Bill Gates: బిల్ గేట్స్ మెచ్చిన నెట్ఫ్లిక్స్ సిరీస్ ఇదే..!
Bill Gates: ఏటా వేసవికి ముందు బిల్ గేట్స్ తన ఫాలోవర్లకు కొన్ని పుస్తకాల జబితాను సూచిస్తుంటారు. తాజాగా పుస్తకాలతో పాటు వెబ్సిరీస్, పాటలను కూడా షేర్ చేశారు.
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సహ- వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ (Bill gates) ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. యూట్యూబ్ సహా సోషల్ మీడియాలో వీడియోలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు ఇలా వివిధ రకాలుగా తన ఫాలోవర్లకు కొత్త సమాచారాన్ని అందజేస్తుంటారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్, అంటువ్యాధులపై ఆయన ప్రధానంగా దృష్టి సారిస్తుంటారు. అలాగే టెక్నాలజీలో వస్తున్న మార్పులు వాటి ప్రభావంపై కూడా మాట్లాడుతుంటారు.
ఈ క్రమంలో ఏటా అమెరికాలో వేసవికి ముందు కొన్ని పుస్తకాల జాబితాను గేట్స్ నోట్స్ (Gates Notes) బ్లాగ్ ద్వారా షేర్ చేస్తారు. వీలైతే వాటిని చదవాలని సూచిస్తుంటారు. ఈసారి కూడా బిల్ గేట్స్ కొన్ని పుస్తకాల పేర్లను ప్రస్తావించారు. అయితే, పుస్తకాలతో పాటు ఈసారి వెబ్ సిరీస్లు, పాటల జాబితాను కూడా పంచుకోవడం విశేషం. మరి అవేంటి.. వాటి విశిష్టతలేంటో చూద్దాం..
పుస్తకాలు..
టుమారో, అండ్ టుమారో, అండ్ టుమారో..
ఈ పుస్తక రచయిత గాబ్రియెల్ జెవిన్. ఇది ఒక నవల. ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడుతూ పెరిగిన ఇద్దరు మిత్రుల కథ. కాలేజ్కి వచ్చే సరికి వారు సొంతంగా గేమ్స్ను రూపొందించడం ప్రారంభిస్తారు. ఈ పుస్తకం తన చిన్ననాటి స్నేహితుడు పాల్ అలెన్తో గడిపిన రోజులను గుర్తుచేసిందని బిల్ గేట్స్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ స్థాపన, ఆ సమయంలో ఇరువురు చేసిన కృషిని ఈ పుస్తకం జ్ఞప్తికి తెచ్చినట్లు వెల్లడించారు. గత ఏడాది వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఇదొకటి తెలిపారు. రచయిత జెవిన్ పాత్రలను చాలా చక్కగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.
బోర్న్ ఇన్ బ్లాక్నెస్..
ఈ పుస్తకం ఆఫ్రికా దేశాల చరిత్రను తెలియజేస్తుందని బిల్ గేట్స్ (Bill Gates) తెలిపారు. దీని రచయిత పేరు ఫ్రెంచ్. వాస్తవానికి, ఐరోపావారు ఆఫ్రికాకు రావడానికి ముందే వివిధ ఆఫ్రికన్ రాజ్యాలు పాలన, సైనిక శక్తి, వాణిజ్యం, కళ, పరిశోధనల పరంగా యూరప్నకు పోటీనివ్వగలిగే నగరాలను స్థాపించాయని ఆయన వివరించారు. ఈ పుస్తకం చదివిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఉత్సుకత తనలో కలిగినట్లు గేట్స్ తెలిపారు.
వెబ్సిరీస్..
బోర్గెన్: ఇది అమెరికాలో నెట్ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉన్నట్లు గేట్స్ వెల్లడించారు. ఇది ఒక డానిష్ పొలిటికల్ డ్రామా. క్లిష్ట రాజకీయ పరిస్థితులను అక్కడి తొలి మహిళా ప్రధాని ఎలా అధిగమించారో దీంట్లో చూపించారు. రాజకీయ సంకీర్ణాలు ఎలా ఏర్పడతాయి? ఎలా ముందుకెళ్తాయో చక్కగా చూపించినట్లు గేట్స్ వెల్లడించారు. ఈ సిరీస్ నుంచి చాలా నేర్చుకున్నట్లు తెలిపారు. రాజకీయాలు, కూటముల ఏర్పాటు, నాయకత్వంలో ఉన్న సవాళ్లు, విజయాలపై ఆసక్తి ఉన్నవాళ్లు దీన్ని చూడాలని గేట్స్ సూచించారు.
పాటల జాబితా..
హాలిడే, ఫీల్స్ దిస్ గుడ్, ఫీలింగ్ గుడ్, ఆన్ ది సన్నీ సైడ్ ఆఫ్ ది స్ట్రీట్, షూ బీ డూ బీ డూ డా డే, ది విండ్ క్రైస్ మేరీ, లీన్ ఆన్ మీ, ఇట్స్ ఏ న్యూ డే, దిస్ లవ్, లేడీ, బైలాండో- ఇంగ్లిష్ వెర్షన్, డోంట్ ఫేడ్ సహా మొత్తం 34 పాటలను గేట్స్ షేర్ చేశారు. వీటిలో కొత్త, పాత పాటలు మిళితమై ఉన్నట్లు తెలిపారు. ఇవన్నీ స్పోటిఫైలో అందుబాటులో ఉన్నాయి. మొత్తం పాటల జాబితా గేట్స్ నోట్స్ బ్లాగ్లో అందుబాటులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
TCS CEO Salary: టీసీఎస్ సీఈఓ కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. అదే సమయంలో సీఓఓ గణపతి సుబ్రమణియం రూ.26.18 కోట్ల వేతనాన్ని పొందారు. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
AI Express: ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. కంపెనీ 25 మందిని తొలగించింది. మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది. -
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో 73,321 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతోంది. -
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్
India Economic Superpower: రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారత్ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. దీంట్లో ప్రధాని మోదీతో పాటు అంబానీ, అదానీ కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది. -
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది. -
400 మంది ఇంజినీర్ల నియామకాలు: కోటక్ బ్యాంక్
ఈ ఏడాది దాదాపు 400 మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనిఖీల్లో వెలుగు చూసిన సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు, టెక్నాలజీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని బ్యాంక్ భావిస్తోంది. -
10 కిలోల పెంపుడు జంతువు క్యాబిన్లోనే
తమ దేశీయ విమానాల క్యాబిన్లో 10 కిలోల లోపున్న పెంపుడు జంతువులను అనుమతిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎల్అండ్టీ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.4,396.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,986.78 కోట్లతో పోలిస్తే ఇది 10.2% అధికం. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
తమ వెబ్సైట్లో వేసవి విహారం కోసం శోధించిన వాటి వివరాలను ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
-
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
-
సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు.. టీఎంసీ నేతలపై కేసు వెనక్కి
-
ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!