో కలిసి.. గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లారు. అందరితో కలిసి అక్కడ టిఫిన్‌ చేసి.. అనంతరం తనకెంతో ఇష్టమైన తందూరీ టీ తాగారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ఈ వీకెండ్‌ తనకెంతో చక్కగా గడిచిందని ఆమె పేర్కొన్నారు. అయితే, బయటవాళ్లెవరూ తనకు గుర్తు పట్టకుండా ఉండేందుకు ఆమె మాస్క్‌ ధరించారు. కీర్తిసురేశ్‌ షేర్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

‘భోళా శంకర్‌’ విషయానికి వస్తే.. తమిళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘వేదాళం’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. సోదరి సెంటిమెంట్‌ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో చిరంజీవి-కీర్తిసురేశ్‌ అన్నాచెల్లెలుగా కనిపించనున్నారు. తమన్నా కథానాయిక. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. సంగీత్‌కు సంబంధించిన ఓ పాట చిత్రీకరణ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని