Apple Watch: యాపిల్కు బైడెన్ సర్కారు షాక్.. ఆ స్మార్ట్వాచ్లపై నిషేధం అమల్లోకి..!
Apple Watch: యాపిల్ సరికొత్తగా విడుదల చేసిన రెండు స్మార్ట్వాచ్లపై అమెరికాలో చట్టసమస్యలు ముసురుకొన్నాయి. వీటిపై విధించిన నిషేధాన్ని తొలగించేందుకు బైడెన్ సర్కారు కూడా తాజాగా నిరాకరించింది.
వాషింగ్టన్: అమెరికా (USA)కు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ (Apple)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీకి చెందిన రెండు స్మార్ట్ వాచ్ (Smart Watches)లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు బైడెన్ (Joe Biden) సర్కారు నిరాకరించింది. దీంతో మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి ఆ వాచ్ల విక్రయాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. అమెరికాలో ‘న్యూఇయర్ హాలిడే’ వేళ ఈ నిషేధం పడటంతో యాపిల్ భారీగా నష్టపోయే అవకాశముంది.
యాపిల్ ఇటీవల విడుదల చేసిన సిరీస్ 9, అల్ట్రా 2 వాచ్లకు పేటెంట్ సమస్య ఎదురైంది. వీటిల్లోని బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను కొలిచే ఫీచర్ విషయంలో తమ పేటెంట్ను యాపిల్ ఉల్లంఘించిందంటూ ‘మాసిమో కార్పొరేషన్’, మరో కంపెనీ దావా వేశాయి. దీంతో ఈ రెండు మోడళ్లపై ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ (ITC) అక్టోబరులో నిషేధం విధించింది. అయితే, దీనిని పునఃసమీక్షించేందుకు 60 రోజుల గడువు విధించింది.
ఈ నిషేధాన్ని తొలగించేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు వీటో అధికారం ఉంది. కానీ, యాపిల్ విషయంలో జోక్యం చేసుకునేందుకు వైట్హౌస్ తాజాగా నిరాకరించింది. మరోవైపు, ఈ వాచ్ మోడళ్లపై నిషేధం విధిస్తూ ఐటీసీ తీసుకున్న నిర్ణయంలో యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కేథిరన్ తాయ్ ఎలాంటి మార్పులు చేయలేదని అధికారులు వెల్లడించారు. దీంతో వీటి విక్రయాలపై డిసెంబరు 26 నుంచి నిషేధాజ్ఞలు అధికారికంగా అమల్లోకి వచ్చినట్లయ్యింది.
సినిమా సూపర్హిట్.. టీవీ అంతంతే
కాగా, ఐటీసీ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో ఈ రెండు రకాల వాచ్ల విక్రయాలను యాపిల్ నిలిపివేసింది. డిసెంబరు 21న ఆన్లైన్ స్టోర్, డిసెంబరు 24 నుంచి రిటైల్ స్టోర్లలో వీటిని తొలగించింది. క్రిస్మస్, న్యూఇయర్ హాలిడే సీజన్ కావడంతో ఈ నిషేధం.. యాపిల్పై ఆర్థికంగా ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ సీజన్లో కంపెనీ విక్రయాలు 300 - 400 మిలియన్ డాలర్ల మేర తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోర్టులో యాపిల్ అత్యవసర పిటిషన్..
మరోవైపు, ఈ నిషేధంపై యాపిల్.. స్థానిక కోర్టులో ఎమర్జెన్సీ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పేటెంట్ వివాదంపై తాము వేసిన అప్పీల్పై తుది నిర్ణయం వచ్చేదాకా ఆ రెండు మోడళ్లను విక్రయించేందుకు అనుమతించాలని దానిలో కోరింది. నిషేధంపై స్టే ఇవ్వకపోతే తమకు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిపింది. అయితే, దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి ఆదేశాలివ్వలేదు. ఈ పరిణామాలతో మంగళవారం నాటి ట్రేడింగ్లో యాపిల్ షేర్లు స్వల్పంగా కుంగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్