Gautam Singhania: విడిపోతున్న బిలియనీర్ గౌతమ్ సింఘానియా దంపతులు
Gautam Singhania: రేమాండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. తన భార్య నవాజ్తో విడిపోతున్నట్లు సింఘానియా ప్రకటించారు.
దిల్లీ: ప్రముఖ బిలియనీర్, టెక్స్టైల్ దిగ్గజం రేమాండ్ గ్రూప్ (Raymond Group) ఛైర్మన్, ఎండీ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) తన భార్య నవాజ్ మోదీ (Nawaz Modi) నుంచి విడిపోతున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. మూడు దశాబ్దాల బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. ఇక నుంచి తాము వేర్వేరు దారుల్లో ప్రయాణించనున్నట్లు తెలిపారు.
‘‘గతంలో మాదిరిగా ఈ దీపావళి ఉండబోదు. 32 ఏళ్లుగా జంటగా కలిసి ప్రయాణం చేసిన మేం ఒకరికొకరం అండగా నిలబడ్డాం. నిబద్ధత, సంకల్పం, విశ్వాసంతో ప్రయాణం చేశాం. మా జీవితాల్లోకి మరో ఇద్దర్ని (పిల్లలను) ఆహ్వానించి తల్లిదండ్రులుగా మారాం. కానీ, ఇటీవల జరిగిన కొన్ని దురదృష్టకర పరిణామాల అనంతరం.. ఇక నుంచి నవాజ్, నేను భిన్నమైన దారుల్లో ప్రయాణించాలని భావిస్తున్నా. ఆమె నుంచి నేను విడిపోతున్నా. అయితే తల్లిదండ్రులుగా మా కుమార్తెలు నిహారిక, నీసాకు ఉత్తమ జీవితాన్ని అందించే మా బాధ్యతలను కొనసాగిస్తాం. మా వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి.. మా గోప్యతను కాపాడండి.’’ అని గౌతమ్ సింఘానియా తన పోస్ట్లో వెల్లడించారు.
రిమోట్ వర్క్తో కెరీర్కు నష్టమే..!
58ఏళ్ల గౌతమ్ సింఘానియా 1999లో నవాజ్ మోదీని వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ ఎనిమిదేళ్ల పాటు డేటింగ్ చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. నవాజ్ మోదీ ప్రొఫెషనల్ ఫిట్నెస్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. కాగా.. రెండేళ్ల క్రితం గౌతమ్ సింఘానియా తన తండ్రి విజయ్పత్తో విభేదాల కారణంగా వార్తల్లో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిశ్రామిక ప్రముఖులు ఓటేశారు
లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్లో, సోమవారం ముంబయిలో పారిశ్రామిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
విద్యుత్తు విధాన మార్గదర్శకాలు త్వరలో
మనదేశంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈవీ నూతన విధాన మార్గదర్శకాలను ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. -
సానుకూలతలున్నా.. అప్రమత్తతే!
-
74,360 ఎగువన లాభాలు కొనసాగొచ్చు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. డీఐఐల కొనుగోళ్లు, స్థిరమైన చమురు ధరలు ఇందుకు దోహదపడ్డాయి. -
ఇండియా సిమెంట్స్కు తగ్గిన నష్టం
ఇండియా సిమెంట్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.50.06 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. -
ఆయిల్ ఇండియా 2 షేర్లకు ఒకటి బోనస్
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.2,332.94 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. -
దిల్లీలో ఉబర్ బస్సు సేవలు
‘దిల్లీ ప్రీమియం బస్ స్కీమ్’ కింద దేశ రాజధానిలో బస్సులు తిప్పేందుకు దిల్లీ రవాణా విభాగం నుంచి అగ్రిగేటర్ లైసెన్స్ పొందినట్లు ఉబర్ వెల్లడించింది. -
ఎస్బీఐ ఛైర్మన్ పదవికి నేడు ఇంటర్వ్యూలు
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ పదవికి అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూలను ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) మంగళవారం నిర్వహించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్లో ఐఎస్బీకి దేశంలో ప్రథమ స్థానం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్- 2024 లో మనదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. -
విస్తరణ దిశగా నెక్స్ట్వేవ్
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే హైదరాబాదీ ఎడ్యుటెక్ అంకురం నెక్ట్స్వేవ్ విస్తరణ బాట పట్టింది. -
మార్చిలో 14.41 లక్షల మంది చేరిక: ఈపీఎఫ్ఓ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో ఈ ఏడాది మార్చిలో నికరంగా 14.41 లక్షల మంది సభ్యులు చేరారు. -
సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై కేంద్రం మార్గదర్శకాలు
మనదేశం నుంచి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాలు ఎథిలీన్ ఆక్సైడ్ (ఈటీఓ)తో కలుషితం కాకుండా ఉండేలా చూడడం కోసం కేంద్రం సవివర మార్గదర్శకాలను జారీ చేసింది. -
సంక్షిప్త వార్తలు
పవర్ మెక్ ప్రాజెక్ట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,311.86 కోట్ల ఆదాయంపై రూ.84.41 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
తాజా వార్తలు (Latest News)
-
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
-
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!