Amazon: ఇక చాలు.. ఆఫీసుకు రావాల్సిందే! ఉద్యోగులకు అమెజాన్ వార్నింగ్
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని అమెజాన్ (Amazon) సీఈవో స్పష్టం చేశారు. కంపెనీ నిబంధనను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా పరిస్థితుల కారణంగా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) చేసేందుకు అనుమతించాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వారు ఆఫీసులకు వచ్చి పనిచేయాలని సంస్థలు సూచిస్తున్నాయి. అయితే, కొన్ని సంస్థల ఉద్యోగులు మాత్రం కంపెనీ ఆదేశాలను ఖాతరు చేయడంలేదు. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు ఉద్యోగులకు అల్టిమేటం జారీచేస్తున్నాయి. తాజాగా అమెజాన్ (Amazon) సీఈవో యాండీ జెస్సీ (Andy Jassy) ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్కు రావాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
‘‘ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కుదరదు. వారంలో మూడు రోజులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆఫీసుకు రావాలి. ఇది సంస్థ నిబంధన. ఈ నియమావళి పాటించడం ఇష్టం లేని వారు సంస్థ నుంచి వెళ్లిపోవచ్చు’’అని కంపెనీ అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే.. ఉద్యోగులు మే నెల నుంచి వారంలో మూడు రోజులు కార్యాలయాలకు రావాలని అమెజాన్ సూచించింది. అయితే, కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అప్పట్లో కొంత మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. దీంతో కంపెనీ ఆ నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గినా.. మరోసారి ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కొద్ది రోజుల క్రితం మెటా సైతం ఉద్యోగులు ఆఫీసుకు రావాలని ఆదేశించింది. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని సూచించింది. ఒకవేళ నియామవళిని ఉల్లంఘిస్తే ఇంటికెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. వీటితోపాటు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర సంస్థలు కూడా తమ ఉద్యోగులు వారంలో మూడు రోజులు తప్పనిసరిగా కార్యాలయాల నుంచే పనిచేయాలని సూచించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!