Mangalavaaram: ‘మంగళవారం’ అంటున్న పాయల్‌.. అజయ్‌ స్కెచ్‌ అదేనా?

Mangalavaaram: పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికగా దర్శకుడు అజయ్‌ భూపతి ‘మంగళవారం’ అనే సినిమాను ప్రకటించారు.

Published : 25 Apr 2023 16:24 IST

హైదరాబాద్‌: యువతను విశేషంగా ఆకట్టుకున్న చిత్రాల్లో ‘ఆర్‌ఎక్స్‌ 100’ తప్పకుండా ఉంటుంది. అజయ్‌ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సిద్ధార్థ్‌, శర్వాలతో చేసిన మల్టీస్టారర్‌ ‘మహాసముద్రం’ మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర చిత్రాన్ని ప్రకటించారు అజయ్‌. తన తొలి చిత్ర హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ (paayal rajput) కథానాయికగా ‘మంగళవారం’ (Mangalavaram) అనే సినిమాను తీయబోతున్నట్లు తెలిపారు. ఇందులో పాయల్‌ పాత్రను శైలజగా పరిచయం చేశారు. వీపుపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్న పాయల్‌ ఫొటోను పంచుకున్నారు. ఆమె చేతి వేలిపై సీతాకోకచిలుక కనిపించింది. ఓ ఆసక్తికర కథతో ఈ సినిమాను తీర్చిదిద్దితున్నట్లు ఇండస్ట్రీ టాక్‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి ‘మంగళవారం’ టైటిల్ సామాజిక మధ్యమాల్లో బాగా ట్రెండ్‌ అవుతోంది. దీన్నొక క్రైమ్ అండ్ ఎరోటిక్ థ్రిల్లర్‌గా అజయ్‌ భూపతి రూపొందిస్తున్నారట. సినిమా మొత్తం పాయల్ పాత్ర చుట్టే తిరుగుతుందని టాక్‌. హత్యలు జరగడం వెనుక ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్‌ కూడా ఉంటుందట. అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని