Apple: యాపిల్ వాచ్లపై నిషేధం కత్తి.. సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం ఉరుకులు పరుగులు
Apple watch: యాపిల్ కంపెనీ తన వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2కు నిషేధం ముప్పు పొంచి ఉంది. దీంతో ఆయా వాచ్ల సేల్స్ను ఆ కంపెనీ నిలిపివేసింది.
Apple watch | ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఉరుకులు పరుగులు పెడుతోంది. వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2లో వీలైనంత వేగంగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు వాచ్లలో బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను కొలిచే ఫీచర్ విషయంలో తమ పేటెంట్ను యాపిల్ ఉల్లంఘించిందంటూ మాసిమో కార్పొరేషన్ దావా వేసింది. ఈ వాచ్లపై ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ (ITC) విధించిన నిషేధ ఆదేశాలు డిసెంబర్ 25 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఐటీసీ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో ఈ రెండు రకాల వాచ్ల విక్రయాలను యాపిల్ నిలిపివేసింది. వాటి ప్రచార, ఆన్లైన్ విక్రయాలను సైతం ఆపేసింది. ఈ ఫీచర్తో సంబంధం లేని ఎస్ఈ శ్రేణి వాచ్ల విక్రయాలను మాత్రం యథాతథంగా కొనసాగిస్తోంది. మరోవైపు వీలైనంత వేగంగా బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ సాఫ్ట్వేర్లో మార్పులు చేపట్టేందుకు యాపిల్ ఇంజినీర్లు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఒకవేళ నిషేధం ముప్పు ఎదుర్కొంటే యాపిల్కు 17 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. శ్వేతసౌధం జోక్యం చేసుకుంటే నిషేధం ముప్పు తప్పే అవకాశం ఉంది.
పేటెంట్ ఉల్లంఘనపై దావా వేసిన ‘మాసిమో’ మాత్రం వాచ్లలో కేవలం సాఫ్ట్వేర్ మార్పులు చేపడితే సరిపోదని వాదిస్తోంది. ఆక్సిజన్ స్థాయిలను కొలిచే హార్డ్వేర్ విషయంలోనూ తమకు పేటెంట్ ఉందని గుర్తుచేస్తోంది. మరోవైపు సాఫ్ట్వేర్ మార్పుల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవచ్చని యాపిల్ ఆశిస్తోంది. ఒకవేళ హార్డ్వేర్లోనూ మార్పులు చేయాల్సి వస్తే యాపిల్కు మరో మూడు నెలలు గడువు లభించే అవకాశం ఉంది. కేవలం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, కంపెనీ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం కావడంతో యాపిల్ నిషేధం ముప్పు నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో దాని షేర్లు సైతం స్వల్పంగా కుంగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!